నష్టాల నుంచి లాభాల్లోకి
ఆఖరి గంటన్నర ట్రేడింగ్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇంట్రాడే కనిష్ఠాల నుంచి కోలుకున్న సూచీలు, లాభాల్లో ముగిశాయి. మే డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగింపు కారణంగా ట్రేడింగ్ ఒడుదొడుకుల మధ్య సాగింది.
సమీక్ష
ఆఖరి గంటన్నర ట్రేడింగ్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇంట్రాడే కనిష్ఠాల నుంచి కోలుకున్న సూచీలు, లాభాల్లో ముగిశాయి. మే డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగింపు కారణంగా ట్రేడింగ్ ఒడుదొడుకుల మధ్య సాగింది. డాలర్తో పోలిస్తే రూపాయి 4 పైసలు తగ్గి 82.72 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 1.14% నష్టపోయి 77.47 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో టోక్యో లాభపడగా, సియోల్, షాంఘై, హాంకాంగ్ నష్టపోయాయి. ఐరోపా సూచీలు మిశ్రమంగా ట్రేడయ్యాయి.
సెన్సెక్స్ ఉదయం 61,706.13 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. రోజులో ఎక్కువ భాగం నష్టాల్లోనే కదలాడిన సూచీ, ఒకదశలో 61,484.66 వద్ద కనిష్ఠానికి చేరింది. ఆఖర్లో మదుపర్ల కొనుగోళ్లతో లాభాల్లోకి వచ్చిన సెన్సెక్స్, 61,934.01 దగ్గర ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదుచేసింది. చివరకు 98.94 పాయింట్ల లాభంతో 61,872.62 వద్ద ముగిసింది. నిఫ్టీ 35.75 పాయింట్లు పెరిగి 18,321.15 దగ్గర స్థిరపడింది.
* ఆకర్షణీయ త్రైమాసిక ఫలితాలతో ఎల్ఐసీ షేరు 1.39% లాభపడి రూ.603.60 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేరు రూ.615.65 వద్ద గరిష్ఠాన్ని తాకింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.6,356.63 కోట్లు పెరిగి రూ.3.81 లక్షల కోట్లకు చేరింది.
* సెన్సెక్స్ 30 షేర్లలో 15 మెరిశాయి. భారతీ ఎయిర్టెల్ 2.75%, ఐటీసీ 1.76%, కోటక్ బ్యాంక్ 1.04%, ఎల్ అండ్ టీ 0.99%, పవర్గ్రిడ్ 0.85%, బజాజ్ ఫైనాన్స్ 0.78% చొప్పున రాణించాయి. విప్రో, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ, సన్ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ 1.35% వరకు నష్టపోయాయి. బీఎస్ఈలో 1802 షేర్లు లాభపడగా, 1687 స్క్రిప్లు నష్టపోయాయి. 122 షేర్లలో ఎటువంటి మార్పులేదు.
* మాంద్యంలోకి జర్మనీ: ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో జర్మనీ ఆర్థిక వ్యవస్థ 0.3 శాతం క్షీణించింది. 2022 చివరి త్రైమాసికంలోనూ జర్మనీ వృద్ధి 0.5 శాతం క్షీణించింది.
ఫలితంగా ఐరోపాలోని ఈ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక మాంద్యంలోకి జారుకున్నట్లయింది. వరుసగా రెండు త్రైమాసికాల పాటు ప్రతికూల వృద్ధి నమోదైతే, సాంకేతికంగా మాంద్యంలోకి జారుకున్నట్లే. మొదటి త్రైమాసికంలో ఉద్యోగాలు పెరగ్గా, ద్రవ్యోల్బణం కూడా శాంతించింది. అయితే అధిక వడ్డీ రేట్ల వల్ల వినియోగం, పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం పడినట్లు నిపుణులు వెల్లడించారు.
* రిలయన్స్ చేతికి లోటస్ చాకొలెట్ : లోటస్ చాకొలెట్లో నియంత్రిత 51% వాటా కొనుగోలు చేయడాన్ని పూర్తి చేసినట్లు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ వెల్లడించింది. అనుబంధ సంస్థ రిలయన్స్ కన్జూమర్ ప్రోడక్ట్స్ మే 24 నుంచి లోటస్ చాకొలెట్పై నియంత్రణ చేపట్టినట్లు వెల్లడించింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే లోటస్ చాకోలెట్ కొనుగోలుకు రిలయన్స్ రూ.74 కోట్లు వెచ్చించింది. గతేడాది డిసెంబరులో లోటస్ చాకొలెట్లో నియంత్రణ వాటాను కొనుగోలు చేస్తున్నట్లు రిలయన్స్ రిటైల్ ప్రకటించింది. షేరు కొనుగోలు ఒప్పందం ప్రకారం.. లోటస్లో 77% పెయిడప్ షేరు క్యాపిటల్ను ప్రమోటర్లు ప్రకాశ్ పీరాజే పాయ్, అనంత్ పీరాజే పాయ్ల నుంచి కొనుగోలు చేస్తామని రిలయన్స్ కన్జూమర్ తెలిపింది. మరో 26 శాతం అదనపు వాటా కొనుగోలుకు ఓపెన్ ఆఫర్ ప్రకటించింది.
* భారత్లో సెమీకండక్టర్ వ్యాపారానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఆఫీస్, తయారీ కార్యకలాపాలు)గా మైక్ యంగ్ను నియమించినట్లు వేదాంతా-ఫాక్స్కాన్ సెమీకండక్టర్స్ లిమిటెడ్ వెల్లడించింది. ఫాక్స్కాన్, వేదాంతా గ్రూప్ సంయుక్తంగా ఈ సంస్థను ఏర్పాటు చేశాయి.
* కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్తో విలీన ప్రతిపాదనను పునఃసమీక్షించాల్సిందిగా ఎన్ఎస్ఈ, బీఎస్ఈకి ఎన్సీఎల్టీ ఇచ్చిన ఆదేశాలపై జీ ఎంటర్టైన్మెంట్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను ఎన్సీఎల్ఏటీ శుక్రవారానికి వాయిదా వేసింది.
* గ్రాన్యూల్స్ ఇండియాలో సమాచార చౌర్యం: తమ సంస్థలో ‘సమాచార చౌర్యం ఘటన’ జరిగినట్లు ఔషధ సంస్థ గ్రాన్యూల్స్ ఇండియా వెల్లడించింది. ఈ ప్రభావం పడిన ఐటీ వ్యవస్థలను స్తంభింపజేసినట్లు తెలిపింది. ఈ ఘటనపై అత్యంత ప్రాధాన్యతతో విచారణ చేపడుతున్నట్లు ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది. ఈ ఏడాది మార్చిలో సన్ఫార్మా సైతం ఇదే తరహా ఘటనను ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.