logo

ఉద్యోగులతో మాది పేగు బంధం

ప్రభుత్వ ఉద్యోగులతో తమకు పేగుబంధం ఉందని భారసా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

Published : 16 Apr 2024 17:57 IST

ఆదిలాబాద్ పట్టణం: ప్రభుత్వ ఉద్యోగులతో తమకు పేగుబంధం ఉందని భారసా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదిలాబాద్ లో మంగళవారం నిర్వహించిన పార్టీ పార్లమెంటరీ బూత్ స్థాయి సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విదంగా ఉద్యోగులకు 73శాతం వేతనాలు పెంచామన్నారు. కరోనా వచ్చాక ఆర్థిక పరిస్థితి మందగించడం, సంక్షేమ పథకాలకు డబ్బు విడుదల చేయడంతో ఉంద్యోగుల వేతనాలు ఆలస్యం అయ్యాయని తెలిపారు. కాంగ్రెస్, భాజపా రెండు పార్టీలు ప్రజలను మోసాగిస్తున్నాయని విమర్శించారు. ఈ సభలో మాజీ మంత్రి జోగు రామన్న, భారాస అభ్యర్థి ఆత్రం సక్కు, ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, నిర్మల్ జడ్పీ చైర్మన్ విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని