ఏడు గంటలే.. అందులోనూ కోతలే
నెల రోజులుగా ఏడు గంటలే విద్యుత్తు సరఫరా చేస్తున్నారు.. అదీనూ ఎక్కడా నిరంతరాయంగా అమలు కావడం లేదు.. అదీ చాలదన్నట్లు ఇటీవల సరఫరాలో తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్నాయి..
అప్రకటిత కోతలతో అవస్థలు
పంటలు కాపాడలేమంటూ అన్నదాత ఆవేదన
న్యూస్టుడే, చిత్తూరు(మిట్టూరు)
నెల రోజులుగా ఏడు గంటలే విద్యుత్తు సరఫరా చేస్తున్నారు.. అదీనూ ఎక్కడా నిరంతరాయంగా అమలు కావడం లేదు.. అదీ చాలదన్నట్లు ఇటీవల సరఫరాలో తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్నాయి.. ఏ ఫీడర్ చూసినా అదే పరిస్థితి.. ప్రతిరోజూ సరఫరాలో పలుమార్లు అంతరాయం ఏర్పడుతోందని రైతులు చెబుతున్నారు.. కొన్ని ఉప కేంద్రాల పరిధిలో ఈఎల్ఆర్ పేరిట సూచించిన సమయంలోనూ సరఫరా నిలిపేస్తున్నారంటూ అన్నదాతలు వాపోతున్నారు.. ఓవైపు సూర్యుడు భగభగ.. మరోవైపు కోతలతో పంటలను కాపాడుకోవడానికి నానా అవస్థలు పడుతున్నామని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
9 గంటలంటూ ఆర్భాటమే..
వ్యవసాయానికి 9 గంటలు విద్యుత్తు సరఫరా అంటూ ప్రభుత్వ ఆర్భాటమే తప్ప.. క్షేత్రస్థాయిలో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. 9 గంటల విద్యుత్తు సరఫరాను కుదించి ప్రస్తుతం ఏడు గంటలే ఇస్తున్నారు. ఉత్పత్తి, డిమాండు, సరఫరా మధ్య చాలా అంతరం ఉంది. ఫలితంగా లోటు ఏర్పడింది. మరోవైపు వాతావరణంలో మార్పుతో ఉష్ణోగ్రతలు క్రమేణా పెరుగుతుండటం, పంటలకు నీటి వినియోగం మరింత పెరిగింది.
ఎడాపెడా..
జిల్లాలో 3.07లక్షల వ్యవసాయ సర్వీసులు ఉన్నాయి. జిల్లాలో వరి, వేరుసెనగతో పాటు టమాటా, పండ్ల తోటలు, కూరగాయల పంటలు సాగు చేపట్టారు. 1.30 లక్షల ఎకరాల్లో మామిడి పంట పిందె దశలో ఉంది. ఈ సమయంలో నీరు అవసరం. ఎడాపెడా కోతలతో వరి, ఉద్యాన పంటలు దెబ్బతింటున్నాయి. శ్రమకోర్చి, అప్పులు చేసి సాగుకు పెట్టుబడులు పెట్టామని అవి ఎండిపోకుండా విద్యుత్తు సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు.
చిత్తూరు మండలం కన్నికాపురంలో కరెంటు కోసం ఎదురుచూస్తున్న రైతు కుమార్
అడుగడుగునా నిరీక్షణే..
వ్యవసాయ సర్వీసులకు ఏడు గంటల సరఫరా నిమిత్తం ఏ, బీ గ్రూపులుగా విభజించి.. విద్యుత్తు సరఫరా చేస్తున్నారు. ఏ గ్రూప్లో ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు, బి గ్రూప్లో ఉదయం 11 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సరఫరా చేయాల్సి ఉంది. ఇటీవల విద్యుత్తు శాఖ చిత్తూరు అర్బన్, రూరల్, పలమనేరు, పుంగనూరు, పీలేరు డివిజన్ల పరిధిలోని పలు మండలాల్లో అప్రకటిత కోతలు మరింతగా పెరిగాయి. సరఫరా ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు ఉండదో తెలియని పరిస్థితి. బోరు బావుల వద్దే నిరీక్షిస్తూ పంటలను కాపాడుకుంటున్నామని రైతులు చెబుతున్నారు.
సరఫరాలో కుదింపు..
వ్యవసాయ రంగానికి నిరంతరాయంగా 9 గంటల నుంచి 2 గంటలు కుదించి.. కేవలం 7 గంటలే సరఫరా చేస్తున్నారు. సాధారణంగా వేసవిలో అత్యవసర లోడ్ రిలీఫ్(ఈఎల్ఆర్) పేరిట కోతలు విధిస్తుంటారు. వైకాపా ప్రభుత్వంలో వేసవి ప్రారంభానికి ముందుగానే ఫిబ్రవరి నెల నుంచే ఈ కోతలు మొదలయ్యాయి. పవన, సౌర విద్యుత్తు ఉత్పత్తి తగ్గడం, ముందస్తు ప్రణాళికలు లేకపోవడం తదితర కారణాలతో కోతలు అనివార్యమవుతున్నాయి. వీటిపై సంబంధిత అధికారులను అడిగితే సరైన సమాధానం లేదని రైతులు పేర్కొంటున్నారు.
కన్నీటి కష్టమిలా..
మరో నాలుగైదు నీటి తడులు అందిస్తే వరి పంట చేతికి వస్తుందని భావిస్తున్న తరుణంలో విద్యుత్తు కష్టాలను రైతులను నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పంట కాపాడుకునేందుకు పెద్దపంజాణి మండలం కొళత్తూరు చెరువులో రైతులు కిరోసిన్, పెట్రోలు పంపులు ఏర్పాటు చేసుకొని వంతుల వారీగా నీటి తడులు అందిస్తున్నారు.
న్యూస్టుడే, పెద్దపంజాణి
నీటి తడులకు కష్టం..
- గిరిబాబు, కుక్కలపల్లె, యాదమరి మండలం
రెండెకరాల్లో కూరగాయలు, వరి సాగు చేశా. వ్యవసాయానికి 9 గంటలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా అమలు చేయడం లేదు. ఇప్పుడేమో ఏడు గంటలపాటు ఒకేసారి సరఫరా చేయడం లేదు. ఎడాపెడా కోతలతో పంటలకు నీటి తడులు ఇవ్వలేకపోతున్నాం. పంటను కాపాడుకోవడానికి కష్టంగా ఉంది.
సరఫరా అధ్వానం..
- సుకుమార్, పేయనపల్లి, గుడిపాల మండలం
గత కొద్ది రోజులుగా సరఫరా అధ్వానంగా ఉంది. తొమ్మిది గంటలు ఇస్తామన్న ప్రభుత్వం.. ప్రస్తుతం ఏడు గంటల సరఫరా సైతం గగనమైంది. పంటలకు నీటి తడులు ఇవ్వడం కష్టంగా మారింది. పదెకరాల్లో వరి, పెసలు, ఉద్దులు సహా మామిడి తోట ఉంది. ప్రస్తుతం నీటి అవసరం వీటికి ఎక్కువ. తరచూ సరఫరాలో అంతరాయం వల్ల అవస్థ పడుతున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రి పెద్దిరెడ్డి అనుచరుల ఘాతుకం.. బీసీవైపీ అధ్యక్షుడిపై దాడికి యత్నం
[ 29-04-2024]
చిత్తూరు జిల్లా సదుం పోలీస్స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీసీవైపీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్పై వైకాపా నేతలు దాడికి యత్నించారు. -
చిత్తూరు వైకాపా అభ్యర్థి కార్యాలయంలో నగదు స్వాధీనం
[ 29-04-2024]
చిత్తూరు నగరంలోని కొంగారెడ్డి పల్లిలో చిత్తూరు అసెంబ్లీ వైకాపా అభ్యర్ధి విజయానంద రెడ్డి కార్యాలయంలో జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సోదాలు చేపట్టింది. -
పులివర్తి నానికి భద్రత కల్పించండి.. హైకోర్టు ఆదేశం
[ 29-04-2024]
చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానికి 1+1 సెక్యూరిటీ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
సిబ్బంది ఉన్నా ఇంటింటికీ పింఛను ఎందుకివ్వరు?: చంద్రబాబు
[ 29-04-2024]
వైకాపా కుట్రలు, కుతంత్రాల్లో అధికారులు కూడా భాగస్వామ్యం కావడం దురదృష్టకరమని తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
ఏపీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని ప్రార్థించా: సినీనటి జయప్రద
[ 29-04-2024]
ఏపీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని శ్రీవారిని ప్రార్థించానని సినీనటి, భాజపా నాయకురాలు జయప్రద అన్నారు. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారి మూలమూర్తిని ఆమె దర్శించుకున్నారు. -
అంతా సొంత డబ్బా.. హామీలపై మాట్లాడరేమబ్బా!
[ 29-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వెంకటగిరిలో నిర్వహించిన సభ ఆత్మస్తుతి, పరనిందలా సాగింది. తన హయాంలో పథకాలు తెచ్చి సామాన్యుల జీవితాలను మార్చానంటూ గొప్పలు చెప్పుకొన్న సీఎం.. చంద్రబాబు హయాంలో ఒక్క పథకం పేరు గుర్తుకురాదని చెప్పడం ప్రజలను తీవ్ర విస్మయానికి గురిచేసింది. -
మాటలే తీపి.. లబ్ధిదారులకు టోపీ
[ 29-04-2024]
పేదలకు చేదు మిగిల్చిన ఘనత జగనన్న పాలనకే దక్కుతుంది.. బియ్యం కార్డుదారులకు ఇంటికే అన్ని రకాల నిత్యావసరాలు అందజేస్తున్నామంటూ ఆర్భాటపు ప్రకటనలు తప్ప క్షేత్రస్థాయిలో భిన్న పరిస్థితులు ఉన్నాయి. -
దాడులు, అరాచకమే ఎజెండా
[ 29-04-2024]
అరాచకమే ఎజెండాగా ఎన్నికల్లో నెగ్గాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుయుక్తులు పన్నుతున్నారు. ఈ క్రమంలో పుంగనూరు నియోజకవర్గంలో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయా అంటే తాజా పరిస్థితులను పరిశీలిస్తే సందేహమనే సమాధానం వస్తోంది. -
మాటల జ‘గన్’.. చేతల చూ‘ఫన్’
[ 29-04-2024]
కుప్పం పట్టణం, న్యూస్టుడే: ‘వైనాట్ కుప్పం అంటూ.. 2022 సెప్టెంబరు 23న ప్రతిపక్ష నాయకుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో పర్యటించిన సీఎం జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందుల్లా కుప్పాన్ని చూస్తానని హామీ ఇచ్చారు. -
అయ్యోర్లపై అధికార బెత్తం
[ 29-04-2024]
చిత్తూరు గ్రామీణ మండలం మాపాక్షి జడ్పీ ఉన్నత పాఠశాలను ఇటీవల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాష్ తనిఖీ చేశారు. ఆ సమయంలో ఏడో తరగతిలో విద్యార్థులతో ఆయన మాట్లాడారు. -
ఇదేం పని మురుగేషా!
[ 29-04-2024]
బోధనారంగంలో ఉత్తమ ప్రతిభకనబరిచిన ఆ ఉపాధ్యాయుడికి 2007-08 విద్యాసంవత్సరంలో జిల్లాస్థాయి అవార్డు దక్కింది. దీనిపై స్పందించిన మండల ప్రజాప్రతినిధులు.. కుటుంబ సభ్యుల పేరుతో మూడు ఇంటి పట్టాలు అందించారు. -
అయ్యా.. ఐదేళ్లూ చాలలేదా..?
[ 29-04-2024]
ఒక ప్రాంత అభివృద్ధికి రహదారులు, అద్భుతమైన కట్టడాలే కొలమానం. అలాంటిది చిత్తూరు నగరంలో రహదారులు అధ్వానంగా మారాయి. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు నానా కష్టాలు పడుతున్నారు. -
‘అరాచక పాలనకు అంతం పలకండి’
[ 29-04-2024]
వైకాపా అరాచక పాలనకు అంతం పలికేందుకు ఎన్నికల రూపంలో అవకాశమొచ్చిందని, ప్రజలు మే 13న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి తెదేపా కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు దగ్గుమళ్ల ప్రసాదరావు, గురజాల జగన్మోహన్ కోరారు. -
ఏం జరుగుతోంది భగవం‘తుడా’!
[ 29-04-2024]
తుడా.. ఈ పేరెత్తితే చాలు జిల్లా ప్రజల మెదళ్లు గిర్రున తిరుగుతాయి.. వందల అనుమానాలు తలెత్తుతాయి. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా)ను ఒకే ఒక వ్యక్తి తన అమ్ములపొదిగా.. రహస్య స్థావరంగా మార్చేశారంటే అతిశయోక్తి కాదు.. ఆయనే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి. -
దోపిడీలు చేయడంలో డిగ్రీలు
[ 29-04-2024]
ఇతరులను బెదిరించి డబ్బులు వసూలు చేయడంలో స్థానిక ఎమ్మెల్యే డిగ్రీలు చేశారని సినీనటుడు నందమూరి బాలకృష్ణ ఆరోపించారు. నియోజకవర్గంలో ఇసుక, గ్రావెల్ మాఫియా రాజ్యమేలుతున్నారని ఆయన అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నదిలో మునిగి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’