Russia: రష్యా వాంటెడ్ లిస్ట్లో మెటా అధికార ప్రతినిధి
Russia: స్వతంత్ర మీడియాపై ఆంక్షల్లో భాగంగా రష్యా ఇప్పటికే మెటాను నిషేధించింది. తాజాగా ఆ కంపెనీకి చెందిన అధికార ప్రతినిధిపై నేరాభియోగాలు మోపుతూ వాంటెడ్ లిస్ట్లో చేర్చింది.
మాస్కో: అమెరికా టెక్ దిగ్గజం ఫేస్బుక్ మాతృసంస్థ మెటా (Meta) అధికార ప్రతినిధి ఆండీ స్టోన్ను రష్యా తమ వాంటెడ్ లిస్ట్ (Russia Wanted List)లో చేర్చింది. ఈ మేరకు తమ ఆన్లైన్ డేటాబేస్లో ఆండీ పేరును ఆ దేశ హోంశాఖ చేర్చింది. అక్టోబర్లో మెటా (Meta)ను రష్యా అధికారిక వర్గాలు ఓ తీవ్రవాద సంస్థగా పేర్కొన్నాయి. ఫలితంగా ఈ సామాజిక మాధ్యమాన్ని ఉపయోగించే తమ దేశ పౌరులపై చర్యలు తీసుకునేందుకు అవకాశం ఏర్పడింది.
ఆండీ స్టోన్పై ఉన్న అభియోగాలేంటనే విషయాన్ని మాత్రం రష్యా (Russia) హోంశాఖ తమ డేటాబేస్లో పేర్కొనలేదు. కేవలం నేరపూరిత కేసుల్లో అతణ్ని పట్టుకోవాలనుకుంటున్నట్లు మాత్రమే వెల్లడించింది. మెటా నుంచి మాత్రం ఇంకా దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే, స్టోన్ పేరును రష్యా తమ వాంటెడ్ లిస్ట్ (Russia Wanted List)లో 2022లోనే చేర్చిందని ఆ దేశ స్వతంత్ర మీడియా సంస్థ మీడియాజోనా పేర్కొంది. కానీ, ఇప్పటి వరకు ఈ విషయాన్ని అధికారికంగా బయటపెట్టలేదని తెలిపింది.
2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యన్లపై హింసను ప్రేరేపించే చర్యలకు మెటా (Meta) పాల్పడుతోందని రష్యా ఆరోపించింది. ఈ ఏడాది మార్చి నుంచి ఆ దేశ ఫెడరల్ ఇన్వెస్టిగేటివ్ కమిటీ.. మెటాపై దర్యాప్తు ప్రారంభించింది. ఉక్రెయిన్లోకి రష్యా బలగాలు ప్రవేశించిన తరుణంలో మెటా పాలసీలో స్టోన్ కొన్ని మార్పులు చేశారు. తమ నిబంధనలు ఉల్లంఘించేలా ఉన్నప్పటికీ.. కొంత కఠినమైన కంటెంట్ను అనుమతించాలని నిర్ణయించారు. అయితే, రష్యా సామాన్య పౌరులపై హింసను ప్రేరేపించే కంటెంట్ను మాత్రం నిషేధిస్తామని స్పష్టం చేశారు.
మరోవైపు స్టోన్పై ఓ రష్యా కోర్టు అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసినట్లు మీడియాజోనా తెలిపింది. తీవ్రవాదాన్ని ప్రోత్సహించిన కారణాలు చెబుతూ కోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అయితే, ఈ సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాన్ని మాత్రం మీడియాజోనా స్పష్టంగా చెప్పలేదు.
ఉక్రెయిన్లో రష్యా సైనిక చర్యకు ముందు వరకు రష్యా యువతలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్కు మంచి ఆదరణ ఉండేది. కానీ, స్వతంత్ర మీడియా, విమర్శనాత్మక ప్రసంగాలపై ఆంక్షల్లో భాగంగా వీటిని నిషేధించారు. కేవలం వీపీఎన్ ద్వారా మాత్రమే వీటిని యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంది. మరోవైపు మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ రష్యాలోకి ప్రవేశించకుండా 2022 ఏప్రిల్ నుంచి రష్యా నిషేధం విధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది. -
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
మారుతీ సుజుకీ త్వరలోనే అందుబాటు ధరలో హైబ్రిడ్ కార్లను తీసుకురావడంపై పని చేస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
గూగుల్లో ఉద్యోగం మొదలుపెట్టి 20 ఏళ్లు అయిందని సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai) వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. -
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్