Jay kotak: సినీ నటితో ఉదయ్ కోటక్ కుమారుడి వివాహం
Jay kotak- Aditi Arya: ప్రముఖ బ్యాంకర్ ఉదయ్ కోటక్ తనయుడు జై కోటక్, సినీ నటి అదితి ఆర్య వివాహం జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన చిత్రాలు తాజాగా బయటకొచ్చాయి.
ముంబయి: కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ ఉదయ్ కోటక్ కుమారుడి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయ్ కోటక్ తనయుడు జై కోటక్ (Jay kotak), మాజీ మిస్ ఇండియా అదితి ఆర్య (Aditi Arya) వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ముంబయిలోని జియో కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం ఈ వివాహ వేడుక జరిగింది. వధూవరులెవరూ వివాహనికి సంబంధించిన చిత్రాలు పంచుకోనప్పటికీ.. సోషల్ మీడియాలో ఈ చిత్రాలు దర్శనమిచ్చాయి. ఈ వివాహ వేడుకకు ప్రముఖ వ్యాపార వేత్త ముకేశ్ అంబానీ, నీతా అంబానీ దంపతులు సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
జై కోటక్, అదితీ ఆర్య నిశ్చితార్థం మొదలు వివాహం వరకు మొదటి నుంచీ ఇరు కుటుంబాలు గోప్యంగానే ఉంచుతున్నాయి. వాస్తవానికి గతేడాదే వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని ఎవరూ బయటపెట్టలేదు. గతంలో వీరు ఇరువురూ పారిస్లోని ఈఫిల్ టవర్ వద్ద ఉన్న చిత్రాలు బయటకొచ్చినప్పుడే ఊహాగానాలువచ్చాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది మే నెలలో జై కోటక్ స్వయంగా నిశ్చితార్థం విషయాన్ని బయటపెట్టారు. తనకు కాబోయే భార్య యేల్ యూనివర్సిటీ నుంచి విజయవంతంగా ఎంబీఏ పట్టా పొందిందంటూ ఎక్స్లో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
డిస్నీ ఇండియా కొనసాగుతుంది.. సీఈఓ క్లారిటీ
జై కోటక్ కొలంబియా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ పూర్తి చేశారు. ప్రస్తుతం కోటక్ మహీంద్రా బ్యాంక్కు చెందిన డిజిటల్ ఫస్ట్ మొబైల్ బ్యాంక్ కోటక్ 811కి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. దిల్లీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న అదితి ఆర్య.. గతంలో ఎర్నెస్ట్ అండ్ ఎంగ్ అనే ప్రొఫెషనల్ సర్వీస్ నెట్వర్క్లో రీసెర్చి అనలిస్ట్గా పనిచేశారు. 2015లో మిస్ ఇండియా కిరీటాన్ని దక్కించుకున్నారు. తెలుగులో పూరీ జగన్నాథ్, కల్యాణ్ రామ్ కాంబోలో వచ్చిన ‘ఇజం’లో నటించారు. అలాగే, రణ్వీర్ సింగ్ నటించిన ‘83’ సహా పలు హిందీ చిత్రాల్లోనూ నటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్కు బెయిల్
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్కు రెండు నెలల తాత్కాలిక బెయిల్ మంజూరైంది. -
రోజంతా ఒడుదొడుకుల్లో.. చివరికి ఫ్లాట్గా ముగిసిన సూచీలు
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 17 పాయింట్ల లాభంతో నిఫ్టీ 33.15 పాయింట్ల నష్టంతో ముగిశాయి. -
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
Indegene IPO: రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఇండీజీన్ ఐపీఓ ప్రారంభమైంది. మదుపర్లు రూ.14,916తో కనీసం 33 షేర్లకు (ఒక లాట్) బిడ్లు దాఖలు చేయాలి. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 202 పాయింట్ల లాభంతో 74,080 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు పుంజుకొని 22,511 దగ్గర కొనసాగుతోంది. -
లేని సీట్లు అమ్మి.. రూ.550 కోట్ల ఫైన్ కట్టి.. ఓ విమానయాన సంస్థ నిర్వాకం!
Qantas: కాంటాస్ అనే ఆస్ట్రేలియా విమానయాన సంస్థ క్యాన్సిల్ అయిన విమానాల్లోని సీట్లను విక్రయించింది. దీన్ని తీవ్రంగా తప్పుబట్టిన అక్కడి నియంత్రణా సంస్థ రూ.550 కోట్ల జరిమానా విధించింది. -
3 ఐపీఓలు.. రూ.6,400 కోట్ల లక్ష్యం
ఈ వారం మూడు కంపెనీల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)లు మార్కెట్లో సందడి చేయనున్నాయి. రూ.6,400 కోట్ల సమీకరించే లక్ష్యంతో ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండీజీన్, టీబీఓ టెక్ ఐపీఓలు వస్తున్నాయి. -
లాభాలకే అవకాశం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత శుక్రవారం సూచీలు భారీగా నష్టపోయినా, అది తాత్కాలికమేనని.. సూచీలు అధిక స్థాయులకు చేరాయనే భావనతో, లాభాల స్వీకరణకు దిగడం వల్లే ఆ పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
పసిడిలో లాభాల స్వీకరణ!
పసిడి ఇటీవల రూ.73,925 వద్ద గరిష్ఠాన్ని తాకిన తర్వాత లాభాల స్వీకరణ కనిపిస్తోంది. ఇదే ధోరణి కొనసాగితే జూన్ కాంట్రాక్టు ఈ వారం రూ.69,418 వరకు పడిపోవచ్చు. -
75,100 పైన మరిన్ని సానుకూలతలు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో గత వారం సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. దేశీయ కంపెనీల త్రైమాసిక ఫలితాలు, ముడిచమురు ధరలు చల్లపడటం కలిసొచ్చాయి. -
పురుగు మందుల అవశేషాలపై భారత్లో కఠిన నిబంధనలు: ప్రభుత్వం
ఆహార పదార్థాల్లో పురుగు మందుల అవశేషాల విషయంలో.. భారత్ అత్యంత కఠినమైన నిబంధనలను కలిగి ఉందని ప్రభుత్వం ఆదివారం పునరుద్ఘాటించింది. -
గృహ రుణ బకాయిలు పెరిగాయ్: ఆర్బీఐ
గృహ నిర్మాణ రంగానికి బకాయిపడిన రుణాలు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో సుమారు రూ.10 లక్షల కోట్లు పెరిగి ఈ ఏడాది మార్చి నాటికి రికార్డు స్థాయిలో రూ.27.23 లక్షల కోట్లకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన డేటా వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
రఫాపై ఇజ్రాయెల్ దండయాత్ర.. దాడులు మొదలుపెట్టిన సైన్యం!
-
నన్ను గదిలో బంధించి దాడి చేశారు: రాధికా ఖేడా తీవ్ర ఆరోపణలు
-
1600 అడుగుల వంతెనకు రూ.91 వేల కోట్లా.. హేళన చేస్తున్న అమెరికా వ్యాపారవేత్తలు
-
హౌస్కీపర్ ఇంట్లో నోట్ల గుట్టలు.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..?
-
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?