Go First: గోఫస్ట్కు నిధుల కొరత.. రెండ్రోజుల పాటు సర్వీసుల నిలిపివేత
Go First Airlines: బడ్జెట్ ధరలో విమానయాన సేవలందించే గోఫస్ట్కు నిధుల కొరత ఎదుర్కొంటోంది. దీంతో మే 3, 4 తేదీల్లో సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది.
ముంబయి: వాడియా గ్రూప్నకు చెందిన విమానయాన సంస్థ గోఫస్ట్ నిధుల (Go First) కొరత ఎదుర్కొంటోంది. దీంతో మే 3, 4 తేదీల్లో విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రాట్ అండ్ విట్నీ (P&W) సంస్థ నుంచి ఇంజిన్ల సరఫరాలో జాప్యం కారణంగానే నిధుల కొరత తలెత్తినట్లు ఆ సంస్థ సీఈఓ కౌశిక్ కోనా తెలిపారు. అలాగే జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ వద్ద స్వచ్ఛంద దివాలా పరిష్కార ప్రక్రియకు దరఖాస్తు చేసినట్లు తెలిపారు.
గోఫస్ట్కు చెందిన 28 విమానాలు నిలిచిపోయాయని కౌశిక్ తెలిపారు. ప్రాట్ అండ్ విట్నీ సంస్థ సకాలంలో ఇంజిన్ల సరఫరా చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని, తద్వారా నిధుల కొరత ఏర్పడిందని వివరించారు. కంపెనీ దివాలా పరిష్కార ప్రక్రియకు వెళ్లడాన్ని దురదృష్టకరమని పేర్కొన్న ఆయన.. కంపెనీ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. దీనికి సంబంధించి పూర్తివివరాలను ప్రభుత్వానికి, డైరెక్టరేట్ జనరల్ ఆప్ సివిల్ ఏవియేషన్ (DGCA)కు తెలియజేసినట్లు కౌశిక్ తెలిపారు. దరఖాస్తును NCLT ఆమోదించినట్లయితే.. విమానాలను పునరుద్ధరిస్తామని చెప్పారు.
గో ఫస్ట్ విమాన సంస్థకు 55 విమానాలు ఉన్నాయి. దేశీయ విమానయాన మార్కెట్లో ఆ సంస్థకు ప్రస్తుతం (మార్చి నాటికి) 6.9 శాతం వాటా ఉంది. గోఫస్ట్కు చెందిన సగానికిపైగా విమానాల్లో ఇంజిన్లలో లోపం కారణంగా గత కొంతకాలంగా నిలిచిపోయాయి. ఒప్పందం ప్రకారం సకాలంలో అమెరికాకు చెందిన పీడబ్ల్యూ సంస్థ ఇంజిన్లను రిపేర్ చేయకపోవడం, తగిన విడిభాగాలను సరఫరా చేయకపోవడమే ఇందుకు కారణం. దీనిపై గతంలో డెలావర్ ఫెడరల్ కోర్టులో గోఫస్ట్ సంస్థ ఫిటిషన్ కూడా దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ సంస్థలో దాదాపు 5 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
డీజీసీఏ షోకాజ్ నోటీసు
గోఫస్ట్ విమానయాన సంస్థకు డీజీసీఏ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా విమాన సర్వీసులను నిలిపివేయడం పట్ల డీజీసీఏ అసహనం వ్యక్తంచేసింది. ప్రయాణికులకు అసౌకర్యానికి గురి చేస్తూ.. ఆమోదించిన టైమ్ టేబుల్ను పాటించకపోవడంతో నోటీసులు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలియజేయాలంటూ నోటీసుల్లో పేర్కొంది. 24 గంటల్లోనే సమాధానం తెలియజేయాలని ఆదేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 202 పాయింట్ల లాభంతో 74,080 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు పుంజుకొని 22,511 దగ్గర కొనసాగుతోంది. -
లేని సీట్లను అమ్మి.. రూ.550 కోట్ల ఫైన్ కట్టి.. ఓ విమానయాన సంస్థ నిర్వాకం!
Qantas: కాంటాస్ అనే ఆస్ట్రేలియా విమానయాన సంస్థ క్యాన్సిల్ అయిన విమానాల్లోని సీట్లను విక్రయించింది. దీన్ని తీవ్రంగా తప్పుబట్టిన అక్కడి నియంత్రణా సంస్థ రూ.550 కోట్ల జరిమానా విధించింది. -
3 ఐపీఓలు.. రూ.6,400 కోట్ల లక్ష్యం
ఈ వారం మూడు కంపెనీల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)లు మార్కెట్లో సందడి చేయనున్నాయి. రూ.6,400 కోట్ల సమీకరించే లక్ష్యంతో ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండీజీన్, టీబీఓ టెక్ ఐపీఓలు వస్తున్నాయి. -
లాభాలకే అవకాశం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత శుక్రవారం సూచీలు భారీగా నష్టపోయినా, అది తాత్కాలికమేనని.. సూచీలు అధిక స్థాయులకు చేరాయనే భావనతో, లాభాల స్వీకరణకు దిగడం వల్లే ఆ పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
పసిడిలో లాభాల స్వీకరణ!
పసిడి ఇటీవల రూ.73,925 వద్ద గరిష్ఠాన్ని తాకిన తర్వాత లాభాల స్వీకరణ కనిపిస్తోంది. ఇదే ధోరణి కొనసాగితే జూన్ కాంట్రాక్టు ఈ వారం రూ.69,418 వరకు పడిపోవచ్చు. -
75,100 పైన మరిన్ని సానుకూలతలు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో గత వారం సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. దేశీయ కంపెనీల త్రైమాసిక ఫలితాలు, ముడిచమురు ధరలు చల్లపడటం కలిసొచ్చాయి. -
పురుగు మందుల అవశేషాలపై భారత్లో కఠిన నిబంధనలు: ప్రభుత్వం
ఆహార పదార్థాల్లో పురుగు మందుల అవశేషాల విషయంలో.. భారత్ అత్యంత కఠినమైన నిబంధనలను కలిగి ఉందని ప్రభుత్వం ఆదివారం పునరుద్ఘాటించింది. -
గృహ రుణ బకాయిలు పెరిగాయ్: ఆర్బీఐ
గృహ నిర్మాణ రంగానికి బకాయిపడిన రుణాలు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో సుమారు రూ.10 లక్షల కోట్లు పెరిగి ఈ ఏడాది మార్చి నాటికి రికార్డు స్థాయిలో రూ.27.23 లక్షల కోట్లకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన డేటా వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్
-
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
-
లేని సీట్లను అమ్మి.. రూ.550 కోట్ల ఫైన్ కట్టి.. ఓ విమానయాన సంస్థ నిర్వాకం!
-
‘వచ్చేది వైకాపా ప్రభుత్వమే... మాట వినకపోతే చంపేస్తా’
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM