మేలో రష్యా నుంచి చమురు దిగుమతులు మరింత పెరిగాయ్
భారత ముడి చమురు దిగుమతులు రష్యా నుంచి గత నెలలో మరింతగా పెరిగాయి. సౌదీ అరేబియా, ఇరాక్, యూఏఈ, యూఎస్ల నుంచి సంయుక్తంగా దిగుమతి చేసుకున్న పరిమాణంతో పోలిస్తే ఒక్క రష్యా నుంచే అధికంగా చమురు దిగుమతి అయినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
దిల్లీ: భారత ముడి చమురు దిగుమతులు రష్యా నుంచి గత నెలలో మరింతగా పెరిగాయి. సౌదీ అరేబియా, ఇరాక్, యూఏఈ, యూఎస్ల నుంచి సంయుక్తంగా దిగుమతి చేసుకున్న పరిమాణంతో పోలిస్తే ఒక్క రష్యా నుంచే అధికంగా చమురు దిగుమతి అయినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మేలో రష్యా నుంచి రోజుకు 1.96 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును మన దేశం దిగుమతి చేసుకుందని ఎనర్జీ కార్గో ట్రాకర్ వొర్టెక్సా డేటా చెబుతోంది. ఏప్రిల్లో దిగుమతి చేసుకున్న అత్యధిక ముడి చమురు పరిమాణంతో పోల్చినా ఇది 15 శాతం ఎక్కువగా ఉంది. ఇటీవల కొన్నేళ్లలో ఒక దేశం నుంచి అత్యధికంగా భారత్ ముడి చమురు దిగుమతి చేసుకోవడం ఇదే ప్రథమం. మొత్తం అన్ని దేశాల నుంచి దిగుమతైన ముడి చమురులో సుమారు 42 శాతం మేర రష్యా నుంచే ఉండటం గమనార్హం. సౌదీ అరేబియా నుంచి 5,60,000 టన్నుల షిప్మెంట్లు జరిగాయి. 2021 ఫిబ్రవరి తర్వాత ఇదే అత్యల్పమని షిప్పింగ్ అనలిటిక్స్ కంపెనీ గణాంకాలు తెలిపాయి. ఒపెక్ దేశాల నుంచి భారత్ దిగుమతి చేసుకున్న చమురు ఆల్టైమ్ కనిష్ఠ స్థాయికి (39 శాతం) పడిపోయింది.
సౌదీ అరేబియా రోజుకు మిలియన్ బ్యారెళ్ల ఉత్పత్తి కోత
ఫ్రాంక్ఫర్ట్: రోజురోజుకు తగ్గిపోతున్న ముడి చమురు ధరల్ని అదుపు చేసేందుకు సౌదీ అరేబియా రోజుకు మిలియన్ బ్యారెళ్ల ఉత్పత్తి కోతలను ప్రకటించింది. జులై నుంచి కోతలు అమల్లోకి రానున్నాయి. 23 సభ్య దేశాల ఒపెక్ సమావేశం ఆదివారం వియన్నాలోని ప్రధాన కార్యాలయంలో జరిగింది. 2024 చివరి వరకు ప్రస్తుత ఉత్పత్తి కోతలను కొనసాగించడానికి మిగతా ఒపెక్+ దేశాలు అంగీకరించాయి. ఒపెక్ యేతర దేశాల లీడర్గా ఉన్న రష్యా మాత్రం ఉత్పత్తి కోతలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చని సంకేతాలు ఇచ్చింది. గత ఏడాది అక్టోబరు నుంచి ఒపెక్+ దేశాలు ముడి చమురు ఉత్పత్తిలో రెండు సార్లు కోత విధించాయి. తొలిసారిగా అక్టోబరులో రోజుకు 2 మిలియన్ బ్యారెళ్ల చొప్పున ముడి చమురు ఉత్పత్తిని తగ్గించాయి. మరోసారి ఏప్రిల్లో ఎవరూ ఊహించని విధంగా రోజుకు 1.16 మిలియన్ బ్యారెళ్ల చొప్పున ఉత్పత్తి కోత విధించాయి. అయినప్పటికీ ధరల క్షీణత కొనసాగడంతో తాజా కోతలను సౌదీ ప్రకటించింది.
సంక్షిప్తంగా
* సెప్టెంబరుకు ఇండియన్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఐఆర్ఈడీఏ) ఐపీఓ ముసాయిదా పత్రాలను ప్రభుత్వం దాఖలు చేసే అవకాశం ఉందని పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే వెల్లడించారు. ఇప్పటికే మర్చంట్ బ్యాంకర్లను నియమించామని, కంపెనీ విలువ మదింపు ప్రక్రియ జరుగుతున్నట్లు తెలిపారు.
* బాల్కోలో 49 శాతం వాటాను పబ్లిక్ ఆఫర్ ద్వారా విక్రయించాలనుకుంటున్న ప్రభుత్వం.. ఇందుకు ప్రమోటర్ సంస్థ వేదాంతాతో మధ్యవర్తిత్వ దావా ఉపసంహరణకు చర్చలు జరుపుతున్నట్లు దీపం కార్యదర్శి పాండే పేర్కొన్నారు. ఫలితంగా స్టాక్ ఎక్స్ఛేంజీల్లో కంపెనీ నమోదు ప్రక్రియకు ఆటంకాలు ఉండవని అన్నారు.
* మరిన్ని విదేశీ గమ్యస్థానాలకు భారత్ నుంచి నాన్-స్టాప్ విమానాలు ఉండాల్సిన అవసరం ఉందని ఎయిరిండియా సీఈఓ క్యాంప్బెల్ విల్సన్ అభిప్రాయపడ్డారు. సొంత నిర్ణయాలు తీసుకునే అధికారాలు లేకపోవడం వల్ల మంచి దేశీయ విమానయాన పరిశ్రమ లేకుండా పోయిందని అన్నారు. ఇండిగో మంచి విజయాలు సాధిస్తోందని, టాటా ఎయిర్లైన్స్ కూడా ధీటైన పోటీదారు కానుందని వెల్లడించారు.
* గత ఆర్థిక సంవత్సరం (2022-23)లో 180 రుణ పరిష్కార ప్రణాళికలకు ఎన్సీఎల్టీ ఆమోదం తెలిపింది. ఒత్తిడి ఆస్తుల నుంచి మొత్తం రూ.51,424 కోట్లు రాబట్టనున్నారు. 2018-19లో 77 దివాలా ప్రక్రియల నుంచి రూ.1.11 లక్షల కోట్లు రాబట్టిన తర్వాత ఇదే అత్యధికం.
* భారత్కు అద్భుతమైన ఇంజినీరింగ్ శక్తి ఉందని, ఈ శక్తిని వినియోగించుకుని ఉంటే గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి అత్యుత్తమ కంపెనీలు భారత్లో పుట్టి ఉండేవని ప్లగ్ అండ్ పే వ్యవస్థాపక సీఈఓ సయిద్ అమీదీ అభిప్రాయపడ్డారు.
* ఈ ఏడాది ఏప్రిల్లో 379 మౌలిక రంగ ప్రాజెక్టుల వ్యయ అంచనాలు రూ.4.64 లక్షల కోట్లకు పైగా పెరిగాయని గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఒక్కో ప్రాజెక్టు విలువ రూ.150 కోట్లు లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది.
* ఫిన్టెక్ సంస్థ ఫోన్పేలో వాల్మార్ట్ షేర్హోల్డింగ్ 89 శాతం నుంచి 85 శాతానికి తగ్గింది. ప్రస్తుతం కంపెనీ చేపట్టిన బిలియన్ డాలర్ల నిధుల సమీకరణ ఇందుకు కారణం.
* సహారా లైఫ్ పాలసీలు, ఆస్తుల బదిలీ వల్ల ఎస్బీఐ లైఫ్ బ్యాలెన్స్ షీట్పై భారీ ప్రభావం ఉండే అవకాశం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.