Adani Group: హిండెన్బర్గ్ నివేదిక తర్వాత తొలిసారి.. విదేశీ రుణం కోసం ‘అదానీ’ కంపెనీ ప్రయత్నాలు!
Adani Group: అదానీకనెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ జాయింట్ వెంచర్ రుణం కోసం పలు విదేశీ బ్యాంకులతో ఇప్పటికే చర్చలు ప్రారంభించినట్లు కంపెనీకి చెందిన ఇద్దరు కీలక వ్యక్తులు వెల్లడించారు.
ఇంటర్నెట్ డెస్క్: డేటా సెంటర్ ప్రొవైడర్ ఎడ్జ్కనెక్స్తో కలిసి అదానీ గ్రూప్ (Adani Group) ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ విదేశీ రుణాలను సమకూర్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. ఈ మేరకు వివిధ బ్యాంకులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 220 మిలియన్ డాలర్ల రుణం కోసం ప్రయత్నిస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఇద్దరు ఉన్నతోద్యోగులు తెలిపారు. హిండెన్బర్గ్ నివేదిక వెలువడిన తర్వాత అదానీ గ్రూప్ (Adani Group)నకు చెందిన ఓ సంస్థ ఇలా విదేశీ రుణ సమీకరణకు అడుగులు వేయడం ఇదే తొలిసారి.
అదానీకనెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే జాయింట్ వెంచర్ పలు విదేశీ బ్యాంకులతో ఇప్పటికే చర్చలు ప్రారంభించినట్లు కంపెనీకి చెందిన ఇద్దరు కీలక వ్యక్తులను ఉటంకిస్తూ బ్లూమ్బెర్గ్ కథనం ప్రచురించింది. దాదాపు ఐదేళ్ల కాలపరిమితితో ఈ రుణం తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే కొన్ని వారాల్లో ఈ రుణ మంజూరు ప్రక్రియ పూర్తవుతుందని కంపెనీ ఆశిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ రుణం మంజూరైతే.. ఆ నిధులను డేటా సెంటర్ల మౌలిక వసతుల అభివృద్ధికి వినియోగించనున్నట్లు తెలుస్తోంది.
అదానీ గ్రూప్ (Adani Group) తమ నమోదిత కంపెనీల షేర్ల ధరల్ని కృత్రిమంగా పెంచిందని 2023 జనవరి 23న వెలువడిన నివేదికలో అమెరికా షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్ ఆరోపించిన విషయం తెలిసిందే. అలా విలువ పెరిగిన షేర్లను తనఖా పెట్టి రుణాలను పొందిందని ఆరోపించింది. అలాగే అకౌంటింగ్ మోసాలకు సైతం పాల్పడినట్లు పేర్కొంది. ఈ ఆరోపణల్ని అదానీ గ్రూప్ (Adani Group) తీవ్రంగా ఖండించింది. అయినప్పటికీ.. అదానీ నమోదిత సంస్థల మార్కెట్ విలువ భారీగా పడిపోయింది. మరోవైపు మార్కెట్ నియంత్రణా సంస్థ సెబీ.. హిండెన్బర్గ్ ఆరోపణలపై దర్యాప్తు చేస్తోంది. ఈ తరుణంలో అదానీకి చెందిన ఓ కంపెనీ మరోసారి విదేశీ రుణాల కోసం ప్రయత్నిస్తుండడం చర్చనీయాంశంగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎయిర్లైన్స్ లాభాల్లో బిగ్ జంప్.. ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్..
అంచనాలకు మించి లాభాలు నమోదు చేయడంతో సింగపూర్ ఎయిర్లైన్స్ తన ఉద్యోగులకు 8 నెలల జీతాన్ని బోనస్గా అందిస్తున్నట్లు ప్రకటించింది. -
అందుకే భారత్తో వాణిజ్య బంధం తెగిపోయింది: పాక్
Pakistan: పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య వాణిజ్యం సైతం దెబ్బతింది. తాజాగా దీనిపై ఆ దేశ విదేశాంగ మంత్రి స్పందించారు. -
Artificial Intelligence: ఎటు చూసినా ఏఐ...
మనదేశంలో ఏఐ (కృత్రిమ మేధ) వినియోగం శరవేగంగా పెరుగుతోంది. కార్యాలయాల్లో అధిక శాతం ఉద్యోగులు ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సమర్థంగా సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
స్టాక్ మార్కెట్.. ఎఫ్అండ్ఓపై ఎందుకింత మోజు..?
దేశంలో పొదుపు మొత్తాలు ఎఫ్అండ్ఓ (ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్) ట్రేడ్లోకి వెళ్తున్నాయని, దీనిపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోందని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారుడు వి.అనంత నాగేశ్వరన్ అన్నారు. -
మన సమాచారం సురక్షితమేనా?
దేశంలో డిజిటల్ ఆర్థిక లావాదేవీలు విపరీతంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో సైబర్ నేరాల సంఖ్యా అధికమవుతోంది. వీటిని నివారించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎప్పటికప్పుడు తమ వివరాల్లో మార్పులేమైనా ఉంటే సమర్పించాలని ఖాతాదారులను కోరుతున్నాయి. -
ఐసీఐసీఐ మాజీ ఛైర్మన్ వాఘుల్ కన్నుమూత
ప్రభుత్వ రంగంలోని ఐసీసీఐని ప్రైవేటు సంస్థగా మార్చడంలో కీలక పాత్ర పోషించిన నారాయణ్ వాఘుల్ (88) ఆరోగ్య సమస్యలతో శనివారం చెన్నైలోని ఒక ఆసుపత్రిలో మరణించారు. బ్యాంకింగ్ పరిశ్రమలో ఆయన ప్రస్థానం 1960లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రారంభమైంది. -
ఓయో ఐపీఓ దరఖాస్తు ఉపసంహరణ!
తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) కోసం సెబీకి సమర్పించిన దరఖాస్తును ఓయో ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కంపెనీ రీఫైనాన్సింగ్ ప్రణాళికను ఖరారు చేసే పనిలో ఉందని.. ఈ ప్రక్రియ పూర్తయ్యాక తిరిగి ఐపీఓకు దరఖాస్తు చేసే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
ఆభరణాల దిగుమతులు భారీగా పెరిగాయ్
ఈ ఏడాది ఏప్రిల్లో దేశంలోకి పసిడి ఆభరణాల దిగుమతులు భారీగా పెరిగి రూ.2225 కోట్ల (268.04 మిలియన్ డాలర్ల) స్థాయికి చేరాయని జెమ్ అండ్ జువెలరీ ఎగుమతుల ప్రోత్సాహక మండలి తెలిపింది. 2023 ఏప్రిల్లో ఇవి సుమారుగా రూ.267 కోట్ల (32.12 మిలియన్ డాలర్ల) స్థాయిలోనే ఉన్నాయి. -
చైనా ఈవీలు, లోహాలపై దిగుమతి సుంకాల పెంపు
చైనాలో తయారయ్యే విద్యుత్ వాహనాలు (ఈవీ), అత్యాధునిక బ్యాటరీలు, సోలార్ సెల్స్, వైద్య సామగ్రితో పాటు అక్కడ నుంచి దిగుమతి అయ్యే ఉక్కు, అల్యూమినియంపై కొత్త టారిఫ్లు విధిస్తామని బైడెన్ ప్రభుత్వం ప్రకటించింది. -
ప్రత్యేక ట్రేడింగ్లో స్వల్ప లాభాలు
విదేశీ మదుపర్ల కొనుగోళ్ల మద్దతుతో ప్రత్యేక ట్రేడింగ్ సెషన్లో సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. ప్రాథమిక సైట్లో వైఫల్యం తలెత్తినా ఎదుర్కొనేందుకు వాటి సంసిద్ధతను తనిఖీ చేయడానికి బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు ఈ ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ను శనివారం రెండు దఫాలుగా నిర్వహించాయి. -
వ్యవసాయ అంకురాలు దూసుకెళ్తున్నాయ్
అనుకూల వ్యాపార విధానాలు, ప్రభుత్వ మద్దతు కారణంగా గత తొమ్మిదేళ్లలో వ్యవసాయ - అనుబంధ రంగాల్లో అంకురాల సంఖ్య దాదాపు 7,000కు పైగా పెరిగిందని అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య (ఫైఫా) వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు
దొడ్ల డెయిరీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.787.4 కోట్ల ఆదాయం, రూ.46.8 కోట్ల నికర లాభం, రూ.7.79 ఈపీఎస్ నమోదు చేసింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.724.3 కోట్లు, నికరలాభం రూ.22.5 కోట్లు, ఈపీఎస్ రూ.3.76 ఉన్నాయి. -
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
Tecno: టెక్నో కెమన్ సిరీస్లో రెండు కొత్త మొబైల్స్ను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్ల విషయాలపై ఓ లుక్కేద్దాం..
తాజా వార్తలు (Latest News)
-
ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు
-
ఆఖరి లీగ్ మ్యాచ్లోనూ అదే జోరు.. పంజాబ్పై సన్రైజర్స్ ఘన విజయం
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు
-
తెలంగాణ మంత్రివర్గ భేటీకి ముహూర్తం ఖరారు
-
తెలంగాణలో పలు చోట్ల వర్షం.. పిడుగుపాటుకు ముగ్గురి మృతి
-
నరసరావుపేటలో రెండో రోజు సిట్ దర్యాప్తు.. పోలీస్ స్టేషన్కు మంత్రి అంబటి