Pranjali Awasthi: 16 ఏళ్లకే ఏఐ స్టార్టప్.. రెండేళ్లలో రూ.100 కోట్ల టర్నోవర్
ఏడేళ్ల వయసులో సొంతంగా కోడింగ్ రాసి.. 13 ఏళ్లకే ఫ్లోరిడా యూనివర్సిటీలో ఇంటర్న్షిప్ చేసి, 16 ఏళ్లకు స్టార్టప్ నెలకొల్పి.. రెండేళ్లలో దాని విలువను రూ.100 కోట్లు పెంచిన అమ్మాయి సక్సెస్ స్టోరీ వివరాలివే.
ఇంటర్నెట్ డెస్క్: తన వయసు పిల్లలంతా కాలేజీకి వెళుతూ పుస్తకాలతో కుస్తీ పడుతుంటే.. 16 ఏళ్ల ప్రాంజలి అవస్థీ (Pranjali Awasthi) మాత్రం బోర్డ్ మీటింగ్లో బిజీగా గడుపుతోంది. అంతేకాదు.. తన కంపెనీకి పెట్టుబడులు రాబట్టేందుకు టెక్ సమ్మిట్లో పాల్గొంటూ తీరికలేకుండా పనిచేస్తోంది. ఓ వైపు స్కూల్కు వెళుతూనే.. మరోవైపు కంపెనీని వృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రెండేళ్ల క్రితం రూ. మూడున్నర కోట్ల పెట్టుబడితో ప్రారంభమైన ఆమె కంపెనీ.. ప్రస్తుతం రూ.100 కోట్లు విలువ కలిగిన సంస్థగా అవతరించిందంటే.. దాని వెనుక ప్రాంజలి కృషిని అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఎవరీ ప్రాంజలి అవస్థీ? 16 ఏళ్లకే కంపెనీ స్థాపించడం ఎలా సాధ్యమైందో ఆమె మాటల్లోనే..
‘‘చిన్నతనంలో మా నాన్న ఉపయోగిస్తున్న కంప్యూటర్ను తదేకంగా గమనిస్తుండటంతో.. దాన్ని ఎలా ఉపయోగించాలో నాన్న నాకు నేర్పించారు. అలా నేను ఆయనతో కూర్చుని కోడింగ్ రాయడం కొద్ది కొద్దిగా నేర్చుకునేదాన్ని. ఏడేళ్ల వయసులో తొలిసారి సొంతంగా కోడింగ్ రాశా. తర్వాత, 11 ఏళ్లకు మా కుటుంబం అమెరికాలోని ఫ్లోరిడాకు వెళ్లాం. అక్కడ స్కూల్లో కంప్యూటర్ సైన్స్ అండ్ కాంపిటీటివ్ మ్యాథ్య్స్ కోర్సులో చేరాను. రెండేళ్ల తర్వాత ఫ్లోరిడా యూనివర్సిటీలో ఇంటర్న్షిప్ చేసే అవకాశం లభించింది. అలా, 13 ఏళ్లకే ఓ వైపు ఇంటర్న్షిప్ చేస్తూ.. మరోవైపు స్కూలుకు వెళ్లేదాన్ని. వారంలో 20 గంటలు ఇంటర్న్షిప్ చేసేందుకు అనుమతి ఉండేది. ఆ సమయంలోనే నాకు కృత్రిమ మేధ (AI) గురించి తెలిసింది. దాని సాయంతో చాలా పనులు సులభంగా చేయొచ్చని గ్రహించి, ఆ దిశగా ఇంటర్న్షిప్లో పరిశోధనలు చేసేదాన్ని. కరోనా పరిస్థితుల తర్వాత ఏఐకి డిమాండ్ పెరగడంతో కంపెనీ ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది. ఇంటర్న్షిప్ పూర్తి కాగానే.. కొద్దిరోజులు ఏఐకు సంబంధించిన స్టార్టప్ కంపెనీలో పనిచేశా. తర్వాత 2021లో డెల్వ్.ఏఐ (Delv.AI) పేరుతో స్టార్టప్ను ప్రారంభించా. నేను, మరో ముగ్గురు ఉద్యోగులు, రూ.మూడున్నర కోట్ల పెట్టుబడితో సంస్థ ప్రయాణం మొదలైంది. ప్రస్తుతం మా కంపెనీలో పది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కంపెనీ విలువ రూ.100 కోట్లకు చేరింది’’అని మియామీలో జరిగిన టెక్ ఈవెంట్లో ప్రాంజలి వివరించింది.
వివిధ అంశాలపై పరిశోధనలు చేసే వారికి ఆన్లైన్లో కచ్చితమైన సమాచారం అందించడమే తమ సంస్థ లక్ష్యమని ప్రాంజలి తెలిపింది. కంపెనీని మరింత విస్తరించేందుకు కొంతకాలంపాటు చదువుకు విరామం ఇచ్చి.. భవిష్యత్తులో కంపెనీ నిర్వహణకు అవసరమైన కోర్సులో గ్రాడ్యుయేషన్ కోర్సు చేస్తానని ధీమా వ్యక్తం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
-
ఆదుకుంటానన్నావ్.. పీల్చి పిప్పి చేశావ్!!
-
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్