Samsung: శాంసంగ్ A సిరీస్‌ నుంచి 2 కొత్త ఫోన్లు.. వివరాలు ఇవే!

Samsung A25, A15 Launched: శాంసంగ్‌ కంపెనీ రెండు కొత్త ఫోన్లను లాంచ్‌ చేసింది. ఈ రెండు ఫోన్లూ 50 ఎంపీ కెమెరా, 25W ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో వస్తున్నాయి.

Updated : 26 Dec 2023 17:13 IST

Samsung | ఇంటర్నెట్ డెస్క్‌: ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్‌ (Samsung) రెండు కొత్త మొబైల్స్‌ను భారత్‌లో ప్రవేశపెట్టింది. ఏ సిరీస్‌లో గెలాక్సీ ఏ25 5జీ (Samsung Galaxy A25 5G), గెలాక్సీ ఏ15 5జీని (Samsung Galaxy A15 5G) తీసుకొచ్చింది. ఈ రెండు ఫోన్లూ 50 ఎంపీ కెమెరా, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ వంటి ఫీచర్లతో వస్తున్నాయి. రెండింట్లోనూ 25W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయం ఉంది. మరి ఈ రెండు ఫోన్లలో వ్యత్యాసం, ధరలు, ఇతర వివరాలు ఇప్పుడు చూద్దాం..

 

శాంసంగ్‌ గెలాక్సీ ఏ25 ఫీచర్లు

శాంసంగ్‌ గెలాక్సీ ఏ25 స్మార్ట్‌ఫోన్‌ 6.5 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతో వస్తోంది. 120Hz స్క్రీన్‌ రిఫ్రెష్‌ రేటు, 1000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. ఇందులో 5నానోమీటర్ ఎగ్జినోస్‌ 1280 ప్రాసెసర్‌ను అమర్చారు. వన్‌యూఐ 6తో వస్తోంది. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 25W ఫాస్ట్‌ ఛార్జింగ్ సదుపాయం ఉంది. 50 ఎంపీ OIS కెమెరా, 8ఎంపీ అల్ట్రా వైడ్‌ కెమెరా, 2 ఎంపీ మ్యాక్రో లెన్స్ ఇచ్చారు. సెల్ఫీల కోసం 13 ఎంపీ కెమెరా ఉంది. వైఫై 5, బ్లూటూత్‌ 5.3, 3.5ఎంఎం జాక్‌, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్‌, సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్ సెన్సర్‌ ఉంది. 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.26,999, 8జీబీ+256 జీబీ వేరియంట్‌ ధర రూ.29,999గా కంపెనీ నిర్ణయించింది. యెల్లో, బ్లూ, బ్లూబ్లాక్‌ రంగుల్లో లభిస్తుంది.

 

శాంసంగ్‌ గెలాక్సీ ఏ15 స్పెసిఫికేషన్లు

ఏ15 స్మార్ట్‌ఫోన్‌ 6.5 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ అమోలెడ్‌ డిస్‌ప్లేతో వస్తోంది. 90Hz స్క్రీన్‌ రిఫ్రెష్‌ రేటు, 800 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఉంది. ఆక్టాకోర్‌ డైమెన్‌సిటీ 6,100 ప్రాసెసర్‌తో వస్తోంది. వన్‌యూఐ 6తో ఈ స్మార్ట్‌ఫోన్‌ పనిచేస్తుంది. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 25W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయం ఉంది. 50+5+2 ఎంపీ కెమెరా అమర్చారు. 13 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. వైఫై 5, బ్లూటూత్‌ 5.3, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్‌ జాక్‌, యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్, సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ ఉన్నాయి. ఈ ఫోన్‌ 8జీబీ+128జీబీ వేరియంట్ ధర  రూ.19,499, 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.22,499గా కంపెనీ నిర్ణయించింది. లైట్‌బ్లూ, బ్లూ బ్లాక్‌, బ్లూ రంగుల్లో లభిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు