logo

మతతత్వంతో లబ్ధి పొందే పార్టీలకు బుద్ధి చెప్పాలి

మతతత్వం రెచ్చగొట్టి లబ్ధి పొందాలనుకునే పార్టీలకు రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పూరపాటి రమేష్‌ పిలుపునిచ్చారు.

Updated : 29 Mar 2024 13:10 IST

ఎదులాపురం: మతతత్వం రెచ్చగొట్టి లబ్ధి పొందాలనుకునే పార్టీలకు రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పూరపాటి రమేష్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో సంఘం జిల్లా స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం తమ పదేళ్ల పాలనలో కార్మిక హక్కులను కాలరాసిందని ఆరోపించారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలపై చర్చించారు. భాజపాకు ఓటు వేస్తే రానున్న రోజుల్లో దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని