జగనాసుర రాజ్యం.. అరాచకాలకు ఆజ్యం
వైకాపా అధికారంలోకి వచ్చాక అచ్చంగా ఇలా కాకపోయినా కాస్త అటూఇటూగా రాష్ట్రంలో, జిల్లాలో ఇటువంటి పరిణామాలే జరుగుతున్నాయి.
ఉమ్మడి జిల్లాలో అక్రమాలు, వేధింపులు, కక్షలు
ప్రజలకు ప్రశాంతత కరవు
నిత్యం బాదుడే.. బాధితుడు సామాన్యుడే
ఈనాడు, చిత్తూరు
‘ఒరేయ్ బావమరిది నా రాజ్యం రామరాజ్యం.. ఇక్కడ హత్యలు, రౌడీయిజం ఉండవు. మాట వినకుంటే కదరా హత్య చేయాలి. ఎవరైనా ఇవ్వనంటే కదరా రౌడీయిజం చేయాలి’
- ఓ సినిమాలో పక్కనే ఉన్న వ్యక్తితో విలన్ చెప్పేమాటలివి.
వైకాపా అధికారంలోకి వచ్చాక అచ్చంగా ఇలా కాకపోయినా కాస్త అటూఇటూగా రాష్ట్రంలో, జిల్లాలో ఇటువంటి పరిణామాలే జరుగుతున్నాయి. 2019 ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి జగన్ ప్రతి ప్రచార సభలో రామరాజ్యం తెస్తానని.. ప్రజలకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూస్తానని ఊదరగొట్టారు. జిల్లాకు వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఇవే సుభాషితాలు వల్లించారు. తీరా అయిదేళ్ల పాలనను ఓసారి వెనక్కు తిరిగి చూసుకుంటే రామరాజ్యాన్ని పక్కన పెడితే రాష్ట్రంలో రావణకాష్టం రగులుతోంది. జగన్ జగనాసురుడిలా మారిపోయారు. జిల్లాలో ఆయన పార్టీ గణం అరాచకాలకు ఆజ్యం పోసింది. నేడు శ్రీరామనవమి సందర్భంగా జగన్, ఆయన పార్టీ నేతలు చెప్పిన మాటలు, ఇప్పుడున్న పరిస్థితులను ఒక్కసారి అవలోకనం చేసుకుందాం.
కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడనని చెప్పి
వనవాసంలో ఉన్న రాముడిని వెతు క్కుంటూ భరతుడు అడవికి వెళ్తాడు. రాజ్యంలో అసమానతలు ఉండకూడదని హితబోధ చేస్తాడు రాముడు. భరతుడు అలాగే రాజ్యమేలుతాడు. సీఎం జగన్ సైతం గత ఎన్నికల్లో కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా పాలన సాగిస్తానని వాగ్దానం చేశాడు. ముఖ్య మంత్రి పీఠం ఎక్కాక వాటిని మరిచి పోయారు. పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలో ఆవులపల్లె ప్రాంతంలోనే రిజర్వాయర్ నిర్మించడానికి ప్రధానంగా ఒక్క కారణమే ఉంది. ఓ సామాజికవర్గం ఓటర్లు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. వారు ప్రతిసారీ తనకు ఓటేయడం లేదన్నది స్థానిక ఎమ్మెల్యే భావన. ఈ నేపథ్యంలో అక్కడ జలా శయం కడితే వారంతా నిర్వాసితులై చెట్టుకొకరు పుట్టకొకరు అన్నవిధంగా వెళతారనే పనులకు శ్రీకారం చుట్టారు. పదవులు, అధికారులు, పోలీసుల్లో సీఎం జగన్ సామాజిక వర్గం వారినే నియమించుకున్నారు.
పన్నుల భారం ఉండదని హామీ ఇచ్చి
జనాలపై భరించలేనంతగా పన్నులు వేయకూడదని భరతుడికి రాముడు ఉపదేశించాడు. ఎన్నికలకు ముందు జగన్ అప్పటి అధికార తెలుగుదేశాన్ని పన్నుల విషయమై తూర్పారబట్టారు. తీరా సీఎం అయ్యాక ఆస్తి, చెత్త పన్ను, విద్యుత్తు, బస్సు, ఇంధన, నిత్యావసరాలతో మోత మోగించారు. ఉమ్మడి జిల్లాలో నాలుగున్నరేళ్లలో విద్యుత్తు బిల్లుల భారమే అదనంగా రూ.వెయ్యి కోట్లు పడింది.
బీళ్లుగా పొలాలు
అధికారంలోకొస్తే సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తానని చెప్పిన జగన్ భిన్నంగా వ్యవహరించారు. గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులు పడకేశాయి. 58 నెలల్లో ఒక్క ఎకరాకూ నీరివ్వలేదు.
శాంతి భద్రతలు గాలికి
శాంతి భద్రతలు కరవైన చోట జనం ప్రభువులను గౌరవించరని భరతుడికి రాముడు తెలిపాడు. రాష్ట్రంలో జగన్ శాంతి భద్రతలను గాలికొదిలేశారు. సామాన్యులు, ప్రతిపక్ష, సొంత పార్టీలోని అసమ్మతి నాయకులను వేధించడమే పనిగా పెట్టుకున్నారు. శాంతిపురం మండలం మొరసనపల్లెలో స్థానిక సర్పంచి భార్య నీలా.. అధికార పార్టీ నాయకుడి భూ ఆక్రమణను వ్యతిరేకించినందుకు సామాజిక మాధ్యమాల్లో ఆ పార్టీ వ్యక్తులే అనుచితంగా పోస్టులు పెట్టి క్షోభ పెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పింఛను పంచన.. నయా వంచన
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికల ముంగిట ముఖ్యమంత్రి జగన్, ఆయన ప్రభుత్వంలోని అధికారులు పండుటాకులను ఇబ్బంది పెట్టేందుకు మరో వికృత క్రీడకు తెరలేపారు. -
జన, ధన, మాన చోరుడు జగన్..
[ 30-04-2024]
‘ఒక్క అవకాశం అంటూ గద్దెనెక్కిన జగన్మోహన్రెడ్డి.. రాష్ట్ర ప్రగతిని గోతిలో పాతిపెట్టాడు. రూ.లక్షల కోట్లు హాంఫట్ చేసి రాష్ట్ర ప్రజల నెత్తిన అప్పుల భారం మోపాడు. -
వారాంతపు సెలవులు హుష్ఖాకీ
[ 30-04-2024]
జిల్లాలో ఆధ్యాత్మిక కేంద్రాలు ఉండటంతో వీఐపీల తాకిడి అధికంగా ఉంటుంది.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, పలు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులతో పాటు వివిధ రాష్ట్రాల సీఎంలు, మంత్రులు తరచూ తిరుమల, కాణిపాకం, శ్రీకాళహస్తి, అరగొండ ఆలయాలను సందర్శిస్తుంటారు.. -
సదుంలో రణరంగం
[ 30-04-2024]
బీసీవైసీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్.. మంత్రి పెద్దిరెడ్డి స్వగ్రామం యర్రాతివారిపల్లెలో చేపట్టిన ప్రచారం ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీశాయి. -
రూ. 5 కోట్ల పనులు.. ఐదేళ్లూ విస్మరించారు
[ 30-04-2024]
త్రిరాష్ట్ర కూడలిలో శుభకార్యాలు, సమావేశాలు, సదస్సులు నిర్వహణకు సరైన వేదిక లేక ఇబ్బందులుండేవి. -
పోరు.. ఖరారు
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టం పూర్తయింది. బరిలో నిలిచింది ఎందరో తేలిపోయింది. మరోవైపు తుది, అనుబంధ ఓటర్ల జాబితాలు ఖరారయ్యాయి. -
వనితే నిర్ణేత..!
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల విజయాన్ని మహిళలు నిర్ణయించనున్నారు. జిల్లా పరిధిలో 25వ తేదీ నాటికి మొత్తం 18,12,980 ఓటర్లు ఉన్నారు. -
ఓటుకొస్తే అమ్మ.. జీతాలకొస్తే ఆ..యమ్మ
[ 30-04-2024]
కాలే కడుపులు.. అర్ధాకలితో ఉన్నా తమకు అప్పజెప్పిన పనులు పూర్తిచేయడంలో ఆయాలు ముందుంటారనడంలో సందేహం లేదు. -
తిరుమల పవిత్రతను మంటగలిపారు
[ 30-04-2024]
శ్రీవారి దర్శనం టికెట్ల ధరను విపరీతంగా పెంచేసి తిరుమలకు వచ్చే భక్తులను గత ఐదేళ్లలో దోచుకున్నారని ఎన్డీయే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఆరోపించారు. -
వైకాపా ప్రచారానికి అనుమతులేవీ?
[ 30-04-2024]
వడ్డించేవాడు మనవాడైతే.. చాలన్న చందాన తిరుపతిలో వైకాపా, పోలీసుల తీరు కొనసాగుతోంది. -
ఆలయంలో అధికార పార్టీ ప్రచారం
[ 30-04-2024]
పట్టణంలోని బజారువీధి రామమందిరంలో సోమవారం రాత్రి అధికార పార్టీ అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ప్రచారం చేపట్టారు. -
బ్యాంకు ఖాతాల్లేకుంటే ఇంటి వద్దే పింఛన్ పంపిణీ: కలెక్టర్
[ 30-04-2024]
సామాజిక భద్రత పింఛన్ల పంపిణీని మే ఒకటిన రెండు పద్ధతుల్లో చేపట్టనున్నామని కలెక్టర్ షన్మోహన్ తెలిపారు. -
బ్యాండేజ్ వేసుకుని వినూత్నంగా ఎన్నికల ప్రచారం
[ 30-04-2024]
ఎన్నికల్లో సానుభూతి పొందాలని సీఎం జగన్ ఆడిన గులకరాయి డ్రామాను ప్రజలు నమ్మేస్థితిలో లేరని తెదేపా, జనసేన నాయకులు ఎద్దేవా చేశారు. -
కోర్టులో కేసున్నా.. రోడ్డు నిర్మాణం
[ 30-04-2024]
మండలంలోని ముడిపల్లి పంచాయితీలోని వెంగన్న కండ్రిగ ఎస్టీకాలనీ వద్ద వైకాపా నాయకులు దౌర్జన్యంగా రోడ్డు వేస్తున్నారని గ్రామస్థులు సోమవారం ఆరోపించారు. -
ఇద్దరు వాలంటీర్లపై వేటుకు సిఫార్సు
[ 30-04-2024]
ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రచారంలో పాల్గొన్న ఇద్దరు వాలంటీర్లపై చర్యలకు ఉన్నతాధికారులకు సిఫార్సు చేశామని ఎంపీడీవో వరప్రసాద్ తెలిపారు. -
చీటీల మోసం కేసులో నిందితుడికి తొమ్మిదేళ్ల జైలు
[ 30-04-2024]
చీటీల పేరుతో మోసానికి పాల్పడిన కేసులో నిందితుడికి తొమ్మిదేళ్ల జైలు శిక్ష విధిస్తూ సోమవారం స్థానిక జిల్లా ప్రధాన సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి భీమారావు సోమవారం తీర్పు చెప్పారు. -
కమ్యూనిటీ హాలులో వైకాపా నాయకుల సమావేశం?
[ 30-04-2024]
తిరుమలలో కూటమి అభ్యర్థి ఎన్నికల ప్రచారం నేపథ్యంలో అదే సమయంలో వైకాపా తిరుమల విభాగం అధ్యక్షుడు చిన్నముని ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి స్థానిక కమ్యూనిటీ భవనంలో సమావేశమయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!