ప్రగతిలో జిల్లా పరుగు
రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని కలెక్టర్ నివాస్ అన్నారు. జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో బుధవారం నిర్వహించిన గణతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించిన కలెక్టర్ జాతీయ జెండాను ఎగరవేశారు.
గణతంత్ర దినోత్సవంలో కలెక్టర్ నివాస్
పరేడ్గ్రౌండ్లో వాహనంలో పర్యటిస్తూ పోలీసుల గౌరవవందనం
స్వీకరిస్తున్న కలెక్టర్ నివాస్, ఎస్పీ సిద్ధార్థ కౌశల్
కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్టుడే: రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని కలెక్టర్ నివాస్ అన్నారు. జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో బుధవారం నిర్వహించిన గణతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించిన కలెక్టర్ జాతీయ జెండాను ఎగరవేశారు. రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) ముఖ్య అతిధిగా హాజరైన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు చెందిన ఎందరెందరో మహానుభావులు స్వాతంత్రోద్యమంలో అలుపెరగని పోరాటం చేశారంటూ పేరుపేరునా కీర్తిస్తూ అజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా వారిని స్మరించుకుంటున్నామన్నారు. గణతంత్ర రాజ్యాన్ని అందించేందుకు శ్రమించిన మహనీయులకు నమస్కరిస్తూ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.
నూరుశాతం వృద్ధి
జిల్లా సమగ్రాభివృద్ధి లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మక కార్యక్రమాల ద్వారా జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో 2019తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నూరుశాతం వృద్ధి సాధించామని కలెక్టర్ చెప్పారు. రైతు భరోసా, పీఎంకిసాన్ పథకం ద్వారా గడచిన మూడు సంవత్సరాల్లో 3.26 లక్షల రైతులకు రూ.935 కోట్లు అందజేశామన్నారు. జిల్లాలోని 738 రైతు భరోసా కేంద్రాల ద్వారా 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి రూ.310 కోట్లను రైతు ఖాతాలకు జమచేశారనీ, పాల రైతులకు కనీస మద్దతు ధర దక్కాలన్న లక్ష్యంతో తొలివిడతగా నూజివీడు డివిజన్లో 100 గ్రామాల్లో పాలవెల్లువ పథకాన్ని విస్తరించినట్టు తెలిపారు. రిజస్ట్రేషన్లలో ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం అమలవుతోందనీ, ఉపాధిహామీ పథకం ద్వారా గత 12 సంవత్సరాల్లో ఎన్నడూ లేనివిధంగా 1.38 కోట్ల పనిదినాలు కల్పించామన్నారు. రూ.911 కోట్లతో రహదారుల అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు తెలిపారు. సంపూర్ణ గృహహక్కు పథకాన్ని జిల్లాలో సమర్ధవంతంగా అమలు చేయడంతో పాటు పేదలకు కేటాయించిన లేఅవుట్లో గృహనిర్మాణాలు వేగవంతం అయ్యేలా చూస్తున్నామని చెప్పారు. మహిళలు, వివిధ వర్గాలు, ఆయా సామాజిక వర్గాల వారీ అందజేస్తున్న పింఛన్లు, ఆసరా, నేతన్న నేస్తం, వాహన మిత్ర, తదితర సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఎంతమందికి లబ్ధి చేకూరుస్తున్నారనే విషయాలను గణాంకాల వారీ వివరించారు.
పోలీసుల కవాతు
మెరుగైన వైద్యం
పేద వర్గాలకు ఉచితంగా మెరుగైన వైద్యసేవలు అందించాలన్న లక్ష్యంతో జిల్లాలో 1.18 లక్షల మందికి రూ.463 కోట్లు ఖర్చుచేశామన్నారు. వైద్యం ఖర్చు రూ.1,000 దాటే 1,381 నూతన చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చి మొత్తం 2,440 చికిత్సలకు ఉచితంగా వైద్యసేవలు చేరువ చేస్తున్నట్టు చెప్పారు. రూ.560 కోట్ల వ్యయంతో మచిలీపట్నంలో వైద్య కళాశాల ఏర్పాటుకాబోతోందని తెలిపారు. కొవిడ్ వ్యాప్తిని సమర్థంగా ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నామని అంటూ కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు జిల్లాలో అలుపులేని పోరాటం చేస్తున్న ఫ్రంట్లైన్ వారియర్స్, ఇతర విభాగాలకు చెందిన సిబ్బందికి అభినందనలు తెలిపారు. జిల్లా అభివృద్ధికి తగు సహాయ, సహకారాలు అందిస్తున్న జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. సంక్షేమ పథంలో పయనించేందుకు అన్ని విధాల సహకరిస్తున్న జిల్లాలోని ఇతర ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థలు, బ్యాంకర్లు తదితరులకు అభినందనలు తెలియజేశారు. జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్, జడ్పీ ఛైర్పర్సన్ ఉప్పాల హారిక, మేయర్ వెంకటేశ్వరమ్మ, జేసీలు కె.మాధవీలత, శివశంకర్, మోహన్కుమార్, శ్రీవాస్నుపూర్అజయ్కుమార్, ఏఆర్ ఏఎస్పీ ప్రసాద్, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
బాలానృత్య నికేతన్ విద్యార్థుల ప్రదర్శన
వైద్య ఆరోగ్యశాఖ (తృతీయ)
ఆకట్టుకున్న శకటాలు
మచిలీపట్నం(గొడుగుపేట),న్యూస్టుడే: పరేడ్ గ్రౌండ్లో వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. సమగ్రశిక్ష శకటం ప్రథమ, గ్రామీణ నీటి సరఫరా విభాగం ద్వితీయ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ శకటానికి తృతీయ బహుమతి లభించింది. గ్రామీణాభివృద్ధి శాఖ నాలుగు, వ్యవసాయశాఖ శకటం ఐదో స్థానంలో నిలిచాయి.విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు వ్యవసాయశాఖ, మత్స్యశాఖ, గృహనిర్మాణ, మెప్మా, గ్రామీణాభివృద్ధి తదితర శాఖలు స్టాల్స్ ఏర్పాటు చేశాయి.
పెడన మండలం తోటమూల జడ్పీహెచ్ఎస్ విద్యార్థుల పిరమిడ్ విన్యాసం
రాష్ట్ర స్థాయిలో మొదటి, రెండవ బహుమతి సాధించిన మహిళాభివృద్ధి శిశు సంక్షేమ, వైద్య ఆరోగ్య శాఖ శకటాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ఇద్దరు అధికారులపై ఫిర్యాదు చేస్తాం: బొండా ఉమా
[ 06-05-2024]
వైకాపా అరాచకాలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించినట్లుగా రాష్ట్ర ప్రధానా ఎన్నికల అధికారి కార్యాలయం స్పందించట్లేదని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. -
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు
[ 06-05-2024]
ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్పై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్
[ 06-05-2024]
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. -
పెద్దిరెడ్డీ.. నీ పాపాలు శిశుపాలుడిని మించిపోయాయి: నారా లోకేశ్
[ 06-05-2024]
పాపాల పెద్దిరెడ్డీ.. నీ పాపాలు శిశుపాలుడిని మించిపోయాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎక్స్(ట్విటర్) వేదికగా విమర్శించారు. -
జగనాసుర వారి.. నరకాపురి..!
[ 06-05-2024]
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని రహదారులపై ప్రయాణించినవారెవరైనా సరే.. జగన్ సర్కారును శాపనార్థాలు పెట్టకుండా ఉండలేరు. అటు ప్రైవేటు వాహనాలవారే కాదు.. ఆర్టీసీ బస్సు డ్రైవర్లు సైతం మేం నడపలేం అంటూ మొత్తుకున్న సందర్భాలెన్నో. పల్లె వెలుగు బస్సులు నడి రోడ్డుమీదనే ఎన్నిసార్లు నిలిచిపోయాయో లెక్కే లేదు. -
ఉద్యోగుల ఓట్లకూ వైకాపా గాలం..!
[ 06-05-2024]
ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్ వినియోగంలో తీవ్ర గందరగోళం నెలకొంది. వందల సంఖ్యలో ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురయ్యారు. వారికి బ్యాలట్ విడుదల కాలేదు. -
ప్రవాసాంధ్రులూ.. పారాహుషార్!
[ 06-05-2024]
ఒక్క వ్యవసాయ భూములు, పొలాలే కాదు... ఇళ్లు, ఇళ్ల స్థలాలు, భవనాలు సహా.. అన్నిరకాల స్థిరాస్తులకు ఎసరు పెట్టేసింది జగన్ సర్కారు. కొత్తగా తెచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ప్రకారం దొడ్డిదారిన ఆస్తులను కాజేసే అక్రమార్కులకు ఇది వరంగా మారనుంది. -
ప్రశాంతంగా నీట్
[ 06-05-2024]
వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన నీట్ ఆదివారం ప్రశాంతంగా జరిగింది. విజయవాడతోపాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పలు కళాశాలల వద్దకు విద్యార్థులు, తల్లిదండ్రులు నిర్దేశిత సమయం కంటే ముందే చేరుకున్నారు. -
పట్టా లేదు... వంశీ.. పత్తా లేరు..
[ 06-05-2024]
గన్నవరం నియోజకవర్గంలో జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాలు అర్హులకు అందని ద్రాక్షగానే మారాయి. రాజకీయ అండదండలు ఉన్నవారికే అధిక శాతం పట్టాలు దక్కాయి. -
ఉట్టిపడిన సంప్రదాయం
[ 06-05-2024]
రుగ్వేదం పద్మశ్రీకి ప్రపంచ రికార్డు ప్రదానం చేయడం సంతోషంగా ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదివారం విజయవాడ ఎంబీ విజ్ఞాన కేంద్రంలో స్వరలయ సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వరలయ ప్రథమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. -
తెదేపా కార్యకర్తలపై రెచ్చిపోయిన వైకాపా మూకలు
[ 06-05-2024]
ప్రశాతంగా ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేసుకుంటున్న తెదేపా కార్యకర్తలపై వైకాపా నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయి దాడికి పాల్పడిన సంఘటన కృష్ణా జిల్లా మొవ్వ మండలం కోసూరు గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. -
పేర్ని నాని అరాచకానికి చెక్ పెడదాం
[ 06-05-2024]
మచిలీపట్నం నియోజకవర్గాన్ని సొంత సామాజ్యంగా భావిస్తూ రాచరికపు పోకడలతో అన్ని వర్గాలను అణిచివేస్తున్న పేర్ని వెంకట్రామయ్య(నాని) కబంధ హస్తాల నుంచి నియోజకవర్గాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని సైనిక్ సమతాదళ్(ఎస్ఎస్డీ) నాయకులు స్పష్టం చేశారు. -
రేపు పవన్ రాక!
[ 06-05-2024]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 7న గన్నవరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గన్నవరం కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకు మద్దతుగా ఆయన రానున్నట్లు సమాచారం. -
వైకాపాకు గుణపాఠం చెప్పే సమయం వచ్చింది
[ 06-05-2024]
పెత్తందారులు.. పేదలు అంటూ నాలుగు సంవత్సరాల పాటు నయవంచక పాలనకు పాల్పడిన వైకాపాకు తగురీతిన బుద్ధి చెప్పేందుకు సమయం వచ్చిందని సోషల్ డెమొక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మాదిగాని గుర్నాథం అన్నారు. -
నిబంధనలు బేఖాతర్
[ 06-05-2024]
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా వైకాపా నాయకులు వాటిని పట్టించుకోవడం లేదు. ఎటువంటి అనుమతులతో పనిలేకుండానే ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. -
సూపర్-6 పథకాలతో సంక్షేమం పరుగులు
[ 06-05-2024]
అవనిగడ్డ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టించడమే లక్ష్యం. సూపర్-6 పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతాం. నియోజకవర్గంలో సంక్షేమ కార్యక్రమాలను కొత్త పుంతలు తొక్కిస్తాం. యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. -
మీ భూములు కొల్లగొట్టేస్తారు..!
[ 06-05-2024]
ప్రజల ఆస్తులు, భూములు కొల్లగొట్టేందుకే వైకాపా ప్రభుత్వం కొత్తగా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికే భూసర్వే, భూరక్ష పేర్లతో రైతుల భూములను సర్వే చేసింది. ఇందులో చాలా వ్యత్యాసాలు బయటపడ్డాయి. -
‘జగన్.. అధికార దుర్వినియోగం చేశారు’
[ 06-05-2024]
గత ఎన్నికల్లో ప్రజలు వైకాపాకు 151 ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలను ఇస్తే.. ముఖ్యమంత్రి జగన్ దుర్వినియోగం చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ దుయ్యబట్టారు. -
తెదేపాకు అవరోధం.. వైకాపాకు సహకారం
[ 06-05-2024]
నందిగామలో తెదేపా కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్యను పోస్టల్ బ్యాలట్ ఓటు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లకుండా ఆర్వో ఎ.రవీంద్రరావు అడ్డుకున్నారు. పోలింగ్ కేంద్రంలోకి అనుమతి లేదని ఆమెను బయటికి పంపించారు. -
ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సమీక్ష
[ 06-05-2024]
ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 8న భారత ప్రధాని నరేంద్రమోదీ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా డీకే బాలాజీ తెలిపారు. -
పోస్టల్ బ్యాలట్ సమాచారానికి హెల్ప్లైన్లు
[ 06-05-2024]
పోస్టల్ బ్యాలట్ పట్ల సందేహాలను నివృత్తి చేసేందుకు హెల్ప్లైన్లను ఏర్పాటు చేసినట్లు నోడల్ అధికారి షాహిద్బాబు తెలిపారు. -
సీఎం పర్యటనకా? పోస్టల్ బ్యాలట్కా?
[ 06-05-2024]
పోస్టల్ బ్యాలట్ విషయంలో పోలీసులకు కొత్త సమస్య ఎదురైంది. ఎన్నికల విధులు నిర్వహించే పోలీస్ అధికారులు, సిబ్బందికి ఈ ఓటింగ్కు 6వ తేదీ కేటాయించారు. -
ఈవీఎం-వీవీ ప్యాడ్ల ఓటింగ్ సజావుగా సాగాలి
[ 06-05-2024]
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం-వీవీ ప్యాడ్ల) ద్వారా జరిగే ఓటింగ్ ప్రక్రియ సక్రమంగా, సజావుగా జరిగేలా చూడాలని ఎన్నికల పరిశీలకురాలు మంజురాజ్వాల్ సూచించారు. -
జిల్లాలో తేలికపాటి వర్షాలు
[ 06-05-2024]
జిల్లాలోని రెండు ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలు కురిశాయి. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు నమోదైన వివరాల ప్రకారం.. మొత్తం 5.2 మిల్లీ మీటర్ల వర్షం పడగా, సగటు వర్షపాతం 0.26 మి.మీ.గా ఉంది. -
ఫెసిలిటేషన్ కేంద్రాల సంఖ్య పెంపు
[ 06-05-2024]
ద్యోగుల పోస్టల్ బ్యాలట్ వినియోగ నిమిత్తం జిల్లాలో అదనపు ఫెసిలిటేషను కేంద్రాలు ఏర్పాటు చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం, విజయవాడ సెంట్రల్, మైలవరం నియోజకవర్గాల ఆర్వోల కార్యాలయాల్లో ఆదివారం నూతనంగా పోస్టల్ బ్యాలట్ వినియోగ కేంద్రాలను ఏర్పాటు చేశారు. -
ఫారం-12 అందజేతకు మరో అవకాశం
[ 06-05-2024]
పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే ఉద్యోగులు ముందుగా ఫారం-12 కచ్చితంగా అందజేయాల్సి ఉంది. వివిధ కారణాల వల్ల వీటిని ఇప్పటి వరకు సమర్పంచని వారికి ఈసీఐ మరో అవకాశం కల్పించినట్టు కలెక్టర్ ఎస్.డిల్లీరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
-
ఇరాన్లో వేధింపులు తట్టుకోలేక.. పడవతో సహా భారత్కు చేరుకొన్న మత్స్యకారులు..!
-
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్న్యూస్.. ఆగస్టు నుంచి 4జీ సేవలు
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
రఫాపై ఇజ్రాయెల్ దండయాత్ర.. దాడులు మొదలుపెట్టిన సైన్యం!
-
నన్ను గదిలో బంధించి దాడి చేశారు: రాధికా ఖేడా తీవ్ర ఆరోపణలు