రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈనెల 18 నుంచి ప్రారంభమవుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత తెలిపారు.
కలెక్టరేట్లో ప్రారంభించిన మీడియాసెల్ విభాగాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్, ఎస్పీ, జేసీ, ఇతర అధికారులు
రాజమహేంద్రవరం కలెక్టరేట్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈనెల 18 నుంచి ప్రారంభమవుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత తెలిపారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సెల్ను మంగళవారం ప్రారంభించిన అనంతరం ఎస్పీ జగదీష్, జేసీ తేజ్భరత్, డీఆర్వో నరసింహులు, పార్లమెంట్ నియోజకవర్గ సహాయ రిటర్నింగ్ అధికారి ఎం.కృష్ణనాయక్తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో రిటర్నింగ్ అధికారులు 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారని, అదేరోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమై 25 వరకు కొనసాగుతుందన్నారు. 21వ తేదీ ఆదివారం మినహా మిగతా రోజుల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. ఎంపీ అభ్యర్థుల నుంచి కలెక్టర్ ఛాంబర్లోను, ఎమ్మెల్యే అభ్యర్థుల నుంచి ఆయా రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో నామినేషన్ పత్రాలు స్వీకరిస్తామన్నారు. నామినేషన్ వేసే వ్యక్తితో పాటు మరో నలుగురిని మాత్రమే ఆర్వో ఛాంబర్లోకి అనుమతిస్తామని కలెక్టర్ తెలిపారు.
- 187 ప్రాంతాల్లో 1,577 పోలింగ్ కేంద్రాలు: మే 13న జరిగే పోలింగ్కు 187 ప్రాంతాల్లో మొత్తం 1,577 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. వీటిలో 181 ప్రదేశాల్లోని 367 కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించా మన్నారు. 9,644 మంది సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు.
- గృహ ఓటింగ్కు కార్యాచరణ సిద్ధం: ఈ నెల 10 నాటికి జిల్లాలో 16,16,918 మంది ఓటర్లు ఉన్నారన్నారు. వీరిలో 85 ఏళ్లు పైబడిన, 40 శాతం పైబడి అంగవైకల్యమున్న వారు 28,010 మంది ఉన్నారని, వీరికి హోం ఓటింగ్ అవకాశం కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. వీరినుంచి ఫారం-12డి దరఖాస్తులను ఈ నెల 22 వరకు స్వీకరిస్తామన్నారు.
- కోడ్ ఉల్లంఘనలపై 481 ఫిర్యాదులు: సి-విజిల్ ద్వారా కోడ్ ఉల్లంఘనలపై 481 ఫిర్యాదులు రాగా 382 పరిష్కరించామని, 99 ఉపసంహరించామన్నారు. కేంద్ర ప్రభుత్వ సేవా పోర్టల్ ద్వారా 312 ఫిర్యాదులు అందాయన్నారు. కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి 46 మంది ఉద్యోగులపై చర్యలు తీసుకున్నామన్నారు. 1,796 మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్లు తెలిపారు. సువిధా, ఎన్కోర్ ద్వారా ప్రచార అనుమతులకు 597 దరఖాస్తులు రాగా వీటిలో 505 వాటికి అనుమతి ఇచ్చామని, 63 తిరస్కరించగా మిగతా 29 పరిశీలనలో ఉన్నాయన్నారు.
- 6,006 మంది బైండోవర్: ఎస్పీ జగదీష్: ఇప్పటివరకు 6,006 మందిని బైండోవర్ చేసినట్లు ఎస్పీ పి.జగదీష్ తెలిపారు. జిల్లాలో 236 లైసెన్స్ ఆయుధాలు ఉండగా వీటిలో 177 డిపాజిట్ చేశారన్నారు. 8 చెక్పోస్టులలకు అదనంగా మరో ఎనిమిది ఏర్పాటు చేశామన్నారు. రూ.5.41 కోట్ల మేర నగదు, మద్యం, మాదకద్రవ్యాలు వంటివి సీజ్ చేశామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పవన్ రోడ్షో.. 6 గంటలు.. 40 కి.మీ.
[ 30-04-2024]
భగభగమండే ఎండలో పూల జల్లులు కురిశాయి.. బాణసంచా కాల్పులతో పట్టపగలే ధగధగ మెరుపులు మెరిశాయి.. -
అన్నయ్యా.. బైకు అమ్మి అప్పులు తీర్చండి
[ 30-04-2024]
‘అన్నయ్యా అమ్మా, నాన్నలను జాగ్రత్తగా చూసుకో.. నేను వెళ్తున్నా’ అంటూ చరవాణిలో తన అన్నకు ఓ యువకుడు చివరి మాటలు చెప్పి బలవన్మరణానికి పాల్పడిన ఘటన నల్లజర్ల మండలం అనంతపల్లి సైఫాన్ వంతెనపై పోలవరం కుడికాలువ వద్ద సోమవారం చోటుచేసుకుంది. -
నాడు ఊదరగొట్టారు.. నేడు ఉసురు తీస్తున్నారు
[ 30-04-2024]
సామాజిక భద్రత పింఛన్లు తీసుకునే విషయంలో ఈసారి కూడా లబ్ధిదారులు ఇబ్బందులు పడే పరిస్థితిని ప్రభుత్వం కల్పించింది. గతనెల గంటల తరబడి సచివాలయాల వద్ద వారిని పడిగాపులు పడేలా చేసిన విషయం తెలిసిందే. -
పోలీసులపైనా కపట ప్రేమే
[ 30-04-2024]
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్ పోలీసు సంక్షేమాన్ని అటకెక్కించారు. నిత్యం పోలీసు బందోబస్తు మధ్య తిరిగే ఆయన వారి కష్టాన్ని పట్టించుకోలేదు. -
వైకాపా పాలనలో 20 ఏళ్లు వెనక్కు
[ 30-04-2024]
మోదీకి దత్తపుత్రుడిగా వ్యవహరిస్తున్న సీఎం జగన్.. వైఎస్ రాజశేఖర్రెడ్డి రాజకీయ వారసుడు ఎలా అవుతారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం కల్పించాలి
[ 30-04-2024]
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అత్యంత కీలకమని, ప్రతిఒక్క ఓటరు స్వేచ్ఛగా, నిర్భయంగా తమ హక్కును వినియోగించుకునే వాతావరణ కల్పించేలా చూడాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థపై ఉందని రాష్ట్ర ఎన్నికల పోలీసు పరిశీలకుడు దీపక్మిశ్రా అన్నారు. -
గాలికొదిలేశారు.. అయిదేళ్లు గడిపేశారు
[ 30-04-2024]
పేదలే ప్రాణమంటారు. వైద్య సేవల్లో ప్రభుత్వం పెద్ద పీట వేసిందంటారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ప్రగల్భాలు చెబుతారు. -
ప్రజల కష్టాలు తీరేది కూటమితోనే..
[ 30-04-2024]
బటన్లు నొక్కే జగన్మోహన్రెడ్డిని ప్రజలందరూ వచ్చే ఎన్నికల్లో రెండు బటన్లు నొక్కి ఇంటికి సాగనంపాలని వంగవీటి రాధాకృష్ణ అన్నారు. -
రూ.6 కోట్ల బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం
[ 30-04-2024]
రావులపాలెం మండలం గోపాలపురం చెక్ పోస్టు వద్ద సోమవారం ఎటువంటి పత్రాలు లేకుండా లాజిస్టిక్ వాహనంలో తరలిస్తున్న 9.530 కేజీల బంగారం, 1.871 కేజీల వెండి వస్తువులను ఎస్ఎస్టీ బృందం, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
భట్నవిల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం
[ 30-04-2024]
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం భట్నవిల్లిలో ఆదివారం రాత్రి 11.50 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. -
అతివే నిర్ణేత.. నేతలరాత..!
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికలు 2024లో నాయకుల తలరాతను అతివలే నిర్ణయించనున్నారు. ఇంతులు మెచ్చినవారికే పదవులు దక్కనున్నాయి. -
ఓడించలేమా ఒంటి చేత..!
[ 30-04-2024]
అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా మన ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మహిళా దినోత్సవం ముందురోజే వైఎస్ఆర్ చేయూత ద్వారా సాయం అందించడం ఎంతో సంతోషం కలిగిస్తోంది. -
సర్కారు జాగా.. ప్రైవేటు పాగా..!
[ 30-04-2024]
ప్రభుత్వ భూములను సంరక్షించాల్సిన అధికారులు వాటిని విస్మరించడంతో ప్రైవేటు వ్యక్తులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరు అమలాపురం మండలం ఈదరపల్లిలో చోటుచేసుకుంటోంది. -
ప్రగల్భాలే.. పైసా విదల్చలే..
[ 30-04-2024]
అర్థ దశాబ్దంగా ఎదురూచూస్తు వచ్చిన ఏలేరు ఆధునికీకరణ పనులకు జగన్ ప్రభుత్వం మోకాలడ్డింది. గత ప్రభుత్వంలో ఏలేరుపై సాగునీటి నిర్మాణాలకు ఖర్చుచేసిన సుమారు రూ.97 కోట్లు నిష్ప్రయోజనంగా మారాయి. -
గుర్తుల గందరగోళం
[ 30-04-2024]
జనసేనకు కేటాయించిన గాజు గ్లాసు గుర్తును ఇతర పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులకు సైతం కేటాయించడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.