మీ ఇంటికే వస్తాం.. వంట చేస్తాం
ఇంట్లో పుట్టిన రోజు వేడుకో.. ఏదైనా చిన్నపాటి శుభకార్యాలు నిర్వహించుకోవడం మామూలే. పది ఇరవై మందితో నిర్వహించుకునే ఈ ఆనందాన్ని ఆహారం రెట్టింపు చేస్తుంది.
ఈనాడు - హైదరాబాద్
ఇంట్లో పుట్టిన రోజు వేడుకో.. ఏదైనా చిన్నపాటి శుభకార్యాలు నిర్వహించుకోవడం మామూలే. పది ఇరవై మందితో నిర్వహించుకునే ఈ ఆనందాన్ని ఆహారం రెట్టింపు చేస్తుంది. కానీ, రకరకాల వంటలు చేయడం అంటే కొంత ఇబ్బందే. బయట నుంచి తీసుకొచ్చే అవకాశం ఉన్నా.. ప్యాకేజింగ్, రవాణా సమయంలో అవి సహజ రుచిని కోల్పోతాయి. పైగా ఖరీదూ ఎక్కువే. ఈ ఇబ్బందులన్నీ తీర్చేలా చిన్న, చిన్న వేడుకల కోసం ఎవరైనా ఇంటికే వచ్చి వంట చేసిస్తే బాగుంటుంది కదా.. అనే ఆలోచనతో వచ్చిన అంకురమే ‘బుక్మైచెఫ్’. హోటళ్లలో లభించే అనేక రుచులను ఇంటిలోనే ఆస్వాదించాలనుకునే వారి కోసమే మా ఈ ప్రయత్నం అంటున్నారు సంస్థ సహ వ్యవస్థాపకులు శంకర్ కృష్ణమూర్తి. తమ సంస్థ గురించి ఇలా వివరిస్తున్నారు..
‘ఎంతో అనుభవం ఉన్న వంట నిపుణులు మన దగ్గర ఉన్నారు. వీరిని ఒక వేదికపైకి తీసుకురావడం, అవసరం ఉన్న వారికి వీరి సేవలను అందించడం లక్ష్యంగా దీన్ని ప్రారంభించాం. కొవిడ్ లాక్డౌన్ ముగిసిన తర్వాత మా అబ్బాయి పుట్టిన రోజును కొంతమంది సమక్షంలో నిర్వహించాలని అనుకున్నాం. కానీ, తక్కువ మందికి భోజనం సరఫరా చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. నేను హోటల్ రంగంలోనే ఉండటంతో, నాకు తెలిసిన కొంతమంది చెఫ్లను పిలిచి, అప్పటికప్పుడు రుచికరమైన వంటలు చేయించాను. అక్కడికి వచ్చిన వారందరికీ ఇది నచ్చింది. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ఆలోచనతో ప్రమోద్ జయవరపు, వరుణ్ రెడ్డిలు వ్యవస్థాపకులుగా నేను సహ వ్యవస్థాపకుడిగా ‘బుక్మైచెఫ్’ను ప్రారంభించాం.
ఏం చేస్తామంటే...
ఎక్కడికైనా వెళ్లినపుడు అక్కడి ఆహార పదార్థాలు మనకు నచ్చుతాయి. కానీ, వాటిని ఇంట్లో తయారు చేసుకోవడం సాధ్యం కాకపోవచ్చు. 10, 20 మందిని భోజనానికి పిలిచినపుడూ క్యాటరింగ్ లాంటివి కుదరవు. ఇలాంటి సమస్యలన్నింటినీ పరిష్కరించేలా సేవలను అందిస్తున్నాం. అవసరం ఉన్నవారు మా యాప్ ద్వారా వంట నిపుణులను ఎంచుకోవచ్చు. కనీసం ఇద్దరి కోసమూ వంట చేయించుకునే వీలుంది. దేశ, విదేశీ ఆహార పదార్థాలు ఏవి కావాలన్నా మీ ఇంటి దగ్గర మీ కళ్లముందే సిద్ధం చేసి మా చెఫ్లు అందిస్తారు. అందులో వాడుతున్న వస్తువులు ఏమిటి అన్నదీ తెలుస్తుంది. సాధారణంగా సెలబ్రిటీలకు చెఫ్లు ప్రత్యేకంగా ఉంటారు. వీరి కోసమూ ప్రత్యేక సేవలను ప్రారంభించాం. మా ప్లాట్ఫాంలో చెఫ్లను చేర్చుకునేటప్పుడే అనుభవం, వారి నైపుణ్యాలను పూర్తి స్థాయిలో పరిశీలిస్తాం.
మీ ఇష్టానుసారంగా..
మీకు ఏ ఆహార పదార్థాలు కావాలి అనేది జాబితా నుంచి ఎంపిక చేసుకోవచ్చు. దీని ఆధారంగానే ఎంత రుసుము వసూలు చేయాలన్నది నిర్ణయిస్తాం. వ్యక్తుల సంఖ్యను బట్టి నిర్ణీత రుసుము ఉంటుంది. ఆ తర్వాత ప్రతి పదార్థానికీ ప్రత్యేకంగా కొంత చెల్లించాలి. వస్తువులను సొంతంగా తెచ్చుకోవచ్చు. మమ్మల్ని అడిగినా సమకూరుస్తాం. చెఫ్లతో పాటు అవసరమైతే వడ్డించేవారు, శుభ్రం చేసేవారినీ పంపిస్తాం.
విస్తరణ ప్రణాళికల్లో..
సొంత పెట్టుబడితో సంస్థను ప్రారంభించాం. ఇప్పటి వరకూ రూ.2 కోట్ల మేరకు పెట్టుబడులను విక్రం రెడ్డి (యూవీ క్రియేషన్స్ ఫండ్), రోనిత్ రెడ్డి (గంగా కావేరీ వెంచర్స్) నుంచి సమీకరించాం. ప్రస్తుతం మా దగ్గర 40 మందికి పైగా చెఫ్లు ఉన్నారు. ముంబయి, దిల్లీతో పాటు ఇతర నగరాలకూ విస్తరించబోతున్నాం. ఈ ఏడాది చివరి నాటికి 400 మందిని మా యాప్లోకి తీసుకొస్తాం. దీంతోపాటు యాప్ను మరింత అభివృద్ధి చేయబోతున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది. -
అధిక పింఛనుపై రోజుకో నిర్ణయం..
అధిక పింఛను అమలు, పెన్షన్ లెక్కింపు సూత్రంపై ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) రోజుకో నిర్ణయం తీసుకుంటుడడం అర్హులైనవారిని ఆందోళనకు గురిచేస్తోంది. -
అమెరికాలో ఐటీ ఉద్యోగాలు ‘కట్’కట
‘ఫ్రంట్డెస్క్’.. అమెరికాలో ప్రాప్టెక్ అంకుర సంస్థ. ఈ సంస్థ సీఈఓ ఈ మధ్య ఉద్యోగులందరితో మాట్లాడాలని ‘గూగుల్ మీట్’ ఏర్పాటు చేశారు. -
Paytm: పేటీఎంకు ఏమైంది?
పేటీఎంను కష్టాలు చుట్టుముట్టాయి. వినియోగదారుల నుంచి డిపాజిట్లు స్వీకరించకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. -
Satya Nadella: సాహో.. సత్య నాదెళ్ల
ఒక టెక్ కంపెనీలో విశేషమైన మార్పు తీసుకువచ్చిన ఘనత సత్య నాదెళ్లకు దక్కుతుంది. స్టీవ్ జాబ్స్ ఐఫోన్ ఆవిష్కరణతో యాపిల్ కంపెనీని అగ్రగామిగా తీర్చిదిద్దిన ఉదంతంతో సత్య నాదెళ్ల సాధించిన ఘనతను పోల్చవచ్చు. -
సాగు సాయం అంతంతే!
వ్యవసాయం, అనుబంధ రంగాలకు గత ఏడాదితో పోలిస్తే నిధుల కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి. 2023-24లో రూ.1.25 లక్షల కోట్లు ఇవ్వగా.. ఈసారి రూ.1.27 లక్షల కోట్లు కేటాయించారు. -
కేంద్ర బడ్జెట్.. పలు రంగాలకు కేటాయింపులు ఇలా..
గ్రామీణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. 2024-25 తాత్కాలిక బడ్జెట్లో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకు రూ.1.77 లక్షల కోట్లను కేటాయించింది. -
‘లఖ్పతి’తో లక్షార్జన!
స్వయం సహాయక సంఘా(ఎస్హెచ్జీ)లకు సంబంధించిన ‘లఖ్పతి దీదీ’ పథక లక్ష్యాన్ని విస్తృతం చేస్తున్నారు. ఇకపై 3 కోట్ల మంది మహిళలకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి వెల్లడించారు. -
ఆదాయపు పన్ను ఏం మారలే!
ఎన్నికల ముందు ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్లో ఉద్యోగులకు ఊరట కల్పించే అంశాలేమీ కనిపించలేదు. ‘గత సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. మధ్యంతర బడ్జెట్లో కొత్త పన్ను ప్రతిపాదనలేమీ తీసుకురావడం లేదని’ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. -
కొత్త కారిడార్లు.. సరికొత్త బోగీలు
దేశంలో రైలు మార్గం ద్వారా జరిగే సరకు రవాణాను వేగవంతం చేయడంతోపాటు ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. -
రక్షణకు ఓ మోస్తరు పెంపు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో రక్షణ శాఖకు ఒక మోస్తరు స్థాయిలో కేటాయింపులు పెంచారు.
తాజా వార్తలు (Latest News)
-
BJP-JDS: ‘రెండు సీట్లకు ఇంత కష్టపడాలా?’ భాజపాపై కుమారస్వామి అసంతృప్తి!
-
Kolkata: భవనం కుప్పకూలిన ఘటనలో తొమ్మిదికి చేరిన మృతులు
-
Munitions: ఉత్తర కొరియా నుంచి రష్యాకు.. ఏడు వేల కంటెయినర్ల ఆయుధాలు!
-
IPL: బెరెన్డార్ఫ్ ఔట్.. ఇంగ్లాండ్ పేసర్కు ముంబయి ఇండియన్స్ పిలుపు
-
Online Voting: వారికి ఆన్లైన్ ఓటింగ్ కల్పించాలి: మాజీ సీఈసీ కృష్ణమూర్తి
-
Bengaluru: రోజుకు 50 కోట్ల లీటర్ల నీటి కొరత.. బెంగళూరు కష్టాలపై కర్ణాటక సీఎం