logo

19న చంద్రబాబు ఎన్నికల ప్రచార సభ

ణేకల్లులో ఈనెల 19న సాయంత్రం తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో జరిగే ఎన్నికల ప్రచార సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు.

Published : 18 Apr 2024 04:23 IST

కణేకల్లు క్రాస్‌ వద్ద హెలిప్యాడ్‌ కోసం స్థలాన్ని పరిశీలిస్తున్న కాలవ శ్రీనివాసులు, నాయకులు

కణేకల్లు, న్యూస్‌టుడే: కణేకల్లులో ఈనెల 19న సాయంత్రం తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో జరిగే ఎన్నికల ప్రచార సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం కణేకల్లు క్రాస్‌లో హెలీప్యాడ్‌ కోసం స్థలం పరిశీలించారు. ఆ రోజు కణేకల్లులో బహిరంగ సభ, రోడ్డు షో ఉంటుందని వారు తెలిపారు.  కణేకల్లు, డి.హీరేహాళ్‌ మండల కన్వీనర్లు లాలెప్ప, హనుమంతరెడ్డి, నాయకులు ఆనందరాజు, ఆది, బసవరాజు, చంద్రశేఖర్‌ గుప్తా, చాంద్‌, బీటీ రమేశ్‌, మహ్మద్‌, నాగరాజు, ఈరప్ప, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని