Google: ‘భవిష్యత్తును అంచనా వేయడం కష్టం’.. ఉద్యోగులతో సుందర్ పిచాయ్!
గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్ లేఆఫ్లు ప్రకటించనుందనే గత కొంతకాలంగా వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులతో కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ చెప్పిన మాటలు వీటికి మరింత బలం చేకూరుస్తున్నాయి.
కాలిఫోర్నియా: మాంద్యం భయాలు వెంటాడుతున్న నేపథ్యంలో టెక్ కంపెనీలు ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడంపై దృష్టి సారించాయి. ఇందులో భాగంగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను ప్రారంభించాయి. ఇప్పటికే ట్విటర్ (Twitter), మెటా (meta), అమెజాన్ (Amazon) వంటి దిగ్గజ సంస్థలు ఉద్యోగులకు లేఆఫ్లు ప్రకటించాయి. కొద్దిరోజులు క్రితం గూగుల్ (Google) సైతం పదివేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. దీనిపై ఆందోళనలో ఉన్న ఉద్యోగులు కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ (sundar pichai) వద్ద లేఆఫ్లపై స్పష్టత ఇవ్వాలని కోరగా భవిష్యత్తును ఊహించడం కష్టమని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం.
కంపెనీ ఇటీవల నిర్వహించిన సమావేశంలో పలువురు ఉద్యోగులు లేఆఫ్ల గురించి పిచాయ్ను ప్రశ్నించగా ఆయన వారికి భరోసా ఇవ్వలేదట. ‘‘భవిష్యత్తును అంచనా వేయడం చాలా కష్టం. నేను నిజాయితీగా మీ ముందు కూర్చుని భరోసా ఇవ్వలేను. క్రమశిక్షణతో కూడిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోక తప్పడంలేదు. రాబోయే ముప్పును ఎదుర్కొనేందుకు సరైన ప్రణాళికతో సిద్ధంగా ఉండాలి. దానిపైనే దృష్టి సారించి, మనవంతు ప్రయత్నం చేయాలి భావిస్తున్నాను’’ అని వ్యాఖ్యానించినట్లు ది ఇన్ఫర్మేషన్ అనే అమెరికన్ వార్తా సంస్థ పేర్కొంది.
ఉద్యోగుల తొలగింపుపై ఇప్పటి వరకు గూగుల్ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. రాబోయే రోజుల్లో గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ (alphabet) మొత్తం ఉద్యోగుల్లో ఆరు శాతం మందిని తొలగించనుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ అంచనాలకు అనుగుణంగా పనిచేయని ఉద్యోగుల జాబితాను సిద్ధం చేయాలని పలు విభాగాల మేనేజర్లను కోరినట్లు సమాచారం. పనితీరు సరిగాలేని ఉద్యోగులను గుర్తించేందుకు గూగుల్ కొత్త మేనేజ్మెంట్ సిస్టమ్ను పరిచయం చేసినట్లు తెలుస్తోంది. ఆ నివేదికల ఆధారంగా కొత్త సంవత్సరంలో తొలగింపులు ఉంటాయని వార్తలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం ఆల్ఫాబెట్లో సుమారు 1,87,000 మంది పనిచేస్తున్నారు. ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో రిక్రూట్మెంట్ ప్రక్రియను నెమ్మదించనున్నట్లు కంపెనీ ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో సుందర్ పిచాయ్ వ్యాఖ్యలు ఉద్యోగుల తొలగింపునకు మరింత బలం చేకూరుస్తున్నాయి.
ఇటీవల ట్విటర్ను కొనుగోలు చేసిన తర్వాత మస్క్ కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. గత నెలలోనే సగానికి పైగా ఉద్యోగుల్ని ఎలాన్ మస్క్ (elon musk) తొలగించారు. మరోవైపు ఆయన జారీ చేసిన అల్టిమేటంతో దాదాపు మరో 1200 మంది రాజీనామా చేశారు. తాజాగా మరింత మందిని తొలగించేందుకు మస్క్ సిద్ధమవుతున్నట్లు బ్లూమ్బెర్గ్ తెలిపింది. అయితే, ట్విటర్ భవిష్యత్పై తాను ఏమాత్రం ఆందోళనపడటం లేదని, అత్యుత్తమ ఉద్యోగులే తమతో ఉంటారని మస్క్ పేర్కొనడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం