LIC Market share: ఎల్ఐసీ మార్కెట్ వాటాలో క్షీణత.. పెరిగిన ‘ప్రైవేట్’ షేర్!
LIC market share: ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ మార్కెట్ వాటా సెప్టెంబర్ నెలలో క్షీణించింది. గతేడాదితో పోలిస్తే దాదాపు 10 శాతం మేర వాటా తగ్గింది. అదే సమయంలో ప్రైవేటు వాటా స్వల్పంగా పెరిగింది.
LIC market share | ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ (LIC) మార్కెట్ వాటా క్షీణించింది. జీవిత బీమా రంగంలో తనకు ఎదురులేదంటూ ఇన్నాళ్లు నిరూపించుకుంటూ వచ్చిన ఆ సంస్థ.. మార్కెట్ వాటా (LIC market share) సెప్టెంబర్ నెలలో తగ్గుముఖం పట్టింది. ఎల్ఐసీ కొత్త బిజినెస్ ప్రీమియం వసూళ్లు దాదాపు 10 శాతం మేర తగ్గాయి. గతేడాది ఇదే సమయంలో 68.25 శాతంగా ఉన్న ఎల్ఐసీ మార్కెట్ వాటా.. ఈ ఏడాది 58.50 శాతానికి తగ్గింది. అదే సమయంలో ప్రైవేటు సంస్థల మార్కెట్ వాటా స్వల్పంగా పెరగడం గమనార్హం. అయితే, ప్రైవేటు సంస్థల అన్నింటి వాటా కలిపినా ఎల్ఐసీ మార్కెట్ వాటాకు ఇంకా చాలా దూరంలో ఉండడం గమనార్హం.
ఎల్ఐసీ సహా వివిధ జీవిత బీమా సంస్థల సెప్టెంబర్ నెల వ్యాపార సరళికి సంబంధించిన డేటాను లైఫ్ ఇన్సురెన్స్ కౌన్సిల్ తాజాగా వెల్లడించింది. సెప్టెంబర్ నెలలో రూ.92,462 కోట్ల విలువైన కొత్త పాలసీలను ఎల్ఐసీ విక్రయించింది. గతేడాది ఇదే సమయంలో రూ.1.25 లక్షల కోట్ల విలువైన ప్రీమియంలను ఎల్ఐసీ విక్రయించడం గమనార్హం. పార్టిసిపేటింగ్ ప్రొడక్ట్లు తక్కువగా అమ్ముడవ్వడం, నాన్ పార్టిసిపేటింగ్ ప్రొడక్ట్లు తగినంత లేకపోవడం, కొన్ని బీమా ప్లాన్ల ఫీచర్లు, ధరల్లో మార్పులు వంటివి ఎల్ఐసీ మార్కెట్ క్షీణతకు కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
వాట్సాప్లో త్వరలో ‘సీక్రెట్ కోడ్’.. ఇంతకీ ఎలా పనిచేస్తుందంటే?
అదే సమయంలో ప్రైవేటు ఇన్సురెన్స్ సంస్థల మార్కెట్ వాటా పుంజుకోవడం గమనార్హం. 2022 సెప్టెంబర్లో 31.75 శాతంగా ఉన్న వీటి వాటా.. ఈ ఏడాది 41.50 శాతానికి పెరిగింది. హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సురెన్స్నే తీసుకుంటే.. సెప్టెంబర్లో మార్కెట్ వాటా 6.07 శాతం నుంచి 8.31 శాతానికి పెరిగింది. ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్ వాటా 7.19 శాతం నుంచి 10.27 శాతానికి పెరిగింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సురెన్స్, బజాజ్ అలియాన్జ్ లైఫ్ ఇన్సురెన్స్, మ్యాక్స్ లైఫ్ ఇన్సురెన్స్ మార్కెట్ వాటా సైతం ఒక్కో శాతం మేర పెరగడం గమనార్హం.
మరోవైపు ఇప్పటికీ ఏజెంట్ల నెట్వర్క్పైనే ఎల్ఐసీ ఎక్కువగా ఆధారపడుతోందని అనలిస్టులు చెబుతున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో జరిగిన వ్యాపారంలో 96 శాతం కొత్త పాలసీలు.. ఏజెంట్లు, ఇన్సురెన్స్ అడ్వైజర్ల రూపంలో వచ్చినవే. అదే సమయంలో ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్ 18, హెచ్డీఎఫ్సీ 20 శాతం పాలసీలు మాత్రమే ఏజెంట్ల నుంచి రావడం గమనార్హం. ప్రైవేటు కంపెనీలు ప్రధానంగా డిజిటల్ బాట పడుతుండగా.. ఎల్ఐసీ మాత్రం ఇంకా ఏజెంట్లపైనే ఆధారపడుతోందని పేర్కొంటున్నారు. యువత ఎక్కువగా డిజిటల్ సర్వీసులను కోరుకుంటున్నారని, ఏదైనా సమస్య ఎదురైతే పరిష్కారానికి కూడా ఆన్లైన్పైనే ఆధారపడుతున్నారని చెబుతున్నారు. ప్రైవేటు సంస్థలు డిజిటల్ విషయంలో ముందంజలో ఉన్నాయని పేర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
Indegene IPO: రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఇండీజీన్ ఐపీఓ ప్రారంభమైంది. మదుపర్లు రూ.14,916తో కనీసం 33 షేర్లకు (ఒక లాట్) బిడ్లు దాఖలు చేయాలి. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 202 పాయింట్ల లాభంతో 74,080 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు పుంజుకొని 22,511 దగ్గర కొనసాగుతోంది. -
లేని సీట్లు అమ్మి.. రూ.550 కోట్ల ఫైన్ కట్టి.. ఓ విమానయాన సంస్థ నిర్వాకం!
Qantas: కాంటాస్ అనే ఆస్ట్రేలియా విమానయాన సంస్థ క్యాన్సిల్ అయిన విమానాల్లోని సీట్లను విక్రయించింది. దీన్ని తీవ్రంగా తప్పుబట్టిన అక్కడి నియంత్రణా సంస్థ రూ.550 కోట్ల జరిమానా విధించింది. -
3 ఐపీఓలు.. రూ.6,400 కోట్ల లక్ష్యం
ఈ వారం మూడు కంపెనీల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)లు మార్కెట్లో సందడి చేయనున్నాయి. రూ.6,400 కోట్ల సమీకరించే లక్ష్యంతో ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండీజీన్, టీబీఓ టెక్ ఐపీఓలు వస్తున్నాయి. -
లాభాలకే అవకాశం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత శుక్రవారం సూచీలు భారీగా నష్టపోయినా, అది తాత్కాలికమేనని.. సూచీలు అధిక స్థాయులకు చేరాయనే భావనతో, లాభాల స్వీకరణకు దిగడం వల్లే ఆ పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
పసిడిలో లాభాల స్వీకరణ!
పసిడి ఇటీవల రూ.73,925 వద్ద గరిష్ఠాన్ని తాకిన తర్వాత లాభాల స్వీకరణ కనిపిస్తోంది. ఇదే ధోరణి కొనసాగితే జూన్ కాంట్రాక్టు ఈ వారం రూ.69,418 వరకు పడిపోవచ్చు. -
75,100 పైన మరిన్ని సానుకూలతలు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో గత వారం సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. దేశీయ కంపెనీల త్రైమాసిక ఫలితాలు, ముడిచమురు ధరలు చల్లపడటం కలిసొచ్చాయి. -
పురుగు మందుల అవశేషాలపై భారత్లో కఠిన నిబంధనలు: ప్రభుత్వం
ఆహార పదార్థాల్లో పురుగు మందుల అవశేషాల విషయంలో.. భారత్ అత్యంత కఠినమైన నిబంధనలను కలిగి ఉందని ప్రభుత్వం ఆదివారం పునరుద్ఘాటించింది. -
గృహ రుణ బకాయిలు పెరిగాయ్: ఆర్బీఐ
గృహ నిర్మాణ రంగానికి బకాయిపడిన రుణాలు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో సుమారు రూ.10 లక్షల కోట్లు పెరిగి ఈ ఏడాది మార్చి నాటికి రికార్డు స్థాయిలో రూ.27.23 లక్షల కోట్లకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన డేటా వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
-
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!
-
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
-
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్
-
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?