అక్రమ వెంచర్లు సిద్ధం.. సక్రమానికి యత్నం
అధికారులు ఎన్నికల విధుల్లో ఉండగా.. మరోవైపు భూ బకాసురులు అక్రమ వెంచర్లలో ప్లాట్ల విక్రయాలను జోరుగా సాగిస్తున్నారు.
రిజిస్ట్రేషన్ చేయాలని అధికారులపై ఒత్తిళ్లు..
ఆసిఫాబాద్ పెట్రోల్బంక్ వెనుక ఓ ప్రజాప్రతినిధికి చెందిన అనుమతులు లేని వెంచర్
ఈనాడు, ఆసిఫాబాద్: అధికారులు ఎన్నికల విధుల్లో ఉండగా.. మరోవైపు భూ బకాసురులు అక్రమ వెంచర్లలో ప్లాట్ల విక్రయాలను జోరుగా సాగిస్తున్నారు. పంట చేన్ల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే మొరాన్ని తెస్తూ హడావుడిగా వెంచర్లలో రోడ్లు వేసేస్తున్నారు. స్థలాలను కొనుగోలు చేసిన వ్యక్తుల రిజిస్ట్రేషన్ కోసం సంబంధిత అధికారులపై నేతల సహకారంతో స్థిరాస్తివ్యాపారులు ఒత్తిడి పెంచుతున్నారు. ఎలాగైనా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనే తలంపుతో తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అనుమతులు లేకుండా పుట్టుగొడుగుల్లా వెలుస్తున్న ఈ వెంచర్లలో.. నిర్వాహకులు పనిలో పనిగా పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలాలను సైతం కబ్జా చేసేస్తున్నారు.
వైద్య కళాశాల వెనుక అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు
జిల్లాలో ఎలాంటి దస్త్రాలు లేని వందల ఎకరాల బీడీపీపీ భూములు ఇప్పటికే ప్లాట్లు, భవనాలుగా మారిపోయాయి. చాలా వరకు కబ్జాలకు గురయ్యాయి. 2017లో అప్పటి అధికారులు వీటి స్వాధీనానికి ప్రయత్నించినా.. అనంతరం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ తరుణంలో ఇబ్బడిముబ్బడిగా వెంచర్లు వెలుస్తున్నాయి. డీటీసీపీ అధికారులు, ఇటు పంచాయతీ, రెవెన్యూ అధికారులు ఎవరూ స్పందించకపోవడంతో.. భూ మాఫియా ఆటలు సాగుతున్నాయి. కాగజ్నగర్, ఈజ్గాం, వాంకిడి, రెబ్బెన మండలాలతోపాటు ఏజెన్సీ మండలాలైన తిర్యాణి, జైనూర్లలో ఈ తరహా వెంచర్లలో అమాయకులకు ప్లాట్లు అంటగడుతున్నారు.
మొరం సైతం..
అనుమతులు లేకుండా ఉన్న వెంచర్లలో అడ్డదిడ్డంగా మొరం రోడ్లు వేయడానికి స్థిరాస్తివ్యాపారులు చిర్రకుంట వెళ్లే మార్గంలో మట్టి క్వారీనే ఏర్పాటు చేశారు. ఇంతకు ముందు ఇక్కడి నుంచి నాలుగు వరుసల రహదారి కోసం మొరం తరలించారు. ప్రస్తుతం పూర్తిగా వెంచర్ల నిర్వాహకులే ఇక్కడి నుంచి రాత్రి పగలు తేడా మొరం తీసుకెళ్తున్నారు.
మచ్చుకు కొన్ని ..
జిల్లా కేంద్రంలోని గిరిజన ఉద్యానవనానికి ఎదురుగా వెంచర్ వేశారు. ఎలాంటి అనుమతులు లేని ఈ ప్రదేశంలో ప్రస్తుతం మట్టిని తెచ్చి చదును చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. పెట్రోల్బంక్ వెనుక వేసిన వెంచర్ ఓ ప్రజాప్రతినిధికి చెందినది. ఇక్కడ 22 వరకు ప్లాట్లు ఉండగా.. కొన్నింటిని విక్రయించి, వీటికి రిజిస్ట్రేషన్ చేయాలని సంబంధిత అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. సర్వే నంబర్ 47లో కేవలం మూడు ఎకరాలకు మాత్రమే పట్టా ఉండగా.. ఏకంగా అయిదారు ఎకరాల వరకు చదును చేసి వెంచర్ వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతమంతా చెట్లు, పొదలతో నిండి ఉండడంతో అక్రమార్కులు హద్దు లేకుండా ఆక్రమణలకు పాల్పడుతున్నారు. రెబ్బెన మండలం కేంద్రంలో వట్టివాగు కాలువలను ఆనుకునే వెంచర్లు వేస్తున్నా.. నీటిపారుదలశాఖ అధికారులు అటువైపు చూడడం లేదు.
ఆసిఫాబాద్ మండలంలో గుండి వెళ్లే మార్గంలో సైతం అనేక వెంచర్లు ఉన్నాయి. ఈ ప్రాంతమంతా ఏజెన్సీ పరిధిలోనిది. అయినా ప్లాట్ల అమ్మకాలు, భారీ భవనాల నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అసలు ఇళ్లు లేని ప్రాంతాల్లో (అప్పటికే వెంచర్లు ఉన్న చోట) మొత్తం 94 మందికి అక్రమంగా అప్పటి పంచాయతీ అధికారులు ఇంటి నంబర్లు కేటాయించారు. విచారణ చేసి అవకతవకలను గుర్తించినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఆసిఫాబాద్ పురపాలికగా ఏర్పడడంతో.. ఈ విచారణ అటకెక్కినట్లేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఇంటి నంబర్ల ఆధారంగానే రిజిస్ట్రేషన్లు జరగడం వల్ల అక్రమాలు సక్రమంగా పట్టాలు ఎక్కుతున్నాయనేది బహిరంగ రహస్యం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈవీఎం @ 35ఏళ్లు..
[ 01-05-2024]
దేశంలోని ఎన్నికల నిర్వహణలో ఈవీఎంలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. వీటిని పుట్టుపూర్వోత్తరాలను ఒకసారి తెలుసుకుదాం. -
ఏసీబీ, విజిలెన్స్ అధికారుల విస్తృత తనిఖీలు.. స్థిరాస్తి వ్యాపారుల్లో గుబులు!
[ 01-05-2024]
సర్కారీ స్థలాల కబ్జా, అక్రమ వెంచర్లతో చెలరేగుతున్న భూ మాఫియా వ్యక్తుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. -
రెండు స్థానాలు ఎగబాకి..
[ 01-05-2024]
పదో తరగతి ఫలితాలు ఈసారి కొంత ఊరటనిచ్చాయి. కిందటేడాదితో పోల్చితే జిల్లాకు 19వ స్థానం రాగా.. ఈసారి రెండు స్థానాలు ఎగబాకి 17వ స్థానం దక్కించుకుంది. -
ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన కె.ప్రభాకర్రావు
[ 01-05-2024]
ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఛైర్మన్గా కె.ప్రభాకర్రావు మంగళవారం బాధ్యతలు చేపట్టారు. -
కుటుంబాన్ని ఆదుకోవాలని ఆందోళన
[ 01-05-2024]
విద్యుత్తు స్తంభంపై నుంచి పడి మృతి చెందిన జూనియర్ లైన్మెన్ నడిగొట్టు పవన్ కళ్యాణ్ మృతదేహంతో వారి కుటుంబీకులు ఆందోళన చేపట్టారు. -
ఎన్నికల సిబ్బందికి ముందే ఓటు
[ 01-05-2024]
లోక్సభ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. -
సమస్యలు అనేకం.. పరిష్కరించే వారితో మమేకం
[ 01-05-2024]
కేంద్ర కార్మికశాఖ సేకరించిన వివరాల ప్రకారం దేశంలోని శ్రామికశక్తిలో దాదాపు 93 శాతం అసంఘటితరంగంలో ఉన్నారు. 2011 నాటి లెక్కల ప్రకారం 47.41 కోట్ల మంది సంఘటిత, అసంఘటిత రంగంలో పనిచేస్తున్నట్లు అంచనా. -
అడవిలో 3 కి.మీ. నడవాల్సిందే..
[ 01-05-2024]
వేమనపల్లి మండలంలోని బొమ్మెన, చామనపల్లి గ్రామానికి చెందిన ఓటర్లకు అడవిలో 3 కి.మీ. కాలినడకన వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలి. -
ప్రచారానికి వడదెబ్బ
[ 01-05-2024]
ఎండలు మండిపోతున్నాయి. భరించలేనంత ఉక్కపోత.. కాలు బయట పెడితే భగ్గుమంటోంది.. కానీ వెళ్లక తప్పదు. ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికలు మే 13న ఉండటంతో అభ్యర్థులతో పాటు నాయకులు, ఆయా పార్టీల కార్యకర్తలు ఓట్లను రాబటుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. -
‘పది’ ఫలితాల్లో దిగజారి!
[ 01-05-2024]
పదో తరగతి ఫలితాల్లో జిల్లా మరోసారి వెనుకబడిపోయింది. మంగళవారం విడుదలైన ఫలితాల్లో జిల్లా గతేడాది ఫలితాలతో పోలిస్తే రెండు స్థానాలు దిగజారి 31వ స్థానంలో నిలిచింది. -
పదిలో కొంచెం పైకి..
[ 01-05-2024]
విద్యార్థుల భవితను నిర్ణయించే పదోతరగతి వార్షిక ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సాధించిన ఉత్తీర్ణత గతంలో కన్నా మెరుగుపడింది. -
గెలుపే లక్ష్యం.. చేరికలకు ప్రాధాన్యం
[ 01-05-2024]
పెద్దపల్లి పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. కీలక నేతలు వ్యూహాలు, ప్రతి వ్యూహాలు పన్నుతున్నారు. -
ఆహారశుద్ధి పరిశ్రమ ఏర్పాటుకు కృషి
[ 01-05-2024]
జిల్లా రైతులు పండిస్తున్న సేంద్రియ ఉత్పత్తుల కోసం స్థానికంగా ఆహార శుద్ధి పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
భాజపాలో చేరడం అదృష్టంగా భావిస్తున్నా
[ 01-05-2024]
భారాసలోని కేంద్రీకృత విధానాల వల్ల ఆ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన తనకు గడిచిన రెండు నెలల 25 రోజులు ప్రశాంతత లేకపోవడంతోపాటు అవహేళనకు గురయ్యానని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు బోర్లకుంట వెంకటేశ్నేత పేర్కొన్నారు. -
‘రూ.కోట్లు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నారు’
[ 01-05-2024]
చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కాంగ్రెస్ అధిష్ఠానానికి, ముఖ్యమంత్రి సీఎం రేవంత్రెడ్డికి రూ.కోట్లు ఇచ్చి తన కొడుకు గడ్డం వంశీకృష్ణకు పెద్దపల్లి ఎంపీ టికెట్ తెచ్చుకున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. -
ఆడబిడ్డగా ఆదరించండి
[ 01-05-2024]
ఆడబిడ్డగా మీ చెంతకు వచ్చా..కొంగుచాచి అడుగుతున్నా.. నన్ను ఆదరించండి అయిదేళ్లు అండగా ఉంటా అంటూ ఆదిలాబాద్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. -
ఆత్మీయ సమ్మేళనాలకే ప్రాధాన్యం
[ 01-05-2024]
ఎన్నికల్లో గెలవాలంటే అన్ని వర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలి. శాసనసభ ఎన్నికల్లో ఇంటింటా ప్రచారం చేస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ కథనంపై వ్యాఖ్యానించం.. న్యూదిల్లీతో టచ్లో ఉన్నాం: అమెరికా
-
శంషాబాద్లో 5 మేకలతో ఎర.. అయినా చిక్కని చిరుత
-
ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులున్నాయా? ఈ ప్రయోజనాలు తెలుసా?
-
యంగ్గా కనిపించడం కోసం అలాంటి పనులు చేయను: ఆమిర్ ఖాన్
-
బీఎస్ఎన్ఎల్లో బ్రాడ్బ్యాండ్ ఇన్స్టలేషన్ ఛార్జీలు ఉండవ్
-
ఆర్సీబీకి ఇదేం శాపమో..? ఆ జట్టులోకొస్తే వైఫల్యం.. వేరే జట్లలో అదరహో!