IT Jobs: ఐటీలో.. కాంట్రాక్టు ఉద్యోగాలూ పోతున్నాయ్
దేశీయ ఐటీ రంగంలోని అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బందిలో దాదాపు 6 శాతం మంది జనవరి-మార్చి త్రైమాసికంలో ఉద్యోగాలు పోగొట్టుకున్నారని ఒక నివేదిక తెలిపింది.
మార్చి త్రైమాసికంలో 3,600 మంది బయటకు
ద ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ నివేదిక
దేశీయ ఐటీ రంగంలోని అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బందిలో దాదాపు 6 శాతం మంది జనవరి-మార్చి త్రైమాసికంలో ఉద్యోగాలు పోగొట్టుకున్నారని ఒక నివేదిక తెలిపింది. ఐటీ కంపెనీలు ప్రాజెక్టులకు అనుగుణంగా, తాత్కాలికంగా నియమించుకునే ఈ సిబ్బందిని ఫ్లెక్సీ స్టాఫ్గా కూడా వ్యవహరిస్తారు. అక్టోబరు-డిసెంబరుతో పోలిస్తే, వీరి సంఖ్య మార్చి త్రైమాసికంలో తగ్గింది. అంతర్జాతీయ మందగమనానికి తోడు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిణామాల వల్ల ఏర్పడిన పరిస్థితులే ఇందుకు కారణమని 120 నియామక ఏజెన్సీల సంఘమైన ద ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ పేర్కొంది. ఐటీ సంస్థలకు కావాల్సిన సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిలో ఈ సంస్థలు సమకూరుస్తుంటాయి. ఈ 120 సంస్థల నుంచి 60,000 మంది అవుట్సోర్సింగ్ సిబ్బంది ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్నారు. వీరిలో 6 శాతానికి సమానమైన 3600 మంది మార్చి త్రైమాసికంలో ఉపాధి పోగొట్టుకున్నారని నివేదిక తెలిపింది. రాబోయే కొన్ని త్రైమాసికాలు కూడా ఫ్లెక్సీ స్టాఫింగ్కు ఐటీ రంగంలో గిరాకీ తక్కువగానే ఉంటుందనే అభిప్రాయాన్ని ఫెడరేషన్ వ్యక్తం చేసింది.
ఐటీ రంగంలో 51 లక్షల మందికి ఉపాధి: 2022 మార్చి నాటికి దేశీయ ఐటీ రంగంలో దాదాపు 51 లక్షల మంది సిబ్బంది ఉన్నారు. కొత్త నియామకాలను తాత్కాలికంగా నిలిపి వేయడంతో పాటు వేలమంది కాంట్రాక్ట్ ఉద్యోగులను ఐటీ కంపెనీలు తొలగిస్తున్నాయని సంఘం తెలిపింది.
తయారీ, లాజిస్టిక్స్, రిటైల్లో నియామకాలు: దేశీయంగా వినియోగదారు గిరాకీ బాగున్నందున తయారీ, లాజిస్టిక్స్, రిటైల్ రంగాల్లో నియామకాలు బలంగా కనిపిస్తున్నాయని ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ లోహిత్ భాటియా తెలిపారు. ఇతర రంగాల్లోనూ నియామకాలు తగ్గుతున్నాయని.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో వెండర్ల ద్వారా 1,77,000 ఉద్యోగాలు మాత్రమే లభించాయని.. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో 2,30,000 మంది సిబ్బందికి కాంట్రాక్ట్ ఉద్యోగాలొచ్చాయని ఫెడరేషన్ అంటోంది.
* మొత్తం మీద భారత కంపెనీల్లో వెండర్ల ద్వారా నియమితులైన కాంట్రాక్టు ఉద్యోగుల సంఖ్య 14 లక్షలకు చేరుకుంది. ఇందులో నాలుగో వంతు మహిళలు కావడం విశేషం.
కారణాలు ఇవీ
కొవిడ్ సమయంలో ఆన్లైన్ కొనుగోళ్లు పెరగడం, ఇంటి నుంచి పని, ఆన్లైన్ తరగతుల వంటి వాటి వల్ల ఐటీ కంపెనీలకు గిరాకీ అధికమైంది.
* కొవిడ్ కేసులు తగ్గిపోవడంతో సిబ్బంది అంతా కార్యాలయాలకు వస్తున్నారు. ఫలితంగా ఇంటి నుంచి పనికి సంబంధించిన ప్రాజెక్టులు తగ్గాయి.
* ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కారణంగా ఐరోపాలో ద్రవ్యోల్బణం తీవ్రమైంది. ఇందువల్ల వినియోగదారులు అత్యవసరాల మీదే వెచ్చిస్తున్నారు. ఫలితంగా ఐటీ కంపెనీలకు ఆర్డర్లు తగ్గాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఉద్యోగం ఉంటుందో?లేదో?’: ఎయిరిండియా విమానాల రద్దుపై ప్రయాణికుల ఆందోళన
ఎయిరిండియా ఎక్స్ప్రెస్కు (Air India Express) చెందిన పలు విమానాలు రద్దుకావడంతో విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. -
AI ఫీచర్లు, 64MP కెమెరాతో గూగుల్ పిక్సెల్ 8ఏ.. ధర, ఫీచర్లివే
Google Pixel 8a: గూగుల్ పిక్సెల్ 8ఏ ఫోన్ 64ఎంపీ కెమెరా సహా అత్యాధునిక ఏఐ ఫీచర్లతో భారత్లో విడుదలైంది. -
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఉద్యోగుల మూకుమ్మడి సెలవు.. 80కి పైగా విమానాల రద్దు
Air India Express: దాదాపు 300 మంది క్యాబిన్ క్రూ అనారోగ్య కారణంతో సెలవు పెట్టినట్లు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ వెల్లడించింది. దీంతో దాదాపు 80కి పైగా సర్వీసులు రద్దయ్యాయి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,276
Stock Market Opening bell: ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ 267 పాయింట్ల నష్టంతో 73,244 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు కుంగి 22,276 దగ్గర కొనసాగుతోంది. -
టాటా సెమీ కండక్టర్ చిప్ల ఎగుమతి!
మన దేశం నుంచి సెమీ కండక్టర్ చిప్సెట్ల ప్రయోగాత్మక ఎగుమతి ప్రారంభమైంది. చిప్సెట్ల కోసం దిగుమతులపైనే ఆధారపడిన మన దేశానికి ఇది ఎంతో ప్రోత్సాహకర అంశమే. -
మెట్రో నగరాల్లో ఖాళీగా షాపింగ్ మాల్స్!
దేశంలోని 8 ప్రధాన నగరాల్లో, స్టాల్స్ స్థలం అతి తక్కువగా నిండుతున్న షాపింగ్ మాల్స్ సంఖ్య పెరిగిందని స్థిరాస్తి సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. -
డాక్టర్ రెడ్డీస్కు రూ.1,307 కోట్ల లాభం
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి ఆకర్షణీయ ఫలితాలు నమోదు చేసింది. -
యాపిల్ కొత్త ఐప్యాడ్ ఎయిర్
టెక్ దిగ్గజం యాపిల్ సరికొత్త ఐప్యాడ్ ఎయిర్ను మంగళవారం జరిగిన ‘లెట్ లూజ్’ కార్యక్రమంలో ఆవిష్కరించింది. -
అయిదేళ్ల కనిష్ఠానికి పొదుపు
దేశంలో కుటుంబాల నికర పొదుపు గణనీయంగా తగ్గుతోంది. 2020-21తో పోలిస్తే, 2022-23 ఆర్థిక సంవత్సరం చివరకు కుటుంబాల నికర పొదుపు రూ.9 లక్షల కోట్లు తగ్గి రూ.14.16 లక్షల కోట్లకు పరిమితమైంది. -
3 రోజులు.. రూ.11 లక్షల కోట్ల నష్టం
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి పెద్ద షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో మంగళవారం సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
ట్రేడింగ్ సమయం పొడిగింపు లేనట్లే
ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో ట్రేడింగ్ సమయాన్ని పొడిగించేందుకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) సమర్పించిన ప్రతిపాదనను కేపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తిరస్కరించింది. -
పోర్షే రూ.1.69 కోట్ల కారు
పోర్షే సరికొత్త పనమేరాను, అత్యంత ఆకర్షణీయ ఫీచర్లతో ఆవిష్కరించింది. దీని ధర(ఎక్స్ షోరూం) రూ.1,69,62,000. -
వైద్య పరికరాల దిగుమతులు తగ్గాలి
వైద్య పరికరాల కోసం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలంటే ప్రభుత్వం, పరిశ్రమ కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని ఫార్మాస్యూటికల్స్ (ఔషధ) విభాగ కార్యదర్శి అరుణీష్ చావ్లా వెల్లడించారు. -
హ్యాపియెస్ట్ మైండ్స్ డివిడెండ్ 163%
ఐటీ సంస్థ హ్యాపియెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.71.98 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
సంక్షిప్త వార్తలు(5)
సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని జేఎస్డబ్ల్యూ ఎనర్జీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.351 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
దేశంలో ఘోస్ట్ షాపింగ్ మాల్స్ పెరుగుతున్నాయి. ఆన్లైన్ కొనుగోళ్లు, పెద్ద పెద్ద షాపింగ్మాల్స్కు మారడమే ఇందుకు కారణం. -
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్
Warren Buffett: ప్రముఖ మదుపరి, బిలియనీర్ వారెన్ బఫెట్ ఏఐ సాంకేతికపై ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐని అణుబాంబుతో పోల్చారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఆ 20 నిమిషాలు నా పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు’: పూంఛ్ ఉగ్రదాడిపై ప్రత్యక్షసాక్షి
-
‘ఉద్యోగం ఉంటుందో?లేదో?’: ఎయిరిండియా విమానాల రద్దుపై ప్రయాణికుల ఆందోళన
-
వి.వి. వినాయక్ వల్లే ‘ఆర్య’ సాధ్యమైంది: అల్లు అర్జున్
-
ఈ నిర్ణయం థర్డ్ అంపైర్కూ కష్టమే.. సంజూ ఔట్తోనే ఓడిపోయాం: సంగక్కర
-
‘దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లలా కన్పిస్తారు..’: మరో వివాదంలో శామ్ పిట్రోడా
-
అందుకే వేగంగా బంతులేస్తా.. ఫెరీరాను తొలి బంతికే ఔట్ చేయడంపై కుల్దీప్