శ్మశానం చుట్టూ..వైకాపా శవ రాజకీయం
ఓ దళితవాడ శ్మశాన వాటిక.. రాజకీయాంశంగా మారిపోయింది. గ్రామాన్ని, గ్రామస్థులను రెండుగా చీల్చింది. నాయకుల స్వార్థంతో ఇదేళ్లుగా రాజకీయ జ్వాలల్లో రగులుతూనే ఉంది.
దళితవాడవాసులకు ఐదేళ్లుగా వేధింపులు
గ్రామం వీడిన పలువురు
బంగారమ్మ కాలనీలో ఇళ్ల మధ్యలోనే అంతిమ సంస్కారాలు నిర్వహించిన ప్రాంతం
ఓ దళితవాడ శ్మశాన వాటిక.. రాజకీయాంశంగా మారిపోయింది. గ్రామాన్ని, గ్రామస్థులను రెండుగా చీల్చింది. నాయకుల స్వార్థంతో ఇదేళ్లుగా రాజకీయ జ్వాలల్లో రగులుతూనే ఉంది. చస్తే పూడ్చిపెట్టడానికి ఆరడుగుల జాగా కావాలని అడిగిన పాపానికి అధికారపార్టీ నాయకుల ఉక్కుపాదాల కింద నలిగిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆధ్మాత్మిక నగరంలో అధర్మం రాజ్యమేలేలా జరుగుతున్న ఈ తతంగం అధికార వైకాపా నాయకుల అసలు రంగును తెలియజేస్తోంది.
జీవకోన (తిరుపతి), న్యూస్టుడే: తిరుపతి నగరం 50వ డివిజన్ పరిధిలోని తిమ్మినాయుడుపాలెం దళితవాడ గ్రామస్థులు పదేళ్లుగా శ్మశానవాటిక కోసం పోరాడుతున్నారు. గతంలో గ్రామానికి దక్షిణ దిక్కున ఉన్న కొంత ప్రైవేటు భూమి, కొంత కాలువ పోరంబోకు భూమిలో అనధికారికంగా అంతిమ సంస్కారాలు నిర్వహిస్తూ వచ్చారు. ప్రైవేటు భూములను వాటి యజమానులు స్వాధీనం చేసుకోవడంతోపాటు సమీపంలోని కాలువ పోరంబోకును కలిపేసుకున్నారు. దీంతో గ్రామస్థులు శ్మశానవాటిక కోసం ప్రభుత్వాధికారులు, నాయకుల చుట్టూ తిరగడం ప్రారంభించారు. 2018 నవంబరులో తెదేపా ప్రభుత్వం గ్రామానికి ఉత్తర దిక్కునున్న రెండెకరాల అటవీభూమిని కేటాయించేలా ఆదేశాలు జారీచేసింది. ఇదిలా కొనసాగుతుండగానే ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో శ్మశానవాటిక అంశం రాజకీయ రంగు పులుముకుంది. తమతో చేతులు కలపాలని వైకాపా నాయకులు షరతులు పెట్టడం, ఇందుకు స్థానిక తెదేపా నాయకులు ససేమిరా అనడంతో రాజకీయంగా ఇబ్బందులు పెట్టడం ప్రారంభించారు. గ్రామస్థులను రెండుగా చీల్చి దళితులు నిర్మించుకున్న బంగారమ్మకాలనీలో ఇళ్ల మధ్యే శవాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించేలా రెచ్చగొట్టారు. ఈ క్రమంలో జరిగిన ఘర్షణల్లో గాయపడిన తెదేపా మద్దతుదారులు పోలీసులను ఆశ్రయించగా వారిపైనే రివర్స్ కేసులు పెట్టించేలా చేశారు. ఇప్పుడు గ్రామంలో తెదేపా మద్దతుదారులు ఒక్కొక్కరిపై పది కేసులకు పైగా ఉన్నాయంటే వైకాపా నేతల ఒత్తిడే కారణం. ఈ నేపథ్యంలో వారు గ్రామం విడిచి బెయిళ్లకోసం అజ్ఞాతంలో ఉండి పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనీసం ఎన్నికల నాటికైనా గ్రామంలోకి వస్తామో లేదోనన్న ఆందోళన వారిలో ఉంది.
2022 సెప్టెంబర్ 17న రాష్ట్ర వ్యాప్తంగా దళితవాడలకు సంబంధించి శ్మశానవాటికల కోసం దరఖాస్తు చేసుకున్న 45 రోజుల్లో భూమిని కొనుగోలు చేసైనా ఇవ్వాలని సీˆఎంవో నుంచి అధికారికంగా ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో గ్రామస్థులు అనేక పర్యాయాలు కలెక్టర్, ఆర్డీవో, కమిషనర్, అటవీ అధికారులను కలిసి విన్నవించారు. రాజకీయ ఒత్తిళ్లతో వారూ స్పందించలేదు.
ఇంటిల్లిపాదీ కేసులు
శ్మశానం కోసం పోరాడితే వైకాపా నాయకులు గ్రామస్థులనే రెండుగా చీల్చారు. అంతిమ సంస్కారాల సమయంలో రెండువర్గాల మధ్య తగవులు పెట్టారు. మమ్మల్ని, మా వారిని కొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయిస్తే ప్రతిగా హత్యాయత్నం కేసులు నమోదు చేయించారు. చదువుకుంటున్న పిల్లలపైనా కేసులు పెట్టి వేధిస్తున్నారు. గ్రామాన్ని వదిలిపెట్టిపోయేలా చేశారు.
కాయం వెంకటరత్నం, తెదేపా ఎసీˆ్ససెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రి పెద్దిరెడ్డి అనుచరుల ఘాతుకం.. బీసీవైపీ అధ్యక్షుడిపై దాడికి యత్నం
[ 29-04-2024]
చిత్తూరు జిల్లా సదుం పోలీస్స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీసీవైపీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్పై వైకాపా నేతలు దాడికి యత్నించారు. -
చిత్తూరు వైకాపా అభ్యర్థి కార్యాలయంలో నగదు స్వాధీనం
[ 29-04-2024]
చిత్తూరు నగరంలోని కొంగారెడ్డి పల్లిలో చిత్తూరు అసెంబ్లీ వైకాపా అభ్యర్ధి విజయానంద రెడ్డి కార్యాలయంలో జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సోదాలు చేపట్టింది. -
పులివర్తి నానికి భద్రత కల్పించండి.. హైకోర్టు ఆదేశం
[ 29-04-2024]
చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానికి 1+1 సెక్యూరిటీ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
సిబ్బంది ఉన్నా ఇంటింటికీ పింఛను ఎందుకివ్వరు?: చంద్రబాబు
[ 29-04-2024]
వైకాపా కుట్రలు, కుతంత్రాల్లో అధికారులు కూడా భాగస్వామ్యం కావడం దురదృష్టకరమని తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
ఏపీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని ప్రార్థించా: సినీనటి జయప్రద
[ 29-04-2024]
ఏపీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని శ్రీవారిని ప్రార్థించానని సినీనటి, భాజపా నాయకురాలు జయప్రద అన్నారు. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారి మూలమూర్తిని ఆమె దర్శించుకున్నారు. -
అంతా సొంత డబ్బా.. హామీలపై మాట్లాడరేమబ్బా!
[ 29-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వెంకటగిరిలో నిర్వహించిన సభ ఆత్మస్తుతి, పరనిందలా సాగింది. తన హయాంలో పథకాలు తెచ్చి సామాన్యుల జీవితాలను మార్చానంటూ గొప్పలు చెప్పుకొన్న సీఎం.. చంద్రబాబు హయాంలో ఒక్క పథకం పేరు గుర్తుకురాదని చెప్పడం ప్రజలను తీవ్ర విస్మయానికి గురిచేసింది. -
మాటలే తీపి.. లబ్ధిదారులకు టోపీ
[ 29-04-2024]
పేదలకు చేదు మిగిల్చిన ఘనత జగనన్న పాలనకే దక్కుతుంది.. బియ్యం కార్డుదారులకు ఇంటికే అన్ని రకాల నిత్యావసరాలు అందజేస్తున్నామంటూ ఆర్భాటపు ప్రకటనలు తప్ప క్షేత్రస్థాయిలో భిన్న పరిస్థితులు ఉన్నాయి. -
దాడులు, అరాచకమే ఎజెండా
[ 29-04-2024]
అరాచకమే ఎజెండాగా ఎన్నికల్లో నెగ్గాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుయుక్తులు పన్నుతున్నారు. ఈ క్రమంలో పుంగనూరు నియోజకవర్గంలో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయా అంటే తాజా పరిస్థితులను పరిశీలిస్తే సందేహమనే సమాధానం వస్తోంది. -
మాటల జ‘గన్’.. చేతల చూ‘ఫన్’
[ 29-04-2024]
కుప్పం పట్టణం, న్యూస్టుడే: ‘వైనాట్ కుప్పం అంటూ.. 2022 సెప్టెంబరు 23న ప్రతిపక్ష నాయకుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో పర్యటించిన సీఎం జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందుల్లా కుప్పాన్ని చూస్తానని హామీ ఇచ్చారు. -
అయ్యోర్లపై అధికార బెత్తం
[ 29-04-2024]
చిత్తూరు గ్రామీణ మండలం మాపాక్షి జడ్పీ ఉన్నత పాఠశాలను ఇటీవల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాష్ తనిఖీ చేశారు. ఆ సమయంలో ఏడో తరగతిలో విద్యార్థులతో ఆయన మాట్లాడారు. -
ఇదేం పని మురుగేషా!
[ 29-04-2024]
బోధనారంగంలో ఉత్తమ ప్రతిభకనబరిచిన ఆ ఉపాధ్యాయుడికి 2007-08 విద్యాసంవత్సరంలో జిల్లాస్థాయి అవార్డు దక్కింది. దీనిపై స్పందించిన మండల ప్రజాప్రతినిధులు.. కుటుంబ సభ్యుల పేరుతో మూడు ఇంటి పట్టాలు అందించారు. -
అయ్యా.. ఐదేళ్లూ చాలలేదా..?
[ 29-04-2024]
ఒక ప్రాంత అభివృద్ధికి రహదారులు, అద్భుతమైన కట్టడాలే కొలమానం. అలాంటిది చిత్తూరు నగరంలో రహదారులు అధ్వానంగా మారాయి. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు నానా కష్టాలు పడుతున్నారు. -
‘అరాచక పాలనకు అంతం పలకండి’
[ 29-04-2024]
వైకాపా అరాచక పాలనకు అంతం పలికేందుకు ఎన్నికల రూపంలో అవకాశమొచ్చిందని, ప్రజలు మే 13న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి తెదేపా కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు దగ్గుమళ్ల ప్రసాదరావు, గురజాల జగన్మోహన్ కోరారు. -
ఏం జరుగుతోంది భగవం‘తుడా’!
[ 29-04-2024]
తుడా.. ఈ పేరెత్తితే చాలు జిల్లా ప్రజల మెదళ్లు గిర్రున తిరుగుతాయి.. వందల అనుమానాలు తలెత్తుతాయి. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా)ను ఒకే ఒక వ్యక్తి తన అమ్ములపొదిగా.. రహస్య స్థావరంగా మార్చేశారంటే అతిశయోక్తి కాదు.. ఆయనే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి. -
దోపిడీలు చేయడంలో డిగ్రీలు
[ 29-04-2024]
ఇతరులను బెదిరించి డబ్బులు వసూలు చేయడంలో స్థానిక ఎమ్మెల్యే డిగ్రీలు చేశారని సినీనటుడు నందమూరి బాలకృష్ణ ఆరోపించారు. నియోజకవర్గంలో ఇసుక, గ్రావెల్ మాఫియా రాజ్యమేలుతున్నారని ఆయన అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం
-
సొంతగడ్డపై చెలరేగిన కోల్కతా.. దిల్లీపై ఘన విజయం
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM