రిలయన్స్ లాభం రూ.15,792 కోట్లు
సవాలుభరిత వాతావరణంలోనూ మా అన్ని వ్యాపారాలూ బలంగా రాణించాయి. జియో రికార్డు స్థాయి ఎబిటా, ఆదాయాలను అందించింది. 5జీ సేవలు ఆవిష్కరించి, 134 నగరాలకు విస్తరించాం.
ఆర్థిక వ్యయాల కారణంగా 15% క్షీణత
ఆదాయం రూ.2.2 లక్షల కోట్లు
28% పెరిగిన జియో లాభం
కొత్తగా 789 రిటైల్ స్టోర్లు
రూ.3,03,530 కోట్లకు స్థూల రుణాలు
సవాలుభరిత వాతావరణంలోనూ మా అన్ని వ్యాపారాలూ బలంగా రాణించాయి. జియో రికార్డు స్థాయి ఎబిటా, ఆదాయాలను అందించింది. 5జీ సేవలు ఆవిష్కరించి, 134 నగరాలకు విస్తరించాం. రిటైల్ వ్యాపారం మెరుగ్గా సాగుతోంది. దేశీయ ఇంధన మార్కెట్లో ఊగిసలాటలున్నా.. సరైన ఇంధన భద్రతను అందించేలా ఎమ్జే క్షేత్రాన్ని ప్రారంభించాం. జామ్ నగర్లో గిగా ఫ్యాక్టరీల ఏర్పాటులో వేగవంత ప్రగతి ఉంది. మా బలమైన బ్యాలెన్స్ షీట్లు, నగదు నిల్వలు.. ప్రస్తుత వ్యాపార వృద్ధికి, కొత్త అవకాశాల్లో పెట్టుబడులకు వీలు కల్పిస్తున్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ
దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) రూ.2,20,592 కోట్ల ఆదాయంపై రూ.15,792 కోట్ల నికర లాభాన్ని (ఒక్కో షేరుకు రూ.23.34) ఆర్జించింది. 2021-22 ఇదే త్రైమాసికంలో రూ.1,91,271 కోట్ల ఆదాయంపై రూ.18,549 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని (ఒక్కో షేరుకు రూ.28.08) పొందింది. అంటే నికర లాభం 15% తగ్గితే, ఆదాయాలు 15% పెరిగాయి.
లాభం ఎందుకు తగ్గిందంటే..
రుణ వ్యయాలు పెరగడం, తరుగుదల కారణంగా లాభం తగ్గిందని కంపెనీ పేర్కొంది. ఆర్థిక వ్యయాలు 36.4% పెరిగి రూ.5,201 కోట్లకు: ఇతర వ్యయాలు రూ.5,421 కోట్ల మేర పెరిగాయి. అన్ని వ్యాపారాల్లో ఆస్తులను విస్తృతం చేయడంతో, తరుగుదల 32.6% పెరిగి రూ.10,187 కోట్లకు చేరింది. డీజిల్, విమాన ఇంధన ఎగుమతులపై విధించిన పన్ను వల్ల, లాభంపై రూ.1898 కోట్ల ప్రభావం కనిపించింది.
జిల్జిల్.. జియో
రిలయన్స్ జియో నికర లాభం రూ.3,615 కోట్ల నుంచి 28.3% వృద్ధితో రూ.4638 కోట్లకు చేరుకుంది. ఆదాయం రూ.19,347 కోట్ల నుంచి 18.8% పెరిగి రూ.22,998 కోట్లుగా నమోదైంది. వినియోగదార్ల సంఖ్య 17.5% పెరిగి 43.3 కోట్లకు చేరింది. ఒక్కో వినియోగదారుపై సగటు ఆదాయం (ఆర్పు) రూ.151.6 నుంచి రూ.178.2కు చేరింది. ‘పరిమాణం పరంగా భారత్ వంటి ఏ దేశంలోనూ లేని విధంగా, అత్యంత వేగంతో కూడిన 5జీ సేవలను 3 నెలల్లోనే 134 నగరాలకు అందుబాటులోకి తెచ్చాం. డిసెంబరు కల్లా దేశవ్యాప్తంగా విస్తరిస్తామ’ని జియో ఛైర్మన్ ఆకాశ్ అంబానీ పేర్కొన్నారు.
ఇ-కామర్స్లో 38% వృద్ధి
రిలయన్స్ రిటైల్ నికర లాభం 6.4% వృద్ధితో రూ.2,400 కోట్లుగా నమోదైంది. ఆదాయం రూ.50,654 కోట్ల నుంచి 18.64% వృద్ధితో రూ.60,096 కోట్లకు పెరిగింది. సమీక్షా త్రైమాసికంలో 789 జతచేరడంతో, మొత్తం స్టోర్ల సంఖ్య 17,225కు చేరింది. ఈ త్రైమాసికంలో 20.1 కోట్ల మంది తమ స్టోర్లను సందర్శించారని కంపెనీ తెలిపింది. డిజిటల్ కామర్స్, సరికొత్త కామర్స్ వ్యాపారాలు 38% పెరిగి ఆదాయంలో 18% వాటా అందించాయని పేర్కొంది. ‘సోస్యో, లోటస్ చాక్లెట్ కొనుగోళ్లతో పాటు ‘ఇండిపెండెన్స్’ బ్రాండ్ ఆవిష్కరణతో పోర్ట్ఫోలియో మరింత బలోపేతం అయిన’ట్లు రిలయన్స్ రిటైల్ పేర్కొంది.
రూ.20,000 కోట్ల సమీకరణ
హరిత ఇంధన ఉత్పత్తి నిమిత్తం గిగా ఫ్యాక్టరీల నిర్మాణంతో పాటు 5జీ సేవలు, రిటైల్ వ్యాపారాల విస్తరణ నిమిత్తం రూ.20,000 కోట్ల నిధులను ఎన్సీడీల జారీ ద్వారా సంస్థ సమీకరించనుంది. ఈ విభాగాలపై ఇప్పటికే పెట్టిన భారీ పెట్టుబడుల కారణంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ స్థూల రుణాలు ఏడాది క్రితంతో పోలిస్తే రూ.59,000 కోట్లు పెరిగి రూ.3,03,530 కోట్లకు చేరుకున్నాయి. నగదు నిల్వలు రూ.1,93,282 కోట్లుగా ఉన్నాయి. దీంతో నికర రుణాలు వార్షిక ఎబిటా కంటే తక్కువగా నమోదయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.