పోస్టల్ బ్యాలెట్ భాగోతంపై గందరగోళం
ఓటు వినియోగంపై అస్పష్టత
విద్యాశాఖలో పని చేస్తున్న ఓ ఉపాధ్యాయుడిది అనంత నగరం నివాసం. ఈయన విధులు మాత్రం శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలంలో పని చేస్తున్నారు. ఈయనకు అక్కడ ఓపీఓగా విధులు కేటాయించనున్నారు. కానీ ఇప్పటి దాకా ఎవరికీ ఉత్తర్వు ఇవ్వలేదు. ఓటు మాత్రం అనంత నగరంలో ఉంది. అనంత జిల్లాలో ఈ నెల 18లోపు పోస్టల్ బ్యాలెట్ కోసం ఫాం-12 దరఖాస్తు చేసుకోవాలి. పోస్టల్ బ్యాలెట్ ఓటు ఎలా.. ఫాం-12 ఎవరికి ఇవ్వాలి?.
- జిల్లా వ్యాప్తంగా 2236 మంది బీఎల్వోలు ఉన్నారు. వీరికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం లేదు. పోలింగ్ రోజు విధుల్లో ఉంటారు. ఓటు ఎలా వేయాలో అంతుచిక్కని ప్రశ్నలా మారింది. పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తేనే ఓటు హక్కు వినియోగించుకోడానికి అవకాశం ఉండేది. దీనిపై ఇప్పటికీ స్పష్టత లేదు.జిల్లా సచివాలయం, న్యూస్టుడే: మే 13న జరిగే పోలింగ్ నిర్వహణ విధుల్లో ఉండే ఉపాధ్యాయ, ఉద్యోగ ఓట్లపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఓటు హక్కు వినియోగంపై అస్పష్టత తలెత్తింది. మునుపెన్నడూ లేని విధంగా పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో గందరగోళం ఏర్పడింది. ఈ బాగోతంపై అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు (ఆర్ఓ), నోడల్ అధికారుల్లోనే స్పష్టత కొరవడింది. ఫాం-12 ఎక్కడ దాఖలు పరచాలి. పోస్టల్ ఓటు ఎప్పుడు, ఎక్కడ వేయాలి.. వంటి వివరాలేవీ తెలియడం లేదు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల (పీఎస్) ప్రిసైడింగ్ అధికారి (పీఓ), సహాయ పీఓల నియామకం పూర్తి అయింది. వీరికి ఒక విడత అవగాహన శిక్షణ కూడా ముగిసింది. మూడు బ్యాచ్ల్లో జరిగిన శిక్షణ రోజుల్లోనే సదరు సిబ్బంది ఫాం-12 దాఖలు పరిచారు. అత్యధిక శాతం కల్గిన అదర్ పోలింగ్ అధికారులుగా (ఓపీఓ) నియమితులైన ఉద్యోగ, ఉపాధ్యాయుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రెండు రోజుల క్రితమే ఓపీఓలకు పోలింగ్ నియామక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఉద్యోగ విధులు నిర్వర్తించే చోటుకే వెళ్లి ఉత్తర్వులు అందజేశారు. ఈ ఉత్తర్వుతోపాటే ఫాం-12 దరఖాస్తును కూడా అందించారు.
ఎన్నికలకు 18,851 మంది
అనంత జిల్లావ్యాప్తంగా ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో 18,851 మంది ఉన్నారు. వీరిలో పీఓలు 2,552, ఏపీఓలు 2,715 మంది, ఓపీఓలు 9 వేలు మంది దాకా, పోలీసు సిబ్బంది 3,500, ఎన్నికల నిర్వహణ కమిటీల్లో 570, నోడల్ అధికారులు 33, సెక్టార్ అధికారులుగా 481 మందిని నియమించారు. వీరిలో పీఓ, ఏపీఓ, ఓపీఓలు పోలింగ్ రోజున విధుల్లో పాల్గొంటారు. ఈ మూడు కేడర్లే కీలకం. ఎన్నికల విధుల్లో ఉండే వారందరూ పోస్టల్ బ్యాలెట్ హక్కు వినియోగించుకోవచ్చు. కీలక పీఓ, ఏపీఓలు ఇప్పటికే ఫాం-12 శిక్షణ కేంద్రాల్లోనే అందజేశారు. ఓపీఓలకు ఇపుడిపుడే ఉత్తర్వులు అందాయి. వీరు ఫాం-12 ఓటు హక్కు కల్గిన ఆర్వోల కార్యాలయాల్లో ఇవ్వాలని నిర్దేశించారు. మరికొన్ని ప్రాంతాల్లో పనిచేసే చోటే ఇవ్వాలంటూ ఆర్వోలు తిరస్కరిస్తున్నారు. ఈ నెల 15, 16వ తేదీల్లోనే ఫాం-12 ఇవ్వాలని నియామక ఉత్తర్వులోనే పేర్కొన్నారు. గడువు పెంపుపై తగిన సమాచారం క్షేత్ర స్థాయికి వెళ్లలేదు. ఈనెల 29 నాటికి నామపత్రాల ఉపసంహరణ పూర్తి అవుతుంది. మే మొదటి వారంలో పోస్టల్ బ్యాలెట్ దాఖలుకు ఆర్వోల కేంద్రాల్లోనే ప్రత్యేక పెట్టెలను ఏర్పాటు చేస్తామన్నారు. అపుడే ఓటు హక్కు ఉన్న చోటే వేయాలా. విధులు నిర్వర్తించే చోట వేయాలా? అన్న దానిపై కనీస సమాచారం లేదు.
- అనంత నగరంలో నివాసం ఉన్న వందలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు శ్రీసత్యసాయి జిల్లాలో పని చేస్తున్నారు. ఆ జిల్లాలో ఇప్పటికీ ఓపీఓలకు ఉత్తర్వులు ఇవ్వలేదు. ఫాం-12 దాఖలు పరచడానికి ఈ నెల 18న తుదిగడువు. 17న శ్రీరామ నవమి కావడంతో సెలవు ఉంది. ఒక రోజులోనే సదరు ఫారం ఎలా దాఖలు చేస్తారో తెలీదు.
- జిల్లా వ్యాప్తంగా 8 నియోజకవర్గాల పరిధిలో మొత్తం 2,236 మంది బీఎల్ఓలు ఉన్నారు. వీరందరూ గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులే. ఓటు హక్కు ఒక చోట, విధులు మరొక చోట ఉన్నాయి. పోలింగ్ రోజున విధి నిర్వహణలో ఉండాల్సిందే. వీరికి కూడా పోస్టల్ బ్యాలెట్ అవకాశం ఉందా లేదా అన్నది చెప్పడం లేదు.
ప్రతి ఒక్కరికి పోస్టల్ బ్యాలెట్ ఫాం-12 దాఖలు పరచడానికి ఈనెల 18 దాకా గడువు పెంచాం. ఓటు హక్కు ఉన్న ప్రాంతాల్లోనే ఆ ఫారాన్ని ఇవ్వవచ్చు. పోస్టల్ బ్యాలెట్ తేదీలను త్వరలో వెల్లడిస్తాం. ఇతర జిల్లాల్లో పని చేస్తున్న వారికి ఇక్కడ ఓటు హక్కు ఉంటే.. అక్కడే దరఖాస్తు ఇవ్వవచ్చు. ఆ తర్వాత సంబంధిత ఆర్వోలకు వెళ్తాయి.
- ప్రభాకర్రావు, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి/డీపీఓ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మైనింగ్ మాయగాళ్లు..
[ 29-04-2024]
గనులను వైకాపా నాయకులు కొల్లగొడుతున్నారు. దోపిడీకి చిరునామాగా మార్చేశారు. ప్రభుత్వ వ్యవస్థను సర్వనాశనం చేసి ప్రయివేటు వ్యక్తులకు ప్రకృతి సంపదను దాసోహం చేశారు. -
సీఎం రాగానే.. జనం జారుకున్నారు
[ 29-04-2024]
తాడిపత్రిలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో జగన్ ప్రసంగం తేలిపోయింది. ఐదేళ్లుగా బటన్లు నొక్కే కార్యక్రమాల్లో ఏం చెప్పారో.. ఇప్పుడూ అదే ప్రసంగాన్ని ఊదరగొట్టారు. -
జీబీసీపై కన్నెత్తి చూడని జగన్
[ 29-04-2024]
గుంతకల్లు బ్రాంచ్ కెనాల్(జీబీసీ)ను జగన్ సర్కారు ఈ ఐదేళ్లలో కన్నెత్తి చూడలేదు. ఉరవకొండ, విడపనకల్లు, గుంతకల్లు, కర్నూలు జిల్లా ఆలూరు ప్రాంత రైతులకు జీబీసీ వరం లాంటిది. -
ఐదేళ్లు.. రూ.600 కోట్లు
[ 29-04-2024]
ప్రత్యేక సవరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భూముల మార్కెట్ విలువలను భారీగా వడ్డించింది. -
తెదేపా ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
[ 29-04-2024]
కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకలు రాళ్ల దాడికి తెగబడ్డాయి. -
ఐదేళ్లలో వక్కసారీ ఇటు చూడలేదే..
[ 29-04-2024]
వక్క సాగులో మడకశిర నియోజకవర్గం రాష్ట్రంలోనే ప్రసిద్ధి. కర్ణాటక సరిహద్దున ఉన్న ఈ ప్రాంతం సాగుకు అనుకూలంగా ఉండటంతో 150 ఏళ్లుగా పంట పండిస్తున్నారు. -
కర్ణాటకలో కళకళ.. జగన్ పాలనలో ఇలా..
[ 29-04-2024]
ఒక పరిశ్రమ ఏర్పాటైతే ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది. ప్రగతి సాక్షాత్కారమవుతుంది. జగన్ పాలనలో అలాంటిదేం ఉండదు. -
ఎమ్మెల్యే సోదరుడిని జిల్లా బహిష్కరణ చేయాలి
[ 29-04-2024]
ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్రెడ్డి దౌర్జన్యకాండకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని, అతడిని జిల్లా బహిష్కరణ చేయాలని మాజీ మంత్రి పరిటాల సునీత డిమాండ్ చేశారు. -
తెదేపా సూపర్ సిక్స్ ముందు.. వైకాపా గ్రాఫ్ పడిపోయింది: కేశవ్
[ 29-04-2024]
వైకాపా ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోతో ఆ పార్టీ శ్రేణులే తీవ్ర నిరాశ నిస్పృహల్లో కనిపిస్తున్నారని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. -
చిట్టడివి కాదు.. జగనన్న కాలనీనే
[ 29-04-2024]
జగనన్న కాలనీల్లో తమ ప్రభుత్వం పేదలకు స్థలాలు ఇవ్వడమే కాదు.. ఊళ్లనే నిర్మిస్తోందని సీఎం జగన్, వైకాపా నాయకులు సభలు, సమావేశాల్లో ఊదరగొట్టారు. -
శిథిల భవనంలోనే వైద్య సేవలు
[ 29-04-2024]
విడపనకల్లులో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల భవనం శిథిలమైంది. -
రథోత్సవానికి ఆహ్వానించలేదని వాగ్వాదం
[ 29-04-2024]
వజ్రకరూరులో రథోత్సవం సందర్భంగా గ్రామ సర్పంచి, ఆలయ పాలక మండలి సభ్యులను అధికారిక లాంచనాలతో ఆహ్వానించలేదని ఉపతహసీల్దార్ చంద్రశేఖర్, ఈవో కృష్ణయ్యతో స్థానిక వైకాపా నాయకులు వాగ్వాదానికి దిగారు. -
మట్టి దారిలో అవస్థల ప్రయాణం
[ 29-04-2024]
మండలంలోని ఎనుములదొడ్డి నుంచి శెట్టూరు మండలం యరబోరేపల్లికి ఏడు కిలోమీటర్ల మేర మట్టి దారి గుంతలు తేలి ప్రయాణానికి ఏమాత్రం అనుకూలంగా లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. -
బోరు తవ్వకం అడ్డగింత
[ 29-04-2024]
పట్టణంలోని కోటవీధిలో ప్రజలు చందాలు వేసుకుని బోరు తవ్వకం చేపట్టగా వైకాపా నాయకులు అడ్డుకున్నారు. -
టెండరులోనే తిరకాసు.. అద్దె ఎగ్గొట్టినందుకు తాఖీదు
[ 29-04-2024]
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి చెందిన వాణిజ్య సముదాయంలోని అద్దె గదులు, క్యాంటీన్ లీజుదారులు వర్సిటీకి అద్దె చెల్లించకుండా బకాయిలు పడ్డారు. -
పెళ్లి లారీ బోల్తా
[ 29-04-2024]
వివాహ వేడుకలు ముగించుకుని సొంతూళ్లకు పయనమవుతున్న వారికి దారి మధ్యలో సంభవించిన అనుకోని ప్రమాదం రెండు నిండు ప్రాణాలను బలిగొంది. -
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
[ 29-04-2024]
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
-
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
-
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
-
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!