Stock Market: రెండురోజుల లాభాలకు బ్రేక్.. ఆద్యంతం 82 ఎగువనే రూపాయి!
అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు, రూపాయి బలహీనత, ఫెడ్ రేట్ల పెంపు భయాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల్లో రెండు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది.
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల్లో రెండు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ ఇంట్రాడేలో దాదాపు 370 పాయింట్ల వరకు కుంగింది. కనిష్ఠాల వద్ద కొనుగోళ్ల మద్దతుతో భారీగా పుంజుకుంది. కానీ, పూర్తిస్థాయి లాభాల్లోకి మాత్రం రాలేకపోయింది. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. మరోవైపు నేడు అమెరికాలో సెప్టెంబరు నెల ఉద్యోగ నియామక గణాంకాలు వెలువడనున్నాయి. ఈ డేటా నిరాశపరిస్తే ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపును మరింత వేగవంతం చేసే అవకాశం ఉందన్న అంచనాలు మదుపర్లను అప్రమత్తం చేశాయి. గత రెండు రోజుల లాభాల నేపథ్యంలో మదుపర్లు కీలక కౌంటర్లలో లాభాల స్వీకరణ సైతం మార్కెట్లపై ప్రభావం చూపింది. మరోవైపు రూపాయి బలహీనత కూడా సెంటిమెంటును దెబ్బతీసింది.
సెన్సెక్స్ ఉదయం 58,092.56 వద్ద నష్టాలతో ప్రారంభమై ఇంట్రాడేలో 57,851.15 దగ్గర కనిష్ఠాన్ని తాకింది. చివరకు 30.81 పాయింట్ల నష్టంతో 58,191.29 వద్ద స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ 17,287.20 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టి.. 17,216.95 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 17.15 పాయింట్లు నష్టపోయి 17,314.65 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో 12 షేర్లు లాభపడ్డాయి. టైటన్, పవర్గ్రిడ్, ఎన్టీపీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతీ, ఏషియన్ పెయింట్స్ అత్యధికంగా లాభపడిన షేర్లలో ఉన్నాయి. ఎంఅండ్ఎం, అల్ట్రాటెక్ సిమెంట్స్, టీసీఎస్, ఎస్బీఐ, హెచ్సీఎల్ టెక్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, ఐటీసీ, విప్రో నష్టపోయాయి.
82ని దిగిరాని రూపాయి..
డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.82.32 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 82.42 వద్ద జీవితకాల కనిష్ఠాన్ని నమోదు చేసింది. నిన్నటి ముగింపుతో పోలిస్తే ఈరోజు దాదాపు 39 పైసలు కుంగింది. అమెరికాలో ఉద్యోగ గణాంకాలు నిరాశపరిస్తే.. రేట్ల పెంపును ఫెడ్ మరింత వేగవంతం చేసే అవకాశం ఉందన్న అంచనాలతో డాలర్ మరింత బలపడింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర 94 డాలర్లకు చేరడం కూడా మన కరెన్సీ సెంటిమెంటును దెబ్బతీసింది.
మార్కెట్లోని ఇతర సంగతులు..
- వారోక్ ఇంజినీరింగ్ షేరు ఇంట్రాడేలో 9 శాతం నష్టాన్ని చవిచూసింది. ఐరోపా, అమెరికా ఫోర్ వీలర్ లైటింగ్ వ్యాపారం నుంచి పూర్తిగా నిష్క్రమించినట్లు కంపెనీ తెలపడమే ఇందుకు కారణం. చివరకు షేరు ధర 7.85 శాతం తగ్గి రూ.314.65 వద్ద స్థిరపడింది.
- సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో తమ విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 18 శాతం వృద్ధి చెందినట్లు టైటన్ ప్రకటించింది. దీంతో కంపెనీ షేరు ఇంట్రాడేలో 6 శాతానికి పైగా లాభపడింది. చివరకు 5.30 శాతం లాభపడి రూ.2,730.20 వద్ద స్థిరపడింది.
- రెండో త్రైమాసికంలో మెరుగైన ఆదాయ వృద్ధి, రానున్న రోజుల్లో భారీ డిమాండ్ అంచనాల నేపథ్యంలో ఆభరణాల విక్రయ సంస్థల షేర్లు ఈరోజు రాణించాయి. కల్యాణ్ జువెలర్స్ ఇంట్రాడేలో నాలుగు శాతం లాభపడి రూ.101.65 వద్ద, పీసీ జువెలర్స్ సైతం దాదాపు 4 శాతం పెరిగి రూ.97.50 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకాయి.
- విద్యుత్ వాహన తయారీ సంస్థ రివోల్ట్లో రతన్ఇండియా ఎంటర్ప్రైజెస్ 100 శాతం వాటాలను సొంతం చేసుకుంది. దీంతో రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ షేరు ఇంట్రాడేలో 10 శాతం పెరిగింది. చివరకు 8.03 శాతం లాభపడి రూ.53.80 వద్ద స్థిరపడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 94 పాయింట్ల లాభంతో 74,434 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 22,599 దగ్గర కొనసాగుతోంది. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?