Artificial Intelligence: ప్రపంచంలో తొలి ‘ఏఐ సేఫ్టీ ఇన్స్టిట్యూట్’ బ్రిటన్లో..
బ్రిటన్లో ప్రపంచంలోనే తొలి ‘కృత్రిమ మేధ భద్రత సంస్థ’ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాన మంత్రి రిషి సునాక్ ప్రకటించారు.
లండన్: కృత్రిమ మేధ (Artificial Intelligence) సాంకేతికతపై ఆందోళనలూ వ్యక్తం అవుతోన్న ప్రస్తుత తరుణంలో.. బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ (Rishi Sunak) కీలక ప్రకటన చేశారు. బ్రిటన్లో ప్రపంచంలోనే తొలి ‘కృత్రిమ మేధ భద్రత సంస్థ (AI Safety Institute)’ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ‘ఏఐ సేఫ్టీ’కి సంబంధించి ప్రపంచ పరిజ్ఞానాన్ని మెరుగుపరచడంతోపాటు కొత్త కొత్త కృత్రిమ మేధ సాంకేతికతలను అధ్యయనం చేస్తూ.. వాటి లాభనష్టాలను ఈ సంస్థ అన్వేషిస్తుందని తెలిపారు. తొలి ‘అంతర్జాతీయ కృత్రిమ మేధ భద్రత శిఖరాగ్ర సదస్సు’కు బ్రిటన్ సిద్ధమైన వేళ రిషి సునాక్ ఈ ప్రకటన చేశారు.
‘విద్యుత్, పారిశ్రామిక విప్లవం, ఇంటర్నెట్ మాదిరిగా.. ‘ఏఐ’ వంటి సాంకేతికతలు కూడా విస్తృతమైన మార్పులను తీసుకొస్తాయి. ఈ టెక్నాలజీలతో అనేక సానుకూల అంశాలతోపాటు సూపర్ ఇంటెలిజెన్స్ వంటి భయాలు, ప్రమాదాలూ పొంచి ఉన్నాయి. రసాయన, జీవాయుధాల తయారీ, సైబర్ దాడులు వంటి పనులను ఇది సులభతరం చేయగలదు. విధ్వంసం, భయాలను వ్యాప్తి చేసేందుకు ఉగ్రసంస్థలు ‘ఏఐ’ని ఉపయోగించే ప్రమాదం ఉంది. వీటిని దీటుగా ఎదుర్కోవాలి. కృత్రిమ మేధతో ముప్పు లేకపోలేదని పెద్ద పెద్ద డెవలపర్లు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. నాయకులు వాటిని తీవ్రంగా పరిగణించి, తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది’ అని రిషి సునాక్ వ్యాఖ్యానించారు.
కృత్రిమ మేధ.. ఇప్పుడిదే సర్వాంతర్యామి
‘కొత్తగా ఏర్పాటు చేయనున్న ఏఐ సేఫ్టీ ఇన్స్టిట్యూట్.. కృత్రిమ మేధ విషయంలో ప్రపంచ పరిజ్ఞానాన్ని మెరుగుపరుస్తుంది. కొత్త రకాల ఏఐలను జాగ్రత్తగా పరిశీలించడంతోపాటు వాటిని పరీక్షించి, మూల్యాంకనం చేస్తుంది. తద్వారా.. వాటి సామర్థ్యాలు ఏంటో మనకు అర్థమవుతాయి. సమాజానికి హాని కలిగించే తప్పుడు సమాచారం వంటి సమస్యలు మొదలు తీవ్రమైన పరిణామాల వరకు ఏఐతో పొంచి ఉన్న ముప్పును అన్వేషిస్తుంది’ అని రిషి సునాక్ వివరించారు. సూపర్ కంప్యూటర్ అభివృద్ధిలో దాదాపు రూ.10 వేల కోట్లు, క్వాంటం కంప్యూటర్లలో రూ.25 వేల కోట్ల పెట్టుబడులను ప్రకటించారు. ఇదిలా ఉండగా.. నవంబరు 1, 2వ తేదీల్లో నిర్వహించనున్న ‘గ్లోబల్ ఏఐ సేఫ్టీ సమ్మిట్’లో పాల్గొనేందుకు చైనా సహా ఆయా దేశాలను బ్రిటన్ ఆహ్వానించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
వేసవిలో స్మార్ట్ఫోన్ ఛార్జింగ్లో వేగం మందగిస్తుంది. దీనికి కారణమేంటి? ఎందుకు వేగం తగ్గుతుంది? -
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
-
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
-
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
-
భారత్ను వదిలి వెళ్లిన దేవెగౌడ మనవడు..!