ఎంఎస్ఎంఈ రుణాలకు ప్రాధాన్యం
కరూర్ వైశ్యా బ్యాంకు గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,106 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. నూరేళ్లకు పైగా చరిత్ర గల ఈ బ్యాంకు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1,000 కోట్లకు పైగా నికర లాభాన్ని ఆర్జించటం ఇదే తొలిసారి.
మూడేళ్ల సమష్టి కృషి వల్లే రూ.1,000 కోట్లకు పైగా లాభం
మొండి బాకీలు కట్టడి చేశాం, వడ్డీ మార్జిన్ పెంచుకున్నాం
‘ఈనాడు’ ఇంటర్వ్యూ
కరూర్ వైశ్యా బ్యాంకు ఎండీ, సీఈఓ బి.రమేష్ బాబు
ఈనాడు - హైదరాబాద్
కరూర్ వైశ్యా బ్యాంకు గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,106 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. నూరేళ్లకు పైగా చరిత్ర గల ఈ బ్యాంకు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1,000 కోట్లకు పైగా నికర లాభాన్ని ఆర్జించటం ఇదే తొలిసారి. దీని వెనుక మూడేళ్ల సమష్టి కృషి ఉందని బ్యాంకు ఎండీ, సీఈఓ బి.రమేష్ బాబు వివరించారు. ‘స్పష్టమైన కార్యాచరణ నిర్దేశించుకుని ముందుకు సాగాం.. ఎక్కడెక్కడ దిద్దుబాటు అవసరమో గుర్తించి, అమలు చేశాం. ఇందులో బ్యాంకు అధికారులు, సిబ్బంది మొత్తం భాగస్వాములయ్యారు. ఆ ఫలితాలే ఇప్పుడు కనిపిస్తున్నాయి’ అని ‘ఈనాడు’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రమేష్ తెలిపారు. అన్ని ప్రమాణాల ప్రకారం బ్యాంకు మెరుగైన స్థితిలో ఉందని.. మున్ముందూ ఇదే జోరు కొనసాగిస్తామని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న లక్ష్యాలను అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
2022-23లో అధిక లాభాలు ఎలా సాధ్యమయ్యాయి.
ప్రణాళిక ప్రకారం చేసిన కృషి వల్లే, బ్యాంకు చరిత్రలో ఎన్నడూ లేనంతగా మెరుగైన ఫలితాలను నమోదు చేశాం. మొత్తం వ్యాపారం రూ.1.40 లక్షల కోట్లను అధిగమించింది. రుణాల్లో 16%, డిపాజిట్లలో 12% వృద్ధి నమోదైంది. 2021-22తో పోలిస్తే 64% అధికంగా రూ.1106 కోట్ల నికరలాభాన్ని ఆర్జించాం. రిటర్న్ ఆన్ అసెట్స్, రిటర్న్ ఆన్ ఈక్విటీ, ఎన్ఐఎం, పీసీఆర్ (ప్రొవిజన్ కవరేజ్ రేషియో).. అన్నీ మెరుగ్గా నమోదయ్యాయి. బ్యాంకులోని అందరు అధికారులు, సిబ్బంది భాగస్వామ్యం వల్లే ఇది సాధ్యమైంది. భిన్నమైన వ్యాపార వ్యూహాలకు తోడు లాభాలు పెంచుకోవడంపై దృష్టి కేంద్రీకరించడం కలిసి వచ్చింది.
మొండి బాకీల సమస్య తగ్గినట్లేనా.
గతంలో అయిదారు పెద్ద కార్పొరేట్ సంస్థలకు భారీ మొత్తంలో రుణాలు ఇచ్చే వాళ్లం. దాంతో రుణాల లక్ష్యం నెరవేరేది. కానీ దానివల్ల మొండి బాకీల సమస్య ఉత్పన్నమయ్యేది. వాటికి కేటాయింపులు చేయడం వల్ల లాభాలు తగ్గేవి. అందుకే రూ.125 కోట్లకు మించిన కార్పొరేట్ రుణాలను తగ్గించి, ఆ స్థానంలో ఎంఎస్ఎంఈలకు రుణాలు ఎక్కువగా ఇచ్చాం. వివిధ విభాగాలకు చెందిన ఎక్కువ సంస్థలకు రుణాలు జారీ చేసే సంస్కృతిని తీసుకొచ్చాం. మొండిబాకీల వసూలుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశాం. ఏదైనా ఒక రుణ ఖాతా ఒత్తిడికి గురవుతోందనే సంకేతాలు రాగానే, దానికి పరిష్కారాన్ని అన్వేషిస్తున్నాం. దీనివల్ల పారు బాకీల సమస్య గణనీయంగా తగ్గింది. మార్చి 31 నాటికి స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్పీఏ) 2.27 శాతానికి, నికర నిరర్థక ఆస్తులు (ఎన్ఎన్పీఏ) 0.74 శాతానికి దిగివచ్చాయి. ఇవి ఇంతకంటే పెరగకుండా చూస్తాం.
ఈ ఆర్థిక సంవత్సరానికి వృద్ధి లక్ష్యాలేమిటి.
కాసా (కరెంటు, సేవింగ్స్ ఖాతాలు) డిపాజిట్లు 34 శాతానికి పెంచుకోవాలని, 3.8 శాతం నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఎం) సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అదే విధంగా రిటర్న్ ఆన్ అసెట్స్ (ఆర్ఓఏ) 1.5% ఉండాలని, రుణాలతో పాటు డిపాజిట్లలో 14% చొప్పున వృద్ధి సాధించాలని భావిస్తున్నాం. రుణాలకు సంబంధించి ప్రధానంగా ఎంఎస్ఎంఈ విభాగంపై దృష్టి కేంద్రీకరిస్తాం. రిటైల్ విభాగంలో తనఖా రుణాలు అధికంగా ఇవ్వాలనేది లక్ష్యం. కార్పొరేట్ రుణ ఖాతా సగటు మొత్తాన్ని రూ.36.93 కోట్లకు తగ్గించాం. దాదాపుగా దీన్నే కొనసాగిస్తాం. లాభదాయకతతో పాటు వడ్డీ- వడ్డీయేతర ఆదాయాన్ని పెంచుకునేందుకు కృషి చేస్తాం. ఖర్చులు తగ్గించుకోవడానికి అన్ని దారులు వెతుకుతాం.
బ్యాంకు అవసరాలకు అదనపు నిధులు సమీకరించే ఆలోచన ఉందా.
మా బ్యాంకు మూలధన నిష్పత్తి (సీఏఆర్) 18.5 శాతంగా ఉంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం 11% ఉంటే చాలు. అందువల్ల మూలధన నిధుల కోసం మాపై ఒత్తిడి లేదు.
నియామకాలు, శాఖల ఏర్పాటు ప్రణాళికలు ఏమిటి.
బ్యాంకులో ప్రస్తుతం 7,700 మంది సిబ్బంది ఉన్నారు. ఈ ఏడాదిలో 35 కొత్త శాఖలు ఏర్పాటు చేసే ఆలోచన ఉంది. 250 మంది బిజినెస్ కరెస్పాండెంట్లను నియమించాలని అనుకుంటున్నాం. అవసరాలకు అనుగుణంగా నియామకాలు చేపడతాం. గత కొన్నేళ్లలో ఒక్కో ఉద్యోగి నమోదు చేసే వ్యాపారం మా బ్యాంకులో బాగా పెరిగింది. మూడేళ్ల క్రితం ఇది రూ.13.56 కోట్లు కాగా, ఇప్పుడు రూ.18.14 కోట్లకు పెరిగింది. ఇది ఎంతో సానుకూలాంశం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో అధిక వ్యాపారాన్ని నమోదు చేస్తున్నాం. భవిష్యత్తులో విస్తరణ-ఇతర అంశాల్లో ఈ రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యం ఇస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.