‘ఫేస్బుక్’లో 11,000 మందికి ఉద్వాసన
ఆదాయాల్లో ఒడుదొడుకులు ఎదురవుతున్న నేపథ్యంలో, ఫేస్బుక్ మాతృసంస్థ మెటా తన ఉద్యోగుల్లో 13 శాతాన్ని అంటే 11,000 మందిని తొలగిస్తున్నట్లు కంపెనీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) మార్క్ జుకర్ బర్గ్ వెల్లడించారు.
మొత్తం సిబ్బందిలో 13 శాతానికి సమానం
న్యూయార్క్: ఆదాయాల్లో ఒడుదొడుకులు ఎదురవుతున్న నేపథ్యంలో, ఫేస్బుక్ మాతృసంస్థ మెటా తన ఉద్యోగుల్లో 13 శాతాన్ని అంటే 11,000 మందిని తొలగిస్తున్నట్లు కంపెనీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) మార్క్ జుకర్ బర్గ్ వెల్లడించారు. ‘కరోనా అనంతరమూ వేగవంతమైన వృద్ధి ఉంటుందన్న అంచనాలతో, గతంలో నియామకాల విషయంలో దూకుడుగా నిర్ణయం తీసుకున్నాం. దురదృష్టవశాత్తు నేను అంచనా వేసినట్లుగా అది జరగలేద’ని జుకర్బర్గ్ పేర్కొన్నారు. ఇటీవలే ట్విటర్ యజమానిగా మారిన మస్క్, కూడా ‘రోజుకు 4 మిలియన్ డాలర్ల మేర నష్టమొస్తోందంటూ తన 7500 మంది ఉద్యోగుల్లో సగం మేరకు గతవారం తొలగించిన విషయం తెలిసిందే. కొవిడ్ సమయంలో, అప్పటి అవసరాల మేరకు వేగంగా నియమాకాలు చేపట్టిన ఇతర టెక్ కంపెనీలు కూడా, ఇప్పుడు ఉద్యోగ కోతలకు పాల్పడుతున్నాయి.
ఇవీ కారణాలు..
* కొవిడ్ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా నెలల తరబడి లాక్డౌన్లు అమలు కావడంతో, ప్రజలు ఇళ్లలో కంప్యూటర్ల ముందు, ఫోన్లతోనే ఎక్కువగా గడిపారు. అందువల్లే ఫేస్బుక్ సహా ఇతర సామాజిక మాధ్యమ కంపెనీలు ఆర్థికంగా రాణించాయి లాక్డౌన్ ముగిశాక ప్రజలు తమ వృత్తి, వ్యాపారాలకు వెళ్తున్నందున, సామాజిక మాధ్యమాలకు కేటాయించే సమయం తగ్గింది. ఫలితంగా ఆయా సంస్థలకు ఆదాయ వృద్ధి పరిమితమవుతోంది. మెటా అయితే తన చరిత్రలోనే తొలి త్రైమాసిక ఆదాయ క్షీణతను ఇటీవల నమోదు చేసింది.
* స్మార్ట్ఫోన్లకు ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేసిన ‘మెటావర్స్’పై మెటా 10 బిలియన్ డాలర్ల (సుమారు రూ.82,000 కోట్ల) మేర పెట్టుబడులు పెట్టింది. అయితే ప్రస్తుతానికి ఇది వినియోగదార్లను పెద్దగా ఆకట్టుకోవడం లేదు.
* యాపిల్ ప్రైవసీ టూల్స్తో సంస్థకు సవాళ్లు ఎదురయ్యాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్ వినియోగదార్లను వారి అనుమతి లేకుండా ట్రాక్ చేయడం, యాడ్స్ పోస్ట్ చేయడం కష్టమవుతోంది. ఇక ఇన్స్టాగ్రామ్కు టిక్టాక్తో పోటీ తీవ్రమైంది.
సిబ్బందికి ప్యాకేజీ ఇలా: ‘మా అన్ని వ్యాపారాల్లో వ్యయాలను తగ్గిస్తున్నాం. బడ్జెట్లలో కోత, ప్రోత్సాహకాలు- కార్యాలయాల తగ్గింపు వంటివి చేపట్టాం. అయినా వ్యయాలు పెద్దగా తగ్గలేదు. అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింద’ని జుకర్బర్గ్ పేర్కొన్నారు. ‘16 వారాల మూల వేతనంతో పాటు, కంపెనీలో పనిచేసిన ప్రతి సంవత్సరానికి రెండు వారాల చొప్పున వేతనాన్ని తొలగింపునకు గురైన ఉద్యోగులు అందుకుంటారు. ఆరు నెలల పాటు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య బీమా కొనసాగుతుంద’ని ఆయన స్పష్టం చేశారు.
హెచ్1బీ వీసాదార్లకు మద్దతు: సాధారణంగా హెచ్1బీ వీసా కలిగిన వారు అమెరికాలో నివాసం ఉంటూ మూడేళ్ల పాటు పనిచేయొచ్చు. మరో మూడేళ్లు పొడిగించుకోవచ్చు. అయితే వీరికి ఉద్యోగం పోతే, 60 రోజుల్లోగా వీసాను స్పాన్సర్ చేసే మరో కంపెనీలో చేరాల్సి ఉంటుంది. లేదంటే అమెరికాను వీడాల్సిందే. అమెరికా టెక్ కంపెనీలు నియమించుకునేవారిలో ఎక్కువ భాగం హెచ్1బీ సిబ్బందే ఉంటారు. అందులోనూ భారత్ వంటి దేశాల నుంచే అధికంగా ఉంటారు. ఇప్పుడు ఫేస్బుక్లో ఉద్యోగం కోల్పోతున్న వారిలో హెచ్1బీ వీసాదార్లు ఉంటే వారికి ‘ఇమిగ్రేషన్ మద్దతు’ ఇస్తామని జుకర్బర్గ్ పేర్కొన్నారు. ‘వీసాపై ఉన్న ఉద్యోగులకు ఇది కష్ట సమయం. మీకు, మీ కుటుంబానికి ఏం కావాలన్నదానిపై ఆధారపడి, మీకు మార్గదర్శకత్వం ఇచ్చేందుకు ఇమిగ్రేషన్ స్పెషలిస్టులు మా వద్ద ఉన్నార’ని ఆయన అన్నారు.
‘‘ఉద్యోగుల తొలగింపు నిర్ణయాలకు బాధ్యత నాదే. ఆయా కుటుంబాలకు ఇందువల్ల ఎంత కష్టం ఏర్పడుతుందో నాకు తెలుసు. లేఆఫ్నకు గురైన వారికి నా క్షమాపణలు. కంపెనీని మరింత బలోపేతం చేయడానికి వ్యయాల కోత, నూతన నియామకాల నిలిపివేత వంటి చర్యలు తీసుకుంటున్నాం.’’
- ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్