రూ.5 కోసం ప్రయాణికుడి దారుణహత్య
ధర్మవరంలోని రైల్వేస్టేషన్ మార్గం కొత్తపేట కూడలి వద్ద ప్రయాణికుడు శ్రీనివాసరెడ్డి (58)తో ఆటో డ్రైవర్ లోకేంద్ర, అతని స్నేహితుడు విష్ణు ఆటో ఛార్జి రూ.5ల విషయమై గొడవపడి అతన్ని కర్ర, రాళ్లతో కొట్టి హత్య చేశారు.
ఆటో ఛార్జీ బేరంపై గొడవ
శ్రీనివాసరెడ్డి (పాత చిత్రం)
ధర్మవరం, న్యూస్టుడే : ధర్మవరంలోని రైల్వేస్టేషన్ మార్గం కొత్తపేట కూడలి వద్ద ప్రయాణికుడు శ్రీనివాసరెడ్డి (58)తో ఆటో డ్రైవర్ లోకేంద్ర, అతని స్నేహితుడు విష్ణు ఆటో ఛార్జి రూ.5ల విషయమై గొడవపడి అతన్ని కర్ర, రాళ్లతో కొట్టి హత్య చేశారు. ధర్మవరం రెండో పట్టణ పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు వివరాలు.. ధర్మవరంలోని పాతబస్టాండ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న శ్రీనివాస్రెడ్డి మదనపల్లి వెళ్లి తిరుగు ప్రయాణంలో రైలులో ధర్మవరం వచ్చారు. రైల్వేస్టేషన్ వెలుపల కొత్తపేట ఆటో స్టాండ్ వద్ద నుంచి పట్టణంలోకి వచ్చేందుకు ఆటో డ్రైవర్ లోకేంద్ర బేరమాడారు. పట్టణంలోకి వెళ్లేందుకు రూ.15 ఛార్జీ అవుతుందని ఆటో డ్రైవర్ చెప్పాడు. రూ.10 ఇస్తానని శ్రీనివాసరెడ్డి ఆటో డ్రైవర్తో పేర్కొన్నారు. ఐదు రూపాయల తేడా విషయంలో మాటా మాటా పెరిగి శ్రీనివాసరెడ్డిపై లోకేంద్ర, అతని స్నేహితుడు విష్ణు దాడి చేశారు. కర్ర, రాళ్లతో కొట్టడంతో ఘటనా స్థలంలోనే అతను మృతి చెందాడు. వారు మృతదేహాన్ని రహదారి పక్కన పడేసి వెళ్లారు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిసరాలను పరిశీలించి విచారణ చేశారు. ఆటో డ్రైవర్, అతని స్నేహితుడు గంజాయి మత్తులో ఉన్నారని స్థానికులు పోలీసులకు తెలిపారు. మృతదేహాన్ని పోలీసులు పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాసరెడ్డి పట్టణంలో ప్రైవేటు వాహన డ్రైవర్గా పనిచేస్తూ వివాదాలకు దూరంగా మంచి వ్యక్తిగా పేరుంది. అతని భార్య శారద ఫిర్యాదు మేరకు రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
నిందితుల అరెస్ట్.. హత్య అనంతరం పారిపోయిన నిందితులను ధర్మవరం కేహెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెనుక అరెస్టు చేశామని సీఐ అశోక్కుమార్ తెలిపారు. ఆటో కిరాయి విషయంలో గొడవకు దిగి శ్రీనివాసులరెడ్డిని ఆటో డ్రైవర్ లోకేంద్ర, అతని స్నేహితుడు విష్ణు కర్రలు, రాళ్లతో కొట్టి హత్య చేశారని పేర్కొన్నారు. గంటల వ్యవధిలో నిందితులను అరెస్టు చేశామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మైనింగ్ మాయగాళ్లు..
[ 29-04-2024]
గనులను వైకాపా నాయకులు కొల్లగొడుతున్నారు. దోపిడీకి చిరునామాగా మార్చేశారు. ప్రభుత్వ వ్యవస్థను సర్వనాశనం చేసి ప్రయివేటు వ్యక్తులకు ప్రకృతి సంపదను దాసోహం చేశారు. -
సీఎం రాగానే.. జనం జారుకున్నారు
[ 29-04-2024]
తాడిపత్రిలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో జగన్ ప్రసంగం తేలిపోయింది. ఐదేళ్లుగా బటన్లు నొక్కే కార్యక్రమాల్లో ఏం చెప్పారో.. ఇప్పుడూ అదే ప్రసంగాన్ని ఊదరగొట్టారు. -
జీబీసీపై కన్నెత్తి చూడని జగన్
[ 29-04-2024]
గుంతకల్లు బ్రాంచ్ కెనాల్(జీబీసీ)ను జగన్ సర్కారు ఈ ఐదేళ్లలో కన్నెత్తి చూడలేదు. ఉరవకొండ, విడపనకల్లు, గుంతకల్లు, కర్నూలు జిల్లా ఆలూరు ప్రాంత రైతులకు జీబీసీ వరం లాంటిది. -
ఐదేళ్లు.. రూ.600 కోట్లు
[ 29-04-2024]
ప్రత్యేక సవరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భూముల మార్కెట్ విలువలను భారీగా వడ్డించింది. -
తెదేపా ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
[ 29-04-2024]
కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకలు రాళ్ల దాడికి తెగబడ్డాయి. -
ఐదేళ్లలో వక్కసారీ ఇటు చూడలేదే..
[ 29-04-2024]
వక్క సాగులో మడకశిర నియోజకవర్గం రాష్ట్రంలోనే ప్రసిద్ధి. కర్ణాటక సరిహద్దున ఉన్న ఈ ప్రాంతం సాగుకు అనుకూలంగా ఉండటంతో 150 ఏళ్లుగా పంట పండిస్తున్నారు. -
కర్ణాటకలో కళకళ.. జగన్ పాలనలో ఇలా..
[ 29-04-2024]
ఒక పరిశ్రమ ఏర్పాటైతే ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది. ప్రగతి సాక్షాత్కారమవుతుంది. జగన్ పాలనలో అలాంటిదేం ఉండదు. -
ఎమ్మెల్యే సోదరుడిని జిల్లా బహిష్కరణ చేయాలి
[ 29-04-2024]
ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్రెడ్డి దౌర్జన్యకాండకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని, అతడిని జిల్లా బహిష్కరణ చేయాలని మాజీ మంత్రి పరిటాల సునీత డిమాండ్ చేశారు. -
తెదేపా సూపర్ సిక్స్ ముందు.. వైకాపా గ్రాఫ్ పడిపోయింది: కేశవ్
[ 29-04-2024]
వైకాపా ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోతో ఆ పార్టీ శ్రేణులే తీవ్ర నిరాశ నిస్పృహల్లో కనిపిస్తున్నారని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. -
చిట్టడివి కాదు.. జగనన్న కాలనీనే
[ 29-04-2024]
జగనన్న కాలనీల్లో తమ ప్రభుత్వం పేదలకు స్థలాలు ఇవ్వడమే కాదు.. ఊళ్లనే నిర్మిస్తోందని సీఎం జగన్, వైకాపా నాయకులు సభలు, సమావేశాల్లో ఊదరగొట్టారు. -
శిథిల భవనంలోనే వైద్య సేవలు
[ 29-04-2024]
విడపనకల్లులో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల భవనం శిథిలమైంది. -
రథోత్సవానికి ఆహ్వానించలేదని వాగ్వాదం
[ 29-04-2024]
వజ్రకరూరులో రథోత్సవం సందర్భంగా గ్రామ సర్పంచి, ఆలయ పాలక మండలి సభ్యులను అధికారిక లాంచనాలతో ఆహ్వానించలేదని ఉపతహసీల్దార్ చంద్రశేఖర్, ఈవో కృష్ణయ్యతో స్థానిక వైకాపా నాయకులు వాగ్వాదానికి దిగారు. -
మట్టి దారిలో అవస్థల ప్రయాణం
[ 29-04-2024]
మండలంలోని ఎనుములదొడ్డి నుంచి శెట్టూరు మండలం యరబోరేపల్లికి ఏడు కిలోమీటర్ల మేర మట్టి దారి గుంతలు తేలి ప్రయాణానికి ఏమాత్రం అనుకూలంగా లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. -
బోరు తవ్వకం అడ్డగింత
[ 29-04-2024]
పట్టణంలోని కోటవీధిలో ప్రజలు చందాలు వేసుకుని బోరు తవ్వకం చేపట్టగా వైకాపా నాయకులు అడ్డుకున్నారు. -
టెండరులోనే తిరకాసు.. అద్దె ఎగ్గొట్టినందుకు తాఖీదు
[ 29-04-2024]
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి చెందిన వాణిజ్య సముదాయంలోని అద్దె గదులు, క్యాంటీన్ లీజుదారులు వర్సిటీకి అద్దె చెల్లించకుండా బకాయిలు పడ్డారు. -
పెళ్లి లారీ బోల్తా
[ 29-04-2024]
వివాహ వేడుకలు ముగించుకుని సొంతూళ్లకు పయనమవుతున్న వారికి దారి మధ్యలో సంభవించిన అనుకోని ప్రమాదం రెండు నిండు ప్రాణాలను బలిగొంది. -
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
[ 29-04-2024]
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా ?
-
సీఎం రేవంత్ రెడ్డికి దిల్లీ పోలీసుల సమన్లు
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 900+, నిఫ్టీ 220+
-
దేవుడు న్యాయం పక్షానే ఉంటాడు: బ్రదర్ అనిల్
-
వీధి వ్యాపారిని కలిసిన మోదీ.. ఈ మోహిని గౌడ గురించి తెలుసా?
-
కెన్యాలో డ్యామ్ కూలి 40 మంది మృతి