logo

గణనాథుడి సేవలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి

శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ ఆదివారం ఉదయం దర్శించుకున్నారు.

Published : 27 Mar 2023 02:35 IST

జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌కి స్వామివారి జ్ఞాపిక అందిస్తున్న ఈవో వెంకటేశు

కాణిపాకం, న్యూస్‌టుడే: శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయ మర్యాదల ప్రకారం ఈవో ఎ.వెంకటేశు, అర్చకులు రాజగోపురం వద్ద స్వాగతం పలికారు. అనంతరం న్యాయమూర్తి స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం న్యాయమూర్తికి స్వామివారి శేషవ‌్రఆయన వెంట జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు, ఆర్డీవో రేణుక, ఆలయ ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి, చిత్తూరు పశ్చిమ సీఐ శ్రీనివాసులురెడ్డి, తహసీల్దార్‌ సుశీల, సూపరింటెండెంట్‌ కోదండపాణి, ఇన్‌స్పెక్టర్లు బాలాజీనాయుడు, బాబు, చిత్తూరు న్యాయస్థాన సిబ్బంది ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు