ఆఫీసు బాయ్ నుంచి కోట్ల వ్యాపారం దాకా!
‘ఇది కాదు... ఇది కానే కాదు. నేను ఉండాల్సిన చోటు ఇది కాదు... నేను చేరుకోవాల్సిన గమ్యం ఇది కాదు... అందుకోవాల్సిన లక్ష్యం ఇంకా నా
‘ఇది కాదు... ఇది కానే కాదు. నేను ఉండాల్సిన చోటు ఇది కాదు... నేను చేరుకోవాల్సిన గమ్యం ఇది కాదు... అందుకోవాల్సిన లక్ష్యం ఇంకా నా దరిచేరలేదు!’ ఈ ఆలోచనే తనని నిత్యం తొలుస్తుందంటారు ఫణిరాజు జాలిగామా. ఏదో సాధించేశాననుకున్న ప్రతిసారీ ఈ భావన ములుకర్రలా ముందుకు తోస్తోందని చెబుతారు. బహుశా, అదే కోర్టు వాకిట సెక్యూరిటీగార్డుగా పనిచేసిన ఆయన్ని కోట్ల వ్యాపారం చేసే ఐటీ సంస్థ ‘ఓజస్ ఇన్నొవేటివ్ టెక్నాలజీ’కి అధినేతని చేసిందని చెప్పాలి. ఆ ఆసక్తికరమైన ప్రయాణం ఇది...
'కరీంనగర్ జిల్లా పెద్దపల్లి టౌన్ మాది. నాన్న అక్కడ రిజిస్టర్ స్టాంపులు అమ్ముతుండేవారు. ఓ దశలో నాన్నకి వ్యాపారం చేయడం రాక మేం మా తాతలిచ్చిన కొద్దిపాటి ఆస్తితోనే రోజులు గడపాల్సి వచ్చింది. నేను పదో తరగతికి వచ్చేటప్పటికీ ఆ ఆస్తి కూడా కరిగిపోయింది. దాంతో ఎస్ఎస్సీలో 85 శాతం మార్కులు తెచ్చుకున్న నేను అంతటితో చదువు మానేయాల్సి వచ్చింది. ఓ పాన్ షాపులో పనికి చేరాను. కొంతకాలం స్వాతి వీక్లీకి ఏజెంట్గా కుదిరాను. అలా వచ్చిన డబ్బుతోనే ఐటీఐలో చేరి ఎలక్ట్రీషియన్ కోర్సు చదివాను. ఆ పనులతో వచ్చేఆదాయంతో ఇంటర్లో జాయినయ్యాను. ఇంటర్ పాసై డ్రైవింగ్ నేర్చుకుని కారు డ్రైవర్గా మారాను. అప్పుడే కరీంనగర్ జిల్లా కోర్టులో ఆఫీసుబాయ్ ఉద్యోగాలున్నాయని తెలిసి దరఖాస్తు చేశాను. కోర్టులో ఆఫీసుబాయ్ ఉద్యోగాలకి పదో తరగతి కనీసార్హతతోపాటూ డ్రైవింగ్, ఎలక్ట్రికల్ పనులు వంటివి తెలిసినవాళ్లకి ప్రాధాన్యం ఇస్తారు. నాకు ఆ రెండూ తెలియడం కలిసొచ్చి సర్కారు కొలువులో కుదురుకున్నాను. కోర్టుకెళ్లాక, అక్కడ క్లర్కుకున్న ప్రాధాన్యం చూశాక... ఆ ఉద్యోగం సాధించడమే నా కలగా మారింది! కానీ నేను చేస్తున్న ‘అటెండర్’ స్థాయి నుంచి ఒక్కో ప్రమోషనూ అందుకుంటూ క్లర్కు స్థాయి (ఎల్డీసీ)కి వెళ్లాలంటే కనీసం ఇరవైయేళ్లు పడుతుందని చెప్పారు. కానీ షార్ట్హ్యాండ్ పాసైతే ‘కాపీయిస్టు’గా అదే హోదా ఉన్న ఉద్యోగం సాధించవచ్చన్నారు. అప్పట్లో షార్ట్హ్యాండ్ నేర్చుకోవాలంటే హైదరాబాద్కి వెళ్లకతప్పదు. మరి నా డ్యూటీని వదులుకుని ఎలా వెళ్లను... అందుకే మా జడ్జి మస్తానమ్మని అడిగి రాత్రిళ్లు కోర్టుకి సెక్యూరిటీగార్డుగా చేసేందుకు అనుమతి తీసుకున్నాను. అలా రాత్రంతా గార్డుగా పనిచేసి... ఉదయాన్నే హైదరాబాద్ వెళ్లి షార్ట్హ్యాండ్ నేర్చుకుని వచ్చేవాణ్ణి. ఏ కాస్త ఖాళీ సమయం దొరికినా ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాణ్ణి. అలా రెండు నెలల్లోనే నిమిషానికి 225 పదాలు రాసేంతగా షార్ట్హ్యాండ్లో పట్టుసాధించాను... కనీసం ఏడాది ప్రాక్టీస్ చేస్తేకానీ రాని స్పీడ్ అది! అంతేకాదు, పరీక్షలో డిస్టింక్షన్లో పాసయ్యాను. ఆ ఏడాది జిల్లా న్యాయస్థానంలో కాపీయిస్టుల కోసం జరిగిన పోటీలకి హాజరై ఆ ఉద్యోగం సాధించాను. ఈలోపు నా మరదలు శ్రీలలితతో పెళ్ళైంది.
ఐటీరంగంలోకి...
పెళ్ళినాటికే మా ఆవిడ ఎంసీఏ పూర్తి చేసింది. తనకి ఎలాగూ ఐటీ ఉద్యోగం వస్తుంది కాబట్టి... నేను నా పనికి రాజీనామా చేసి ఎంబీఏ చదువుదామనుకున్నాను. కానీ అది 2000 సంవత్సరం... వై2కెతో ఏర్పడ్డ సంక్షోభం కారణంగా ఏ ఐటీ కంపెనీలోనూ ‘ఫ్రెషర్స్’ని తీసుకునేవాళ్లు కాదు. నాలుగేళ్ల ప్రయత్నంలోనూ తనకి ఉద్యోగం రాలేదు. నేను అప్పటికే కరస్పాండెన్స్లో డిగ్రీ పూర్తిచేశాను. ఆ తర్వాత ఏంబీఏ చేయాలన్న తొందరలో తనపైన ఒత్తిడి తేసాగాను. ఓ దశలో తను ‘నీకున్న ప్రతిభకి నాకన్నా నీకే ఐటీ ఉద్యోగం కరెక్ట్గా ఉంటుంది. ప్రయత్నించు...’ అంది. ఆ రోజు ఏ కళనున్నానో తెలియదు కానీ... ప్రభుత్వ ఉద్యోగానికి సుదీర్ఘ సెలవుపెట్టి కంప్యూటర్స్ నేర్చుకోవడం మొదలుపెట్టాను. పుణెలోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగంలో చేరాను. చేరిన ఆరునెలల్లోనే ఇక ఐటీదే భవిష్యత్తని అర్థమైపోయింది. బంధువులు వద్దంటున్నా వినకుండా నా ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశాను. ఐటీ రంగంలో ఎదగాలని ఎంబీఏ కూడా పూర్తిచేసి... టీసీఎస్లో సీనియర్ మేనేజర్గా చేరాను. అలా 15 వేల రూపాయల జీతంతో ఐటీరంగంలోకి అడుగుపెట్టిన నేను... ఈ హోదాతో నెలకి నాలుగున్నర లక్షల జీతం అందుకోసాగాను. ఆ తర్వాత కాగ్నిజెంట్ టెక్నాలజీ సంస్థలో అసోసియేట్ డైరెక్టర్గా వెళ్లాను. అప్పుడే నా మిత్రుడు అరుణ్తో కలిసి సొంతంగా సంస్థని స్థాపించాలనే ఆలోచన వచ్చి ‘ఓజస్ ఇన్నొవేటివ్ టెక్నాలజీస్’ సంస్థని స్థాపించాం. ఒకప్పుడు మా భార్యల నగలమ్మి స్థాపించిన సంస్థ ఇప్పుడు ఏటా సుమారు యాభై కోట్ల టర్నోవర్ అందుకుంటోంది. అమెరికాలోని సీమన్స్, ఇన్ఫ్యుజన్ సాఫ్ట్ వంటి పెద్ద సంస్థలు మా వినియోగదారులు.
ఏ డిగ్రీ అయినా...
ఐటీ రంగంలోకి అడుగుపెట్టడానికి నేనూ నా భార్యా పడ్డ ఇబ్బందులు... నేటి యువతరానికి ఉండకూడదన్నది మా సంస్థ లక్ష్యాల్లో ఒకటి. అందుకే- టాప్ కాలేజీల్లో ఉన్న ర్యాంకర్లనే కాకుండా... అమీర్పేటలో అవస్థలు పడుతున్నవాళ్లనీ ఉద్యోగులుగా చేర్చుకుంటున్నాం. మేమే శిక్షణ ఇచ్చి... ఐదులక్షలదాకా ప్యాకేజీ ఇస్తున్నాం. మా సంస్థకి అనుబంధంగా ఇటీవల ‘హ్యాష్బ్లాక్స్’ అన్న సంస్థని ప్రారంభించాం. దీని ద్వారా బీఏ బీకామ్లాంటివి చదివినవాళ్లకీ, ఇతర రంగాల్లో ఉండి ఐటీ పరిశ్రమలోకి అడుగుపెట్టాలనుకున్నవాళ్లకీ శిక్షణ ఇచ్చి ‘ఓజస్’లో చేర్చుకుంటున్నాం. మనదేశంలో ‘జోహో’ తర్వాత ఇలాంటి ప్రయోగం చేస్తున్న సంస్థ మాదే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటి కోసం సిద్ధం ఇలా
సొంతిల్లు కొనాలనే ఆలోచనతో ఉన్నారా? మీ దగ్గర ఎంత డబ్బుంది? గృహరుణం ఎంత తీసుకోవాలి? ఇలాంటి లెక్కలన్నీ వేసుకున్నారా? ఈ సమయంలో తీసుకునే చిన్న జాగ్రత్తలతోనే లక్షల రూపాయలు ఆదా చేసుకునేందుకు మార్గం దొరుకుతుంది -
ఫిక్స్డ్ డిపాజిట్లు వడ్డీపై పన్ను పడకుండా...
బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయా? ఆదాయపు పన్ను పరిధిలో లేనప్పుడు మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్) పడకుండా చూసుకుంటున్నారా? ఇందుకోసం ఏం చేయాలో తెలుసా? బ్యాంకు లేదా సంస్థల దగ్గర ఫారం 15జీ లేదా 15హెచ్ను సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడే మీకు మూలం వద్ద పన్ను కోత విధించరు. -
జీవిత బీమా.. మీ బాధ్యతలను తీర్చేలా
మీ నెలవారీ ఆదాయం కిరాణా సామగ్రి, బిల్లులు చెల్లించడం, పిల్లల ఫీజులు, ఇతర ఖర్చులను తీర్చడంలో మీకు ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చూసుకుంటుంది. మీ బడ్జెట్ ఖర్చులను పక్కన పెడితే.. మీ నెలవారీ ఆదాయంలో కొంత భాగాన్ని ఆరోగ్య అత్యవసర ఖర్చులు, పదవీ విరమణ ప్రణాళికలు, పిల్లల ఉన్నత విద్యలాంటి వాటి కోసం పొదుపు, మదుపు చేయాల్సిన అవసరమూ ఉంటుంది. -
బేరమాడితే తగ్గేను ప్రీమియం
కారు బీమా ఒక బాధ్యత. ఏడాదికోసారి దీన్ని పునరుద్ధరిస్తూనే ఉండాలి. అప్పుడే దీన్ని మీరు రోడ్డు మీద ఎలాంటి భయాలూ లేకుండా నడపగలరు. బీమా రక్షణ లేకుంటే.. అటు చట్టపరంగానూ, ఇటు ఆర్థికంగానూ చిక్కులు తప్పవు. -
నిఫ్టీ 50 షేర్లలో పెట్టుబడికి...
నవి మ్యూచువల్ ఫండ్ కొత్తగా ఒక నిఫ్టీ 50 ఈటీఎఫ్ పథకాన్ని తీసుకొచ్చింది. నవీ నిఫ్టీ 50 ఈటీఎఫ్ అనే ఈ పథకం ఎన్ఎఫ్ఓ నేటితో ముగియనుంది. ఎన్ఎఫ్ఓలో కనీస పెట్టుబడి రూ.250. ఓపెన్ ఎండెడ్ పథకం. -
Elon Musk: బాల్యంలో కష్టాలు పడ్డా.. వదంతులకు చెక్ పెడుతూ మస్క్ పోస్ట్
Elon Musk: ఎలాన్ మస్క్ ట్విటర్ వేదికగా అనేక విషయాలను పంచుకుంటుంటారు. అనేక మంది ట్వీట్లకు తన దైన శైలిలో స్పందిస్తుంటారు. ఇటీవల గనులపై వస్తున్న ఆరోపణలపై మరోసారి సుదీర్ఘ ట్వీట్ చేశారు. -
Mukesh Ambani: ముకేశ్ అంబానీ.. 20 ఏళ్ల ఇండస్ట్రీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ విస్తరణలో ముకేశ్ అంబానీ కీలక పాత్ర పోషించారు. తండ్రి మరణం తర్వాత కంపెనీ బాధ్యతలు చేపట్టిన ఆయన సంస్థను అనేక రంగాలకు విస్తరించారు. -
Retirement: 50 ఏళ్లకే రిటైర్.. తర్వాత ఎలా? నితిన్ కామత్ సూచనలు
ఒకప్పటిలాగా 60 ఏళ్లు పనిచేసి, పదవీ విరమణ చేసే రోజులు కావివి. ఆధునిక యువత 50 ఏళ్లకే ఉద్యోగం మానేసి, తమకు నచ్చినట్లుగా జీవించేందుకు సిద్ధం అవుతున్నారు. వైద్యపరమైన పురోగతి కారణంగా ఆయుర్దాయం 80కి చేరింది. -
Nellore: చదువు మానేసి.. చాయ్తో రూ.5 కోట్లు
ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరుకు చెందిన ఆ యువకుడు.. ఆస్ట్రేలియాలో ఓ దిగ్గజ యూనివర్సిటీలో బీబీఏ (బ్యాచిలర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్) చదివి.. మంచి ఉద్యోగం చేయాలనే లక్ష్యంతో విమానం ఎక్కాడు. -
లక్ష కోట్లకు చేర్చిన ఉక్కు మహిళ!
తక్కువమంది ఎంచుకునే రంగంలో అడుగుపెట్టడానికి సంకోచించేవారే ఎక్కువ. అమ్మాయిలను చదివించడమే గొప్పనుకునే రోజుల్లో ఆ సాహసం చేశారు సోమ మోండల్. ఓ మహిళ.. నాయకురాలన్న ఊహే కష్టమైన వేళ ఆ స్థానాన్ని అధిరోహించారు. -
Zepto: చిటికేసి... వేల కోట్లు సృష్టించిన చిన్నోళ్లు!
ఇంకా వయసు 20 దాటలేదు... చదువు పూర్తి కాలేదు....అలాంటి వారు... అప్పటికే మార్కెట్లో 20 ఏళ్ల అనుభవమున్నవారిని ఇంటర్వ్యూ చేస్తుంటే వచ్చిన వారికి అనుమానం! ఈ కుర్రాళ్లా మా సామర్థ్యాన్ని నిర్ణయించేదని? వీళ్లా మాకు కొలువిచ్చేదని? ఆ -
Rakesh Jhunjhunwala: ఆయన జీవితమే ఓ ఆర్థిక మంత్రం..!
భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో ఓ అధ్యాయం ముగిసింది. భారత్లో ఈక్విటీ మదుపర్లకు బెంచ్మార్క్గా చెప్పుకునే రాకేశ్ ఝున్ఝున్వాలా ఆదివారం ఉదయం కన్నుమూశారు. -
Savitri Jindal: ఆసియా సంపన్న మహిళ.. సావిత్రి జిందాల్
ఆసియాలోనే అత్యంత సంపన్న మహిళగా భారత్కు చెందిన సావిత్రి జిందాల్ అగ్రస్థానంలో నిలిచారు. జిందాల్ గ్రూప్ ఛైర్పర్సన్ అయిన ఆమె నికర సంపద 11.3 బిలియన్ -
తక్కువ నష్టానికీ వ్యూహాలు!
‘ప్రపంచమంతా అధిక ధరలతో.. ఆ ప్రభావం వల్ల ఏర్పడుతున్న మందగమనంలో నడుస్తోంది. ఈ నేపథ్యంలో, మదుపర్లు.. ముఖ్యంగా తొలిసారి డబ్బులు పెడుతున్నవారు తక్కువగా నష్టపోయే వ్యూహాన్ని అనుసరించాల’ని స్విస్ పెట్టుబడిదారు,‘ది గ్లూమ్ బూమ్ డూమ్’ ఎడిటర్ మార్క్ ఫాబర్ సూచిస్తున్నారు. ‘అమెరికాలో వడ్డీరేట్లు అధికంగా పెంచబోరని, 6 నెలల్లో తగ్గించడం ప్రారంభం కావచ్చ’ని వార్తా సంస్థ ‘ఇన్ఫామిస్ట్’కిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ముఖ్యాంశాలివీ.. -
Gita Gopinath: ‘గీత’లు చెరిపేస్తూ.. మరో ఘనత సాధించిన గీతా గోపీనాథ్..!
ఈ ఏడాది ప్రారంభంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి(IMF)కి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులై రికార్డు సృష్టించారు భారత సంతతికి చెందిన గీతా గోపినాథ్. -
దాన లక్ష్ములు!
‘నా సంపదలో సగం దానం చేస్తా’ రెండేళ్ల క్రితం మెకంజీ స్కాట్ మాట ఇది! అన్నట్టుగానే ఏటా ఆమె దానాలతో అందర్నీ ఆశ్చర్యపరుస్తూ వచ్చారు. -
Microsoft India COO: జీవితం పిజ్జా లాంటిది.. ఆ ఐదూ ఉండాల్సిందే!
‘జీవితంలో ఎదగాలంటే నిత్య విద్యార్థిగా ఉండాల్సిందే!’ చాలామంది ప్రముఖులు ఆచరించే విజయసూత్రమిది. -
‘యూనికార్న్’ అంటే నమ్మలేకపోయా!
మహిళలు సాంకేతిక రంగంలో.. అదే విధంగా ఆర్థిక రంగంలో ఉండటం చూశాం. కానీ ఈ రెండూ కలగలసిన ఫిన్టెక్ రంగంలో మాత్రం చాలా అరుదు. -
జోడీ నెంబర్ 1
కంబైన్డ్ స్టడీతో మార్కులు కొల్లగొట్టిన విద్యార్థుల్ని చూశాం. సివిల్స్ సాధించిన భార్యాభర్తల గాథలు విన్నాం. -
ఆ రోజు... చనిపోతాననుకున్నా!
గౌతమ్ అదానీ.. దేశంలోని అత్యంత ధనవంతుల జాబితాలో అంబానీతో పోటీపడుతున్న ఈ వ్యాపార దిగ్గజం అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కు అధినేత.
తాజా వార్తలు (Latest News)
-
ఒక్క రోజులో రూ.800 కోట్ల నష్టం.. ఝున్ఝున్వాలా కుటుంబానికి టైటాన్ షాక్..!
-
ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షం.. పిడుగుపాటుకు ఇద్దరి మృతి
-
టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా జెర్సీ ధరెంతో తెలుసా?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
ఆస్ట్రేలియా హెలికాప్టర్పై నిప్పుల వర్షం.. చైనా దుందుడుకు చర్య
-
Team India: పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమ్ఇండియా వెళ్తుందా? బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..