పెన్గంగా.. ఇసుకదందా
మండలవాసులకు వరప్రదాయినిగా ఉన్న పెన్గంగా నదిలో ఇసుకదొంగలు పడ్డారు. పారే నీటిని ఆపిమరీ యంత్రాలతో ఇసుకను తోడి అక్రమ రవాణా చేస్తున్నారు.
యంత్రంతో నీటి నుంచి ఇసుక తీస్తున్నారిలా..
భీంపూర్, న్యూస్టుడే: మండలవాసులకు వరప్రదాయినిగా ఉన్న పెన్గంగా నదిలో ఇసుకదొంగలు పడ్డారు. పారే నీటిని ఆపిమరీ యంత్రాలతో ఇసుకను తోడి అక్రమ రవాణా చేస్తున్నారు. జిల్లాలోకి నది ప్రవేశించే చోటు గుబిడి మొదలుకుని అంతర్గాం, వడూర్, తాంసి-కె పరీవాహక ప్రదేశాల్లో రాత్రిబవళ్లు ఇసుకను విచ్చలవిడిగా తోడుతున్నారు. ఆదిలాబాద్, తాంసి, తలమడుగు, ఇచ్చోడ, నేరడిగొండ, గుడిహత్నూర్, మావల నుంచి ట్రాక్టర్లు, టిప్పర్లతో వచ్చి అక్రమార్కులు ఇసుకను తీసుకెళ్తున్నారు. గ్రామాభివృద్ధి పేరిట పలుకుబడి కలిగిన కొందరు జట్టుగా ఏర్పడి అనధికారిక వేలం పాటలతో ఇసుక దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. మండలంలోని ఆయా ప్రాంతాల నుంచి రోజుకి ఏకంగా 100 వాహనాల్లో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఒక్కో అధికారికి నెలకు రూ.10-20 వేలు ముట్టజెపుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఓ అధికారికి నెలవారీ డబ్బులు అందకపోతే ట్రాక్టర్లను ఆపి.. తన వాటా ఇచ్చాకే వాటిని వదిలిపెట్టడం వీటిని బలాన్ని చేకూరుస్తుంది. ట్రాక్టరు యజమాని ఒక్కో ట్రిప్పునకు రాయల్టీ, రవాణా ఖర్చులుపోనూ నెలకు రూ.50 వేలపైనే సంపాదిస్తుండగా.. రాయల్టీ, ఇసుక రవాణాతో వేలం దక్కించుకున్న వారు నెలకు రూ.లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. అటు గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు జరగకపోగా.. ఇటు ఇసుక తవ్వకాలతో జీవనది కాస్త ఎడారిని తలపిస్తోంది.
తాంసి-కెలో ప్రత్యేకంగా రోడ్డు ఏర్పాటు చేసుకున్నారిలా..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కార్మికుల్లో సామాజిక స్పృహ అభినందనీయం
[ 28-04-2024]
కార్మికుల్లో సామాజిక స్పృహ ఉండటం అభినందనీయమని డీఎంహెచ్ఓ రాథోడ్ నరేందర్ పేర్కొన్నారు. -
అక్రమాలకే ప్రా‘ధాన్యం’?
[ 28-04-2024]
ఎక్కడ ముడిసరకు లభ్యమవుతుందో సాధారణంగా అక్కడే పరిశ్రమలు ఏర్పాటు చేస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం ధాన్యం ఆశించిన రీతిలో పండకున్నా ఇక్కడ ఏకంగా తొమ్మిది రైస్ మిల్లులు ఏర్పాటయ్యాయి. -
భాజపా బలగాల మోహరింపు
[ 28-04-2024]
ఉమ్మడి జిల్లా పరిధిలోకి వచ్చే ఆదిలాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకునేలా భాజపా కార్యాచరణ చేపట్టింది. -
మండుటెండల్లో అంటుకుంటున్న అడవులు
[ 28-04-2024]
జిల్లాలో గతంకంటే ఈ ఏడాది ఎండల తీవ్రత అత్యధికంగా ఉండి ఉదయం పది గంటలకే ఇంటి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. -
వంద ఎకరాలు కొట్టేసే పన్నాగం
[ 28-04-2024]
‘వడ్డించే వాడు మనవాడైతే చివర్లో కూర్చున్నా కంచంలోకి అన్నీ వచ్చి చేరుతాయి’ అన్న చందంగా అధికారులు, నేతలు కుమ్మక్కై వంద ఎకరాల భూమిని ఆక్రమించే ప్రయత్నం సాగుతోంది. -
నిధులు రాక.. నిర్వహణ లేక
[ 28-04-2024]
రైతులకు పండ్ల తోటల పెంపకంపై శిక్షణ ఇవ్వడం, మొక్కల ఉత్పత్తి కోసం ఏర్పాటు చేసిన ఉద్యానవన నర్సరీ, రైతు శిక్షణ కేంద్రాలు నిర్వహణ లోపంతో మూతపడే దశకు చేరుకున్నాయి. -
ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
[ 28-04-2024]
కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలను ఇంటింటికీ తీసుకెళ్లి ప్రజలకు వివరించాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క కార్యకర్తలకు సూచించారు. -
నేర ప్రవృత్తి మార్చుకోవాలి : ఎస్పీ
[ 28-04-2024]
జిల్లాలో గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి శనివారం సాయంత్రం 6 గంటల వరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు జిల్లా ఎస్పీ కె.సురేష్కుమార్ తెలిపారు. -
ఓటర్లు @ 15,96,430
[ 28-04-2024]
మంచిర్యాల విద్యావిభాగం, న్యూస్టుడే: ప్రస్తుత లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితా కొలిక్కివచ్చింది. -
సిబ్బంది కొరత.. వసతుల లేమి
[ 28-04-2024]
జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో సిబ్బంది కొరత, వసతుల లేమితో సరైన సేవలు అందక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ను గెలిపించాలి
[ 28-04-2024]
మనిషికి చేతులు ఎంతముఖ్యమో.. దేశానికి చేతిగుర్తు పార్టీ అవసరం అంతే ఉందని కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ కోరారు. -
అవగాహన లేక.. అనుమతి పొందక..!
[ 28-04-2024]
పెళ్లి.. రిసెప్షన్.. పుట్టినరోజు.. ఇలా వేడుకేదైనా చాలామంది ఎంతో ఆర్భాటంగా నిర్వహించాలనుకుంటున్నారు. -
నీతి ఆయోగ్ పథకం.. అమలైతే అభివృద్ధి యోగం
[ 28-04-2024]
మారుమూల గిరిజన ప్రాంతమైన పెంబి మండలం అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది. కనీస వసతులు, రవాణా సౌకర్యాలు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులు అనేకం. -
గుంపులున్న చోటుపై గురి..
[ 28-04-2024]
ఎన్నికల ప్రచారానికి మరో 14 రోజులు మాత్రమే గడువుంది. లోక్సభ పరిధిలో రెండు వేలకు పైగా గ్రామాలు, 380కి పైగా గూడేలు, తండాలు ఉన్నాయి. -
పెద్దపల్లిలో స్థానికేతరులకే పెద్దపీట
[ 28-04-2024]
పెద్దపల్లి పార్లమెంటు స్థానానికి ఎంపీలుగా ఎన్నికైనవారిలో ఇప్పటి వరకు స్థానికులెవరూ విజయం సాధించలేకపోయారు. -
మండే ఎండతో జాగ్రత్త..
[ 28-04-2024]
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆరెంజ్ జోన్లో ఉందని, జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. -
తూర్పున ఎంపీ.. పశ్చిమాన అభ్యర్థి
[ 28-04-2024]
జన్నారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామం మరోసారి తెరపైకి వచ్చింది. -
వేసవి తాపం.. కొబ్బరినీరే ఉపశమనం
[ 28-04-2024]
రామకృష్ణాపూర్లోని ఆర్కేపీ ఓసీ, సీహెచ్పీ, సింగరేణి ఏరియా ఆసుపత్రితో పాటు కాలనీల్లో భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
-
ఆదుకుంటానన్నావ్.. పీల్చి పిప్పి చేశావ్!!