logo

అభినయ్‌ ఓటమి ఖాయం: పవన్‌ కల్యాణ్‌

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ బుధవారం మంగళగిరిలోని కార్యాలయంలో ఆ పార్టీ అభ్యర్థులకు బి-ఫారాలు అందించారు. ఎన్డీయే తిరుపతి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు అందులో ఉన్నారు.

Published : 18 Apr 2024 02:16 IST

పవన్‌ కల్యాణ్‌ నుంచి బి-ఫారం అందుకుంటున్న ఆరణి శ్రీనివాసులు

తిరుపతి (బైరాగిపట్టెడ), న్యూస్‌టుడే: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ బుధవారం మంగళగిరిలోని కార్యాలయంలో ఆ పార్టీ అభ్యర్థులకు బి-ఫారాలు అందించారు. ఎన్డీయే తిరుపతి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు అందులో ఉన్నారు. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ తిరుపతిలో కొండను దోచేసిన తండ్రిని, కార్పొరేషన్‌లో నిధులను ఖాళీ చేసిన కొడుకును ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో సమర్థించరని, అభినయ్‌ ఓటమిని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. వైకాపా ఘోరపరాజయం మూటకట్టుకోవడం ఖాయమని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని