ముఖ్యమంత్రి మాట.. నీటి మూట
అవనిగడ్డ - నాగాయలంక ప్రధాన రహదారిపై ఉన్న డంపింగ్ యార్డు తరలింపు ఆవశ్యకతను ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్బాబు 2022 అక్టోబరు 20న అవనిగడ్డ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్కు వివరించారు.
అవనిగడ్డలోని డంపింగ్ యార్డుతో జనానికి అవస్థలు
న్యూస్టుడే, అవనిగడ్డ గ్రామీణం
అవనిగడ్డ - నాగాయలంక ప్రధాన రహదారిపై ఉన్న డంపింగ్ యార్డు తరలింపు ఆవశ్యకతను ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్బాబు 2022 అక్టోబరు 20న అవనిగడ్డ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్కు వివరించారు. స్పందించిన సీఎం డంపింగ్ యార్డు తరలింపు కోసం రూ.10 కోట్లు ఇస్తున్నట్లు హామీ ఇచ్చారు. ఇప్పటికీ నెరవేరక పోవడంతో స్థానిక ప్రజలు ముఖ్యంగా వాహన చోదకులు అవస్థలు పడుతున్నారు.
అవనిగడ్డలో చెత్త డంపింగ్ యార్డు తరలింపు ప్రహసనంగా మారింది. ఎమ్మెల్యే సమక్షంలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన సందర్భంలో చెత్త తరలింపు మరో గ్రామమైన అశ్వరావుపాలెం ప్రాంతానికి చేరింది. ఆ గ్రామస్థులు అడ్డుచెప్పడంతో సమస్య మళ్లీ యథాస్థితికి చేరింది. దీంతో అవనిగడ్డ- నాగాయలంక రహదారిపై ప్రయాణించే వారికి ఈ సమస్య తీరని వ్యధగా మారింది.
సమస్యలు ఇలా...
డంపింగ్ యార్డులో గుట్టలుగా పేరుకుపోతున్న చెత్తకు నిప్పు పెడుతుండడంతో వాహనదారులకు ముప్పు ఏర్పడుతోంది. రద్దీగా ఉండే రహదారి కావడంతో దట్టమైన పొగ మధ్య ఎదురుగా వచ్చే వాహనాలు కనబడక, దుర్వాసనకు ముక్కు మూసుకుంటూ ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. డంపింగ్ యార్డును తరలిస్తామని చెప్పిన ప్రజాప్రతినిధి మళ్లీ ఆ ఊసే ఎత్తడంలేదని వారు వాపోతున్నారు. యార్డులో వేసిన జంతు కళేబరాల కోసం వీధి కుక్కలు గుంపులుగా చేరి, ఒక్కోసారి ద్విచక్రవాహనాలకు అడ్డుపడుతున్నాయి. పలుమార్లు ద్విచక్ర వాహనాలపై దాడి చేసిన సంఘటనలూ ఉన్నాయి.
ముక్కు మూసుకోవాల్సిందే
- చిల్లపల్లి సుధాకర్, ఎలక్ట్రీషియన్, చోడవరం, నాగాయలంక
డంపింగ్ యార్డు వద్దకు వచ్చే సరికి ముక్కు మూసుకోవాల్సిందే. దట్టమైన పొగ పేరుకుపోతోంది. దారి కనపడదు, బండి నడపాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. ఈ సమస్య ఎప్పుటికి తీరుతుందో.
సీఎం మాట నిలబెట్టుకోలేకపోయారు
- కొల్లూరి వెంకటేశ్వరరావు, స్థానికుడు, అవనిగడ్డ
డంపింగ్ యార్డు తరలింపు కోసం వేలాది మంది సమక్షంలో నిధులు మంజూరు చేస్తున్నాను అని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. సీఎం నుంచి ఎమ్మెల్యే నిధులు తీసుకురాలేకపోయారు. సీఎం మాట నిలబెట్టుకోలేకపోయారు.
కుక్కలు దాడి చేస్తున్నాయి
- మాదివాడ బద్రీనారాయణ, వేకనూరు
ద్విచక్ర వాహనంపై వస్తుంటే కుక్కలు దాడి చేస్తున్నాయి. యార్డులోని జంతు కళేబరాలు ఉండడంతో శునకాలు చేరి, వాహనాలకు అడ్డు పడుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా కార్యకర్తలపై రెచ్చిపోయిన వైకాపా మూకలు
[ 06-05-2024]
ప్రశాతంగా ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేసుకుంటున్న తెదేపా కార్యకర్తలపై వైకాపా నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయి దాడికి పాల్పడిన సంఘటన కృష్ణా జిల్లా మొవ్వ మండలం కోసూరు గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. -
పేర్ని నాని అరాచకానికి చెక్ పెడదాం
[ 06-05-2024]
మచిలీపట్నం నియోజకవర్గాన్ని సొంత సామాజ్యంగా భావిస్తూ రాచరికపు పోకడలతో అన్ని వర్గాలను అణిచివేస్తున్న పేర్ని వెంకట్రామయ్య(నాని) కబంధ హస్తాల నుంచి నియోజకవర్గాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని సైనిక్ సమతాదళ్(ఎస్ఎస్డీ) నాయకులు స్పష్టం చేశారు. -
రేపు పవన్ రాక!
[ 06-05-2024]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 7న గన్నవరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గన్నవరం కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకు మద్దతుగా ఆయన రానున్నట్లు సమాచారం. -
వైకాపాకు గుణపాఠం చెప్పే సమయం వచ్చింది
[ 06-05-2024]
పెత్తందారులు.. పేదలు అంటూ నాలుగు సంవత్సరాల పాటు నయవంచక పాలనకు పాల్పడిన వైకాపాకు తగురీతిన బుద్ధి చెప్పేందుకు సమయం వచ్చిందని సోషల్ డెమొక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మాదిగాని గుర్నాథం అన్నారు. -
నిబంధనలు బేఖాతర్
[ 06-05-2024]
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా వైకాపా నాయకులు వాటిని పట్టించుకోవడం లేదు. ఎటువంటి అనుమతులతో పనిలేకుండానే ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. -
సూపర్-6 పథకాలతో సంక్షేమం పరుగులు
[ 06-05-2024]
అవనిగడ్డ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టించడమే లక్ష్యం. సూపర్-6 పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతాం. నియోజకవర్గంలో సంక్షేమ కార్యక్రమాలను కొత్త పుంతలు తొక్కిస్తాం. యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. -
మీ భూములు కొల్లగొట్టేస్తారు..!
[ 06-05-2024]
ప్రజల ఆస్తులు, భూములు కొల్లగొట్టేందుకే వైకాపా ప్రభుత్వం కొత్తగా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికే భూసర్వే, భూరక్ష పేర్లతో రైతుల భూములను సర్వే చేసింది. ఇందులో చాలా వ్యత్యాసాలు బయటపడ్డాయి. -
‘జగన్.. అధికార దుర్వినియోగం చేశారు’
[ 06-05-2024]
గత ఎన్నికల్లో ప్రజలు వైకాపాకు 151 ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలను ఇస్తే.. ముఖ్యమంత్రి జగన్ దుర్వినియోగం చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ దుయ్యబట్టారు. -
తెదేపాకు అవరోధం.. వైకాపాకు సహకారం
[ 06-05-2024]
నందిగామలో తెదేపా కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్యను పోస్టల్ బ్యాలట్ ఓటు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లకుండా ఆర్వో ఎ.రవీంద్రరావు అడ్డుకున్నారు. పోలింగ్ కేంద్రంలోకి అనుమతి లేదని ఆమెను బయటికి పంపించారు. -
ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సమీక్ష
[ 06-05-2024]
ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 8న భారత ప్రధాని నరేంద్రమోదీ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా డీకే బాలాజీ తెలిపారు. -
పోస్టల్ బ్యాలట్ సమాచారానికి హెల్ప్లైన్లు
[ 06-05-2024]
పోస్టల్ బ్యాలట్ పట్ల సందేహాలను నివృత్తి చేసేందుకు హెల్ప్లైన్లను ఏర్పాటు చేసినట్లు నోడల్ అధికారి షాహిద్బాబు తెలిపారు. -
సీఎం పర్యటనకా? పోస్టల్ బ్యాలట్కా?
[ 06-05-2024]
పోస్టల్ బ్యాలట్ విషయంలో పోలీసులకు కొత్త సమస్య ఎదురైంది. ఎన్నికల విధులు నిర్వహించే పోలీస్ అధికారులు, సిబ్బందికి ఈ ఓటింగ్కు 6వ తేదీ కేటాయించారు. -
ఈవీఎం-వీవీ ప్యాడ్ల ఓటింగ్ సజావుగా సాగాలి
[ 06-05-2024]
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం-వీవీ ప్యాడ్ల) ద్వారా జరిగే ఓటింగ్ ప్రక్రియ సక్రమంగా, సజావుగా జరిగేలా చూడాలని ఎన్నికల పరిశీలకురాలు మంజురాజ్వాల్ సూచించారు. -
జిల్లాలో తేలికపాటి వర్షాలు
[ 06-05-2024]
జిల్లాలోని రెండు ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలు కురిశాయి. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు నమోదైన వివరాల ప్రకారం.. మొత్తం 5.2 మిల్లీ మీటర్ల వర్షం పడగా, సగటు వర్షపాతం 0.26 మి.మీ.గా ఉంది. -
ఫెసిలిటేషన్ కేంద్రాల సంఖ్య పెంపు
[ 06-05-2024]
ద్యోగుల పోస్టల్ బ్యాలట్ వినియోగ నిమిత్తం జిల్లాలో అదనపు ఫెసిలిటేషను కేంద్రాలు ఏర్పాటు చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం, విజయవాడ సెంట్రల్, మైలవరం నియోజకవర్గాల ఆర్వోల కార్యాలయాల్లో ఆదివారం నూతనంగా పోస్టల్ బ్యాలట్ వినియోగ కేంద్రాలను ఏర్పాటు చేశారు. -
ఫారం-12 అందజేతకు మరో అవకాశం
[ 06-05-2024]
పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే ఉద్యోగులు ముందుగా ఫారం-12 కచ్చితంగా అందజేయాల్సి ఉంది. వివిధ కారణాల వల్ల వీటిని ఇప్పటి వరకు సమర్పంచని వారికి ఈసీఐ మరో అవకాశం కల్పించినట్టు కలెక్టర్ ఎస్.డిల్లీరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కర్ణాటకలో అధునాతనం.. ఏపీలో అధ్వానం!
-
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్