మరో 28,853 మందికి ఓటు హక్కు
జిల్లాలోని కాకినాడ పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికలకు ఈ నెల 18 నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
కాకినాడ కలెక్టరేట్, న్యూస్టుడే: జిల్లాలోని కాకినాడ పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికలకు ఈ నెల 18 నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అదే రోజు నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 15 వరకు అర్హత ఉన్నవారందరికి ఓటు హక్కు కల్పించేందుకు ఫారం-6 దరఖాస్తులు స్వీకరించారు. కాకినాడ జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి తుది ఓటర్ల జాబితాను ఈ ఏడాది జనవరి 22న విడుదల చేశారు. 2024, జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు, ఇప్పటి వరకు అర్హత ఉన్నా ఓటు నమోదు చేసుకోని వారికి కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసే అవకాశం కల్పించారు. దీనిలో భాగంగా జనవరి 22 తర్వాత ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటు కోసం 43,354 మంది దరఖాస్తు చేశారు. మంగళవారం మధ్యాహ్నం వరకు వీటిలో 28,853 మంది దరఖాస్తుదారులకు కొత్తగా ఓటు హక్కు కల్పించారు. 7,622 దరఖాస్తులు తిరస్కరించారు. ఇంకా 6,879 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఈ నెల 20 నాటికి ఏడు నియోజకవర్గాల ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు(ఈఆర్వో) వీటిని పరిష్కరించనున్నారు. ఇలా కొత్తగా ఓటు హక్కు పొందిన వారు వచ్చేనెల 13న జరుగున్న ఎన్నికల పోలింగ్లో ఓటేసే అవకాశం కల్పించనున్నారు.
కాకినాడ గ్రామీణంలో అత్యధిక దరఖాస్తులు
జిల్లాలో జవనరి 22 నుంచి ఈ నెల 14 వరకు కొత్తగా ఓటు హక్కు కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తే.. కాకినాడ గ్రామీణం, కాకినాడ నగరం, పిఠాపురం నియోజకవర్గాల్లో అత్యధిక దరఖాస్తులు దాఖలయ్యాయి. జనసేన అధినేత పవన్కల్యాన్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో 18-19 ఏళ్ల యువత 7,497 మంది ఓటు కోసం దరఖాస్తు చేయగా, ఇప్పటికి 4,908 మందికి ఓటు హక్కు కల్పించగా.. 1,394 తిరస్కరించారు. ఇంకా 1,195 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. నియోజకవర్గాల వారీగా ఇలా..
నియోజకవర్గాల వారీగా ప్రస్తుత ఓటర్లు..
జనవరి 22 నుంచి ఈ నెల 16 వరకు ఈ నియోజకవర్గాల్లో పెరిగిన ఓట్లను పరిశీలిస్తే.. అత్యధికంగా కాకినాడ గ్రామీణంలో 6,701, పిఠాపురంలో 5,092, కాకినాడ నగరంలో 4,121, జగ్గంపేటలో 3,625, తునిలో 2,878, పెద్దాపురంలో 2,621, ప్రత్తిపాడులో 2,296 మంది చొప్పున ఓటర్లు పెరిగారు.
ఎన్నికల పరిశీలకుల నియామకం
కాకినాడ కలెక్టరేట్, న్యూస్టుడే: కాకినాడ జిల్లాకు ఎన్నికల పరిశీలకులను నియమించారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. వ్యయ పరిశీలకులుగా ఐఆర్ఎస్ అధికారులు సాధిక్ అహ్మద్, ఆశిన్, యోగేశ్కుమార్ను, సాధారణ పరిశీలకులుగా ఐఏఎస్ అధికారులు ఎస్.గణేశ్, రాజేశ్జోగేశ్పాల్ను నియమించారు. ఈ నెల 18లోగా వ్యయ పరిశీలకులు జిల్లాలో రిపోర్టు చేయాలని ఆదేశించిడంతో వీరు బుధవారం జిల్లాకు రానున్నట్లు కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పవన్ రోడ్షో.. 6 గంటలు.. 40 కి.మీ.
[ 30-04-2024]
భగభగమండే ఎండలో పూల జల్లులు కురిశాయి.. బాణసంచా కాల్పులతో పట్టపగలే ధగధగ మెరుపులు మెరిశాయి.. -
అన్నయ్యా.. బైకు అమ్మి అప్పులు తీర్చండి
[ 30-04-2024]
‘అన్నయ్యా అమ్మా, నాన్నలను జాగ్రత్తగా చూసుకో.. నేను వెళ్తున్నా’ అంటూ చరవాణిలో తన అన్నకు ఓ యువకుడు చివరి మాటలు చెప్పి బలవన్మరణానికి పాల్పడిన ఘటన నల్లజర్ల మండలం అనంతపల్లి సైఫాన్ వంతెనపై పోలవరం కుడికాలువ వద్ద సోమవారం చోటుచేసుకుంది. -
నాడు ఊదరగొట్టారు.. నేడు ఉసురు తీస్తున్నారు
[ 30-04-2024]
సామాజిక భద్రత పింఛన్లు తీసుకునే విషయంలో ఈసారి కూడా లబ్ధిదారులు ఇబ్బందులు పడే పరిస్థితిని ప్రభుత్వం కల్పించింది. గతనెల గంటల తరబడి సచివాలయాల వద్ద వారిని పడిగాపులు పడేలా చేసిన విషయం తెలిసిందే. -
పోలీసులపైనా కపట ప్రేమే
[ 30-04-2024]
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్ పోలీసు సంక్షేమాన్ని అటకెక్కించారు. నిత్యం పోలీసు బందోబస్తు మధ్య తిరిగే ఆయన వారి కష్టాన్ని పట్టించుకోలేదు. -
వైకాపా పాలనలో 20 ఏళ్లు వెనక్కు
[ 30-04-2024]
మోదీకి దత్తపుత్రుడిగా వ్యవహరిస్తున్న సీఎం జగన్.. వైఎస్ రాజశేఖర్రెడ్డి రాజకీయ వారసుడు ఎలా అవుతారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం కల్పించాలి
[ 30-04-2024]
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అత్యంత కీలకమని, ప్రతిఒక్క ఓటరు స్వేచ్ఛగా, నిర్భయంగా తమ హక్కును వినియోగించుకునే వాతావరణ కల్పించేలా చూడాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థపై ఉందని రాష్ట్ర ఎన్నికల పోలీసు పరిశీలకుడు దీపక్మిశ్రా అన్నారు. -
గాలికొదిలేశారు.. అయిదేళ్లు గడిపేశారు
[ 30-04-2024]
పేదలే ప్రాణమంటారు. వైద్య సేవల్లో ప్రభుత్వం పెద్ద పీట వేసిందంటారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ప్రగల్భాలు చెబుతారు. -
ప్రజల కష్టాలు తీరేది కూటమితోనే..
[ 30-04-2024]
బటన్లు నొక్కే జగన్మోహన్రెడ్డిని ప్రజలందరూ వచ్చే ఎన్నికల్లో రెండు బటన్లు నొక్కి ఇంటికి సాగనంపాలని వంగవీటి రాధాకృష్ణ అన్నారు. -
రూ.6 కోట్ల బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం
[ 30-04-2024]
రావులపాలెం మండలం గోపాలపురం చెక్ పోస్టు వద్ద సోమవారం ఎటువంటి పత్రాలు లేకుండా లాజిస్టిక్ వాహనంలో తరలిస్తున్న 9.530 కేజీల బంగారం, 1.871 కేజీల వెండి వస్తువులను ఎస్ఎస్టీ బృందం, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
భట్నవిల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం
[ 30-04-2024]
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం భట్నవిల్లిలో ఆదివారం రాత్రి 11.50 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. -
అతివే నిర్ణేత.. నేతలరాత..!
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికలు 2024లో నాయకుల తలరాతను అతివలే నిర్ణయించనున్నారు. ఇంతులు మెచ్చినవారికే పదవులు దక్కనున్నాయి. -
ఓడించలేమా ఒంటి చేత..!
[ 30-04-2024]
అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా మన ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మహిళా దినోత్సవం ముందురోజే వైఎస్ఆర్ చేయూత ద్వారా సాయం అందించడం ఎంతో సంతోషం కలిగిస్తోంది. -
సర్కారు జాగా.. ప్రైవేటు పాగా..!
[ 30-04-2024]
ప్రభుత్వ భూములను సంరక్షించాల్సిన అధికారులు వాటిని విస్మరించడంతో ప్రైవేటు వ్యక్తులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరు అమలాపురం మండలం ఈదరపల్లిలో చోటుచేసుకుంటోంది. -
ప్రగల్భాలే.. పైసా విదల్చలే..
[ 30-04-2024]
అర్థ దశాబ్దంగా ఎదురూచూస్తు వచ్చిన ఏలేరు ఆధునికీకరణ పనులకు జగన్ ప్రభుత్వం మోకాలడ్డింది. గత ప్రభుత్వంలో ఏలేరుపై సాగునీటి నిర్మాణాలకు ఖర్చుచేసిన సుమారు రూ.97 కోట్లు నిష్ప్రయోజనంగా మారాయి. -
గుర్తుల గందరగోళం
[ 30-04-2024]
జనసేనకు కేటాయించిన గాజు గ్లాసు గుర్తును ఇతర పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులకు సైతం కేటాయించడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.