దివీస్ లేబొరేటరీస్కు రూ.702 కోట్ల లాభం
దివీస్ లేబొరేటరీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.2,343 కోట్ల ఆదాయాన్ని, రూ.702 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో ఆదాయం రూ.1,997 కోట్లు, నికరలాభం రూ.557 కోట్లు ఉన్నాయి.
ఈనాడు, హైదరాబాద్: దివీస్ లేబొరేటరీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.2,343 కోట్ల ఆదాయాన్ని, రూ.702 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో ఆదాయం రూ.1,997 కోట్లు, నికరలాభం రూ.557 కోట్లు ఉన్నాయి. దీంతో పోల్చితే ఈసారి ఫలితాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఆదాయాల్లో జనరిక్స్- క్రామ్స్ వాటా నిష్పత్తి 47 శాతం, 53 శాతంగా ఉన్నట్లు దివీస్ యాజమాన్యం మదుపరులతో నిర్వహించిన ‘కాన్ఫెరెన్స్ కాల్’ లో వెల్లడించింది. ఎంఎస్డీ (మెర్క్) తో ఒప్పందం ప్రకారం మోల్నుపిరవిర్ ఔషధ కాంట్రాక్టు పూర్తి చేసినట్లు వెల్లడించింది. ఏపీఐ జనరిక్ ఔషధాలపై కొంతకాలంగా ఒత్తిడి కనిపిస్తుండగా, ప్రస్తుతం వ్యయాలు కూడా పెరిగి, ఆ మేరకు లాభాలపై ప్రభావం పడుతున్నట్లు తెలుస్తోంది.
లిథియమ్, కోబాల్ట్ కోసం విదేశాల్లో ఎన్ఎండీసీ అన్వేషణ
దిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండీసీ లిమిటెడ్ లిథియమ్, కోబాల్ట్ తదితర ఖనిజాల కోసం విదేశాల్లో తవ్వకాలు చేట్టాలనే ఆలోచన చేస్తోంది. ఈ ఖనిజాలను విద్యుత్తు వాహనాల బ్యాటరీలు తయారు చేయడానికి వినియోగిస్తారు. దీంతో పాటు రాగి, నికెల్, బంగారం కోసం కూడా అన్వేషించనున్నట్లు ఎన్ఎండీసీ సీఎండీ సుమిత్ దేబ్ తెలిపారు. ఆస్ట్రేలియాలోని లెగసీ ఐరన్ ఓర్ లిమిటెడ్ ద్వారా వీటి కోసం తవ్వకాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ‘భారతీయ లోహాల పరిశ్రమ- భవిష్యత్తు లక్ష్యాలు’ అంశంపై ఫిక్కీ నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వివరాలు తెలిపారు. లెగసీ ఐరన్ ఓర్ లిమిటెడ్లో ఎన్ఎండీసీకి 90 శాతం వాటా ఉంది. ఆఫ్రికా ఖండంలోని టాంజానియా, జింబాబ్వే దేశాల్లో సైతం ఈ ఖనిజాల కోసం తవ్వకాలు చేపట్టాలని భావిస్తున్నట్లు సుమిత్ దేబ్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం నుంచి ఇనుప ఖనిజానికి డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు ఆయన వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?