Retirement Fund: పదవీ విరమణ పథకాల మీద సర్వే.. టాప్-3లో ఇవే!
పదవీ విరమణకు 3 రంగాలను తమ డబ్బుని మదుపు చేయడానికి ఎంచుకుంటున్నారని ఒక సర్వే తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: పదవీ విరమణ జీవితానికి చాలా మంది చాలా ఆర్థిక ప్రణాళికలు అమలుచేస్తూ ఉంటారు. అయితే, పదవీ విరమణ తర్వాత ఎలా జీవించాలి అనే విషయమై ఏదైనా ఉపాధి ప్రారంభంలోనే (సంపాదిస్తున్నప్పుడే) ప్రణాళిక అమలు చేయడం మంచిది. చాలా మంది పదవీ విరమణకు 3 రంగాలను తమ డబ్బుని మదుపు చేయడానికి ఎంచుకుంటున్నారని ఓ సర్వే తెలిపింది.
డిజిటల్ వెల్త్ మేనేజర్ స్క్రిప్బాక్స్.. 34-55 సంవత్సరాల వయస్సు గల 1400 మందిని సర్వే చేసింది. వీళ్లందరూ అత్యధిక శాతం మంచి నమ్మకంతో స్థిరాదాయం గల రంగాలలో పెట్టుబడి పెడుతున్నామని తెలిపారు. 75% ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడికి అగ్రస్థానం ఇచ్చారు. ఆ తర్వాత ఈపీఎఫ్కి 44% మంది అనుకూలంగా ఉన్నారు. పీపీఎఫ్లో పెట్టుబడికి 43% మంది ఆమోదం తెలిపారు. పదవీ విరమణకు పెట్టుబడి ఎంపికగా బీమాను 23% మంది మాత్రమే అనుకూలంగా ఉన్నారు. బీమా అనేది పెట్టుబడి సాధనం కాదని, జీవిత రక్షణకు ఉపయోగపడే అంశం మాత్రమేనని చాలా మంది తెలపడం విశేషం.
మదుపు చేసే వారిలో చాలా మందికి దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి మంచి అవగాహన, జీవితంలో పదవీ విరమణ అనంతరం (2వ ఇన్నింగ్స్లో) ఆర్థిక స్వేచ్ఛను సాధించాలనే తపన చాలా ఎక్కువ ఉండటం కూడా ఈ సర్వే కనుగొంది. 75% కంటే ఎక్కువ మంది తమ జీవిత లక్ష్యాలను సాధించడంలో ఆర్థిక ప్రణాళికను కలిగి ఉండాలని, అవసరమైతే ఆర్థిక సలహాదారుని అవసరాన్ని గుర్తించారు. అయితే, పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో 65% మంది తమ ఆర్థిక వ్యవహారాలను సొంతంగా నిర్వహించుకుంటున్నారని, 20% మంది మాత్రమే వృత్తిపరమైన సలహాలు పొందాలని ఆలోచిస్తున్నారని అధ్యయనం చెబుతుంది.
62% మంది 30 ఏళ్లు నిండిన తర్వాత పదవీ విరమణ కోసం పొదుపు చేయడం ప్రారంభిస్తున్నారు. ఈ వయస్సులోనే పదవీ విరమణ వంటి దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టడం మంచి పరిణామమే. ఆర్థిక రంగంలో వేగంగా పట్టు సాధించాలన్నా, పరిశోధన చేయాలన్నా, లెక్కల్లో కచ్చితత్వం, నిర్ణయాలు తీసుకోవడంలో వేగం పెరగాలంటే సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్స్ అవసరం ఉందని చాలా మంది మదుపుదారులు గుర్తించారు.
ఇవే ఎందుకంటే...?
మ్యూచువల్ ఫండ్స్: స్వల్పకాల పెట్టుబడులతో లాభాలను పొందడం అనేది మ్యూచువల్ ఫండ్లలో కుదరకపోవచ్చు. కానీ దీర్ఘకాలం వేచిచూస్తే మ్యూచువల్ ఫండ్లు కూడా మంచి ఆర్థిక పెట్టుబడి సాధనాలే. అనేక లార్జ్, మిడ్ క్యాప్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు 3 నుంచి 10 సంవత్సరాలలో 20% కంటే ఎక్కువ రాబడిని ఇచ్చాయి. అయితే, మ్యూచువల్ ఫండ్స్ మదుపునకు క్రమానుగత పెట్టుబడులు (SIP) చాలా ముఖ్యం. దీర్ఘకాలం వేచి చూసేవారికి ఈ మ్యూచువల్ ఫండ్స్లో మంచి రాబడి ఇచ్చిన చరిత్ర భారత స్టాక్ మార్కెట్లకు ఉంది. స్వల్ప కాలానికి మదుపు చేస్తే ఈ మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ ఉంటుంది. ఇది గమనించడం చాలా ముఖ్యం.
ఈపీఎఫ్: ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ఉద్యోగంలో చేరిన ప్రతి ఒక్కరికీ ఈ పథకంలో సభ్వత్వం ఉంటుంది. అంతేకాకుండా ఏ ఇతర ప్రభుత్వ పొదుపు పథకాల కన్నా కూడా ఇందులోనే ఎక్కువగా వడ్డీ రేటు (8.10%) ఉంటుంది. ఉద్యోగ విరమణ పొందేవరకు ఈ పథకంలో కొనసాగవచ్చు. రాబడికి పన్ను లేదు. రుణాన్ని కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు.
పీపీఎఫ్: పీపీఎఫ్ ఖాతాను పోస్టాఫీసులో గానీ, ప్రభుత్వ రంగ బ్యాంకులో గానీ ప్రారంభించవచ్చు. ఇది దీర్ఘకాల పొదుపు పథకం అవ్వడంతో పెట్టుబడిదారుడు పదవీ విరమణ నిధిని కూడా కూడబెట్టొచ్చు. పీపీఎఫ్ ఖాతా 100% రిస్క్ లేనిది. పీపీఎఫ్ వడ్డీ రేటు 7.10 శాతంగా ఉంది. పీపీఎఫ్లో మెచ్యూరిటీపై పొందే అసలు, వడ్డీ మొత్తం కూడా పన్ను రహితం. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500 డిపాజిట్ చేయాలి. గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు. పీపీఎఫ్ ఖాతా మెచ్యూరిటీ వ్యవధి 15 ఏళ్లు అయినా కూడా దీర్ఘకాలం పొడిగించుకోవచ్చు. పీపీఎఫ్ డిపాజిట్లకు ప్రభుత్వ హామీ ఉంటుంది. ఖాతాదారుడు వేరే ఏవైనా ఆర్థిక లావాదేవీలో విఫలం చెందినా, పీపీఎఫ్ రుణాన్ని చెల్లించడానికి ఖాతాలో సొమ్మును మళ్లించలేరు. ఆఖరికి కోర్టు డిక్రీ ఆర్డర్ ద్వారా కూడా పీపీఎఫ్ సొమ్ముని ముట్టుకోలేరు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్