Russian Crude Oil: 35 శాతం చమురు రష్యా నుంచే
Russian Crude Oil: వోర్టెక్సా వివరాల ప్రకారం ఫిబ్రవరిలో ఇరాక్ నుంచి రోజుకు 9,39,921 బ్యారెళ్లు, సౌదీ అరేబియా నుంచి 6,47,813 బ్యారెళ్లు, యూఏఈ నుంచి 4,04,570 బ్యారెళ్లు, అమెరికా నుంచి 2,48,430 బ్యారెళ్లు, రష్యా నుంచి 16 లక్షల బ్యారెళ్ల చమురు భారత్కు దిగుమతి అయ్యింది.
దిల్లీ: రష్యా (Russia) నుంచి భారత్కు చమురు (Crude Oil) దిగుమతి ఫిబ్రవరిలో మరింత పెరిగింది. మన దేశానికి చమురు (Crude Oil) సరఫరా చేస్తున్న దేశాల జాబితాలో రష్యా (Russia) వరుసగా ఐదోనెలా తొలిస్థానంలో నిలిచింది. 2023 ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో రోజుకు 16 లక్షల పీపాలకు పైగా చమురు (Crude Oil) దిగుమతి అయినట్లు ఇంధన సరఫరా సమాచారాన్ని సేకరించే వోర్టెక్సా వెల్లడించింది. ఇది ఇరాక్, సౌదీ అరేబియా.. రెండూ కలిపి భారత్కు సరఫరా చేస్తున్న చమురు కంటే ఎక్కువ కావడం గమనార్హం.
2022 మార్చి 31 నాటికి భారత్ ఏటా దిగుమతి చేసుకుంటున్న చమురు (Crude Oil)లో రష్యా (Russia) వాటా కేవలం 0.2 శాతం మాత్రమే. ఫిబ్రవరి నాటికి అది రోజుకి 16 లక్షల బ్యారెళ్లకు చేరడం గమనార్హం. గత ఏడాది నవంబరులో రోజుకి 9,09,403 బ్యారెళ్లు, అక్టోబరులో 9,35,556 పీపాల చమురు దిగుమతి అయ్యింది. అక్టోబరులో తొలిసారి ఇరాక్, సౌదీ అరేబియాను అధిగమించి భారత్కు చమురు సరఫరా చేస్తున్న అతిపెద్ద దేశంగా రష్యా (Russia) నిలిచింది. భారత్ దిగుమతి చేసుకుంటున్న చమురులో ఇప్పుడు 35 శాతం రష్యా నుంచే వస్తోంది.
జలమార్గాన సరఫరా అవుతున్న రష్యా (Russia) చమురు ధరపై ఐరోపా సమాఖ్య పరిమితి విధించిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కో పీపా ఇప్పుడు 60 డాలర్ల కంటే తక్కువకే దొరుకుతోంది. ఈ నేపథ్యంలోనే రష్యా నుంచి భారత్ దిగుమతుల్ని మరింత పెంచిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ప్రపంచంలో అత్యధికంగా చమురు వినియోగించుకునే దేశాల్లో భారత్ మూడోది. మొత్తం చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతుల ద్వారానే సమకూర్చుకుంటోంది.
వోర్టెక్సా వివరాల ప్రకారం ఫిబ్రవరిలో ఇరాక్ నుంచి రోజుకు 9,39,921 బ్యారెళ్లు, సౌదీ అరేబియా నుంచి 6,47,813 బ్యారెళ్లు, యూఏఈ నుంచి 4,04,570 బ్యారెళ్లు, అమెరికా నుంచి 2,48,430 బ్యారెళ్ల చమురు భారత్కు దిగుమతి అయ్యింది. భారత్కు చమురు సరఫరా చేస్తున్న దేశాల జాబితాలో అమెరికాను అధిగమించి యూఏఈ నాలుగో స్థానానికి చేరింది. సౌదీ నుంచి చమురు దిగుమతులు 16 శాతం, అమెరికా నుంచి 38 శాతం కుంగాయి.
ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యాను నిలువరించడం కోసం పశ్చిమ దేశాలు ఆ దేశ చమురుపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో తమ చమురును రాయితీ ధరకు అందించడానికి రష్యా ముందుకు వచ్చింది. అప్పటి నుంచి భారత్ పెద్ద మొత్తంలో ఆ దేశం నుంచి చమురును దిగుమతి చేసుకుంటోంది. యుద్ధం ప్రారంభానికి ముందు పశ్చిమాసియా దేశాల నుంచే భారత్ 60 శాతం దిగుమతి చేసుకునేది. మరో 14 శాతం ఉత్తర అమెరికా దేశాలు, 12 శాతం పశ్చిమ ఆఫ్రికా దేశాలు, లాటిన్ అమెరికా దేశాల నుంచి 5 శాతం, రష్యా నుంచి కేవలం 2 శాతం చమురు మాత్రమే దిగుమతి అయ్యేది. రష్యా- ఉక్రెయిన్ ఘర్షణ తర్వాత పశ్చిమాఫ్రికా దేశాల చమురు ఖరీదుగా మారింది. రష్యా చమురును కొనడం ఆపేసిన ఐరోపా దేశాలు పశ్చిమాఫ్రికా చమురుపై ఆధారపడడమే అందుకు కారణం. భారత ప్రయోజనాల దృష్ట్యా చౌకగా దొరికిన దగ్గరే చమురును కొనుగోలు చేస్తామని విదేశాంగ మంత్రి 2022 డిసెంబరు 7న రాజ్యసభలో స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.