రోడ్డు ప్రమాద కేసును తప్పుదోవపట్టించిన సీఐ
నిర్లక్ష్యంగా కారు నడిపి ఓ వ్యక్తి మృతికి కారణమైన కేసును సీఐ తప్పు దోవపట్టించారు. న్యాయం చేయాలని ధర్నా చేసిన బాధితులపైనే కేసులు కట్టారు.
న్యాయం చేయాలని కోరిన బాధితులపైనే కేసులు
ముఖేశ్కుమార్ మీనకు ఫిర్యాదు చేస్తున్న బాధిత కుటుంబీకులు, తెదేపా, భాజపా నాయకులు
పుట్టపర్తి, ముదిగుబ్బ, న్యూస్టుడే : నిర్లక్ష్యంగా కారు నడిపి ఓ వ్యక్తి మృతికి కారణమైన కేసును సీఐ తప్పు దోవపట్టించారు. న్యాయం చేయాలని ధర్నా చేసిన బాధితులపైనే కేసులు కట్టారు. దీంతో బాధితులు తెదేపా, భాజపా నాయకుల సహకారంతో సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్కుమార్ మీనకు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా.. పుట్టపర్తిలోని విద్యాగిరి దగ్గర మార్చి 23న దామోదర్నాయుడు (40) ద్విచక్ర వాహనంలో తన పిల్లలకు క్యారేజీ తీసుకెళ్తుండగా ముందు వెళ్తున్న కారు నిర్లక్ష్యంగా నిలిపి డోర్ తీయడంతో ప్రమాదానికి గురై మృతి చెందాడు. కారు నడుపుతున్న పేరం శ్రీనివాసరెడ్డి తనకు బాబాయ్ అయిన డాక్టర్ గోపాల్రెడ్డికి జరిగిన విషయం చెప్పారు. గోపాల్రెడ్డి వైకాపా నాయకుడు. ముఖ్యమంత్రి జగన్కు దగ్గరి వ్యక్తి. గోపాల్రెడ్డికి బంధువైన సీఐ కొండారెడ్డితో కలిసి కేసు లేకుండా చేసేందుకు పన్నాగం పన్నారు. మొదట కారును బెంగళూరుకు తరలించారు. మృతదేహాన్ని పుట్టపర్తి జనరల్ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తీసుకెళ్లాలని బాధిత కుటుంబీకులకు తెలిపారు. బెంగళూరుకు తీసుకెళ్లగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు.
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు..
కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో నిండు ప్రాణం పోయిందని, తమకు న్యాయం చేయాలని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు పుట్టపర్తి అర్బన్ పోలీస్ స్టేషన్ ఎదుట గత నెల 24న ధర్నా చేశారు. న్యాయం చేయాల్సిందిపోయి సీఐ కొండారెడ్డి బాధితులపైనే కేసులు కట్టారు. బాధితులకు న్యాయం చేయమని పెద్దమనుషులు పంచాయితీ వెళ్లగా శ్రీనివాసరెడ్డి, డాక్టర్ గోపాల్రెడ్డి నానా దుర్భాషలాడారు. ఈ విషయాన్ని బాధితులు తెదేపా, భాజపా నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం విజయవాడలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు. మృతుడికి భార్య ఐదేళ్ల కిందటే చనిపోయింది. ఎనిమిదో తరగతి చదివే కుమార్తె, ఐదో తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మైనింగ్ మాయగాళ్లు..
[ 29-04-2024]
గనులను వైకాపా నాయకులు కొల్లగొడుతున్నారు. దోపిడీకి చిరునామాగా మార్చేశారు. ప్రభుత్వ వ్యవస్థను సర్వనాశనం చేసి ప్రయివేటు వ్యక్తులకు ప్రకృతి సంపదను దాసోహం చేశారు. -
సీఎం రాగానే.. జనం జారుకున్నారు
[ 29-04-2024]
తాడిపత్రిలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో జగన్ ప్రసంగం తేలిపోయింది. ఐదేళ్లుగా బటన్లు నొక్కే కార్యక్రమాల్లో ఏం చెప్పారో.. ఇప్పుడూ అదే ప్రసంగాన్ని ఊదరగొట్టారు. -
జీబీసీపై కన్నెత్తి చూడని జగన్
[ 29-04-2024]
గుంతకల్లు బ్రాంచ్ కెనాల్(జీబీసీ)ను జగన్ సర్కారు ఈ ఐదేళ్లలో కన్నెత్తి చూడలేదు. ఉరవకొండ, విడపనకల్లు, గుంతకల్లు, కర్నూలు జిల్లా ఆలూరు ప్రాంత రైతులకు జీబీసీ వరం లాంటిది. -
ఐదేళ్లు.. రూ.600 కోట్లు
[ 29-04-2024]
ప్రత్యేక సవరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భూముల మార్కెట్ విలువలను భారీగా వడ్డించింది. -
తెదేపా ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
[ 29-04-2024]
కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకలు రాళ్ల దాడికి తెగబడ్డాయి. -
ఐదేళ్లలో వక్కసారీ ఇటు చూడలేదే..
[ 29-04-2024]
వక్క సాగులో మడకశిర నియోజకవర్గం రాష్ట్రంలోనే ప్రసిద్ధి. కర్ణాటక సరిహద్దున ఉన్న ఈ ప్రాంతం సాగుకు అనుకూలంగా ఉండటంతో 150 ఏళ్లుగా పంట పండిస్తున్నారు. -
కర్ణాటకలో కళకళ.. జగన్ పాలనలో ఇలా..
[ 29-04-2024]
ఒక పరిశ్రమ ఏర్పాటైతే ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది. ప్రగతి సాక్షాత్కారమవుతుంది. జగన్ పాలనలో అలాంటిదేం ఉండదు. -
ఎమ్మెల్యే సోదరుడిని జిల్లా బహిష్కరణ చేయాలి
[ 29-04-2024]
ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్రెడ్డి దౌర్జన్యకాండకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని, అతడిని జిల్లా బహిష్కరణ చేయాలని మాజీ మంత్రి పరిటాల సునీత డిమాండ్ చేశారు. -
తెదేపా సూపర్ సిక్స్ ముందు.. వైకాపా గ్రాఫ్ పడిపోయింది: కేశవ్
[ 29-04-2024]
వైకాపా ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోతో ఆ పార్టీ శ్రేణులే తీవ్ర నిరాశ నిస్పృహల్లో కనిపిస్తున్నారని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. -
చిట్టడివి కాదు.. జగనన్న కాలనీనే
[ 29-04-2024]
జగనన్న కాలనీల్లో తమ ప్రభుత్వం పేదలకు స్థలాలు ఇవ్వడమే కాదు.. ఊళ్లనే నిర్మిస్తోందని సీఎం జగన్, వైకాపా నాయకులు సభలు, సమావేశాల్లో ఊదరగొట్టారు. -
శిథిల భవనంలోనే వైద్య సేవలు
[ 29-04-2024]
విడపనకల్లులో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల భవనం శిథిలమైంది. -
రథోత్సవానికి ఆహ్వానించలేదని వాగ్వాదం
[ 29-04-2024]
వజ్రకరూరులో రథోత్సవం సందర్భంగా గ్రామ సర్పంచి, ఆలయ పాలక మండలి సభ్యులను అధికారిక లాంచనాలతో ఆహ్వానించలేదని ఉపతహసీల్దార్ చంద్రశేఖర్, ఈవో కృష్ణయ్యతో స్థానిక వైకాపా నాయకులు వాగ్వాదానికి దిగారు. -
మట్టి దారిలో అవస్థల ప్రయాణం
[ 29-04-2024]
మండలంలోని ఎనుములదొడ్డి నుంచి శెట్టూరు మండలం యరబోరేపల్లికి ఏడు కిలోమీటర్ల మేర మట్టి దారి గుంతలు తేలి ప్రయాణానికి ఏమాత్రం అనుకూలంగా లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. -
బోరు తవ్వకం అడ్డగింత
[ 29-04-2024]
పట్టణంలోని కోటవీధిలో ప్రజలు చందాలు వేసుకుని బోరు తవ్వకం చేపట్టగా వైకాపా నాయకులు అడ్డుకున్నారు. -
టెండరులోనే తిరకాసు.. అద్దె ఎగ్గొట్టినందుకు తాఖీదు
[ 29-04-2024]
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి చెందిన వాణిజ్య సముదాయంలోని అద్దె గదులు, క్యాంటీన్ లీజుదారులు వర్సిటీకి అద్దె చెల్లించకుండా బకాయిలు పడ్డారు. -
పెళ్లి లారీ బోల్తా
[ 29-04-2024]
వివాహ వేడుకలు ముగించుకుని సొంతూళ్లకు పయనమవుతున్న వారికి దారి మధ్యలో సంభవించిన అనుకోని ప్రమాదం రెండు నిండు ప్రాణాలను బలిగొంది. -
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
[ 29-04-2024]
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
-
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
-
అమిత్ షా ‘వీడియో సోర్స్’పై పోలీసుల దృష్టి.. సోషల్ మీడియా సంస్థలకు లేఖ
-
ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసు.. సుప్రీంలో దీదీ సర్కార్కు ఊరట
-
కంట్రోల్ తప్పిన హెలికాప్టర్.. అమిత్ షాకు త్రుటితో తప్పిన ప్రమాదం
-
4 నెలలకే ఓలా క్యాబ్స్ సీఈఓ రాజీనామా.. 10% మంది ఉద్యోగులకు ఉద్వాసన!