మామ బడాయి మాటలు..
నాడు-నేడు మొదటి విడత పనుల్లో మండలంలోని వాదాలకుంట మొదటి విడత పనులే ఇంకా..ఉన్నత పాఠø‹లలో ఆరు అదనపు గదులు మంజూరయ్యాయి. నిధులు కొరత కారణంగా వాటిని తగ్గించి నాలుగుకు తగ్గించారు
ఇదీ..నాడు-నేడు నిర్మాణాల తీరు
నాడు-నేడు పథకంలో ప్రభుత్వ పాఠశాలల రూపు పూర్తిగా మార్చేస్తాం.. పిల్లలకు మౌలిక వసతులు కల్పించేస్తాం.. ఇదీ సీఎం జగన్ మామ బడికోసం చెప్పే బడాయి మాటలు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే.. పూర్తికాని భవన నిర్మాణాలు.. వరండాల్లో తరగతులు.. విలీన పాఠశాలల్లో నిలిచిన పనులు.. అందుబాటులోకి రాని మరుగుదొడ్లు ఇవీ కనిపించే చిత్రాలు. నిధులు విడుదలకాక పలుచోట్ల పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. జిల్లావ్యాప్తంగా ఒక్కసారి
పరిశీలిస్తే..
గోపాలపురం: నాడు-నేడు మొదటి విడత పనుల్లో మండలంలోని వాదాలకుంట మొదటి విడత పనులే ఇంకా..ఉన్నత పాఠø‹లలో ఆరు అదనపు గదులు మంజూరయ్యాయి. నిధులు కొరత కారణంగా వాటిని తగ్గించి నాలుగుకు తగ్గించారు. రూ.30 లక్షల నిధులు మంజూరైనట్లు అప్పట్లో అధికారులు చెప్పారు. నాలుగేళ్లుగా నిర్మాణ పనులు ఆగుతూ.. ఇప్పటికి చివరిదశకు చేరాయి.
బాలబాలికలకు ఒకటే మరుగుదొడ్డి
నల్లజర్ల: మండలంలోని పలుచోట్ల నాడు-నేడు పనులు నిధులురాక నిలిచిపోయాయి. మారెళ్లమూడి ప్రాథమికోన్నత పాఠశాలలో రెండు గదుల నిర్మాణం సగంలోనే ఆగిపోగా, అనంతపల్లి జిల్లా ఉన్నత పాఠశాలలో రెండు గదుల నిర్మాణం స్లాబ్ దశలో నిలిచిపోయింది. కొండాయిగుంట పాఠశాలలో విద్యార్థినుల మరుగుదొడ్లకు టైల్స్ అతికించక పోవడంతో తాత్కాలికంగా విద్యార్థినీ విద్యార్థులు ఒకే మరుగుదొడ్డి వినియోగించుకుంటున్నారు. నిధులు రాకపోవడంతో ఆర్వో ప్లాంట్ ట్యాంకును పాఠశాలలోని ఒక గదిలో దాచారు.
పరదాల చాటున ప్రయాస
సీతానగరం: సీతానగరం, వంగలపూడి ఉన్నత పాఠశాలల్లో 708 మంది విద్యార్థుల్లో 348 మంది బాలికలు. మరుగుదొడ్లు సరిగా లేక పరదాలు కట్టిన చోటనే కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. కట్టిన పరదాలు ఎండకు ఎండి, వానకు తడుస్తూ చిరిగిపోతున్నాయి. మళ్లీ దాతల సాయంతో కొత్తవి కొని కడుతున్నారు. ఈ పాఠశాలల్లోకి అడుగుపెడితే మాత్రం నాడు-నేడులో అభివృద్ధి పనులకు రూ.4 కోట్లు మంజూరు చేసినట్లు శిలాఫలకాలుంటాయి. కనీసం మరుగుదొడ్లు నిర్మాణం పూర్తిచేసేలా అవసరమైన నిధులు కూడా ప్రభుత్వం విదల్చలేదు.
గదుల నిర్మాణమెప్పటికో..
కొవ్వూరు పట్టణం: వేములూరు ప్రాథమికోన్నత పాఠశాలలో 153 మంది విద్యార్థులు చదువుతున్నారు. నాడు-నేడు పనులకు రూ.49 లక్షలు కేటాయించారు. ఇప్పటివరకు రూ.22 లక్షలు పనులవ్వగా ఇంకా రూ.7 లక్షలు విడుదల కావాల్సి ఉంది. పై అంతస్తులో రెండు తరగతి గదులను నిర్మించినా పనులు పూర్తి కాలేదు. ఎప్పటికి పూర్తవుతాయో అర్థం కాని పరిస్థితి.
8.. కాదు 4.. చివరకు మూడే
తాళ్లపూడి: తాళ్లపూడిలోని జడ్పీహెచ్ పాఠశాలలో నాడు-నేడు కింద మొదటి విడత నిధులతో 8 గదుల నిర్మాణానికి రూ.96 లక్షలు నిధులు కేటాయించారు. తర్వాత నిధులు తగ్గించి నాలుగు గదుల నిర్మాణానికి పనులు ప్రారంభించారు. తర్వాత మూడు గదులకే పరిమితం చేశారు. రూ.36 లక్షలతో పనులు చేపట్టారు. మిగిలిన మరో గదికి నిధులు రావాల్సి ఉంది. విద్యుత్తు పనులు నత్తనడకన సాగుతున్నాయి. సామగ్రి ఉపాధ్యాయుల గదిలో నిరుపయోగంగా ఉంది. కిటికీలు, తలుపులు పెట్టాల్సి ఉంది.
సిమెంట్ గడ్డ కట్టేసింది..
దేవరపల్లి: చిన్నాయిగూడెంలోని జడ్పీ పాఠశాలలో 13 అదనపు తరగతి గదులు మంజూరయ్యాయి. సిమెంట్, ఇసుక లేకపోవడంతో ఒకచోట స్లాబు స్థాయిలో, మరోచోట పునాది స్థాయిలో పనులు నిలిచిపోయాయి. ఎనిమిది నెలల క్రితం సిమెంట్ వచ్చినా గుత్తేదారుడు, విద్యాకమిటీ, హెచ్ఎంల నిర్లక్ష్యంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. నెలలు గడిచి సిమెంట్ బస్తాలు గడ్డలు కట్టాయి. కార్మికులు రాడ్డుతో బస్తాలు బద్దలు కొట్టి స్లాబుకి ఉపయోగించారు. మరోచోట పునాది స్థాయిలోనే పనులు నిలిచిపోయాయి.
అరకొర నిధులు..అసంపూర్తి నిర్మాణాలు
శ్యామలాసెంటర్: రాజమహేంద్రవరం నగరంలోని మెరకవీధి మున్సిపల్ ప్రాథమిక పాఠశాలకు నాడు-నేడులో సుమారు రూ.12.50 లక్షల నిధులు ఇస్తామన్నారు. అరకొర నిధులు మంజూరు కావటంతో వంటషెడ్ నిర్మాణం పూర్తికాలేదు. గదుల్లోని వారం క్రితం సిమెంటు గచ్చు పనులు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భవిష్యత్తు మనదే
[ 06-05-2024]
‘ఎన్నికలకు సరిగ్గా వారం ఉంది. మా ప్రసంగాలు వినండి. కూటమి మ్యానిఫెస్టో చదవండి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి’ అని పవన్కల్యాణ్ కోరారు. కాకినాడ జిల్లా తునిలోని గొల్ల అప్పారావు కూడలిలో వారాహి విజయభేరి బహిరంగ సభలో ఆదివారం సాయంత్రం ఆయన ప్రసంగించారు. -
అధర్మకర్తల మండలి
[ 06-05-2024]
జగనన్న పాలనలో పాలకవర్గాల(ధర్మకర్తల మండలి) సభ్యులు దేవస్థానం శ్రేయస్సు, భక్తుల సౌకర్యాలు కల్పించేలా పనిచేసింది అంతంతమాత్రమే. ఆలయ పాలకవర్గాలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయి. -
ప్రజాగళం.. సర్వం సన్నద్ధం
[ 06-05-2024]
సార్వత్రిక ఎన్నికల సమరం తుది దశకు చేరుతోంది. సోమవారం అగ్రనేతల సభతో రాజమహేంద్రవరం కళకళలాడనుంది. కడియం మండలం వేమగిరిలో జరిగే ప్రజాగళం బహిరంగ సభకు ప్రధాని మోదీ, -
ఇక్కడైనా గందరగోళం లేకుండా చూస్తారా?
[ 06-05-2024]
సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది, అత్యవసర సేవలు అందించే ఉద్యోగులకు సోమవారం నుంచి మూడు రోజుల పాటు పోస్టల్ బ్యాలెట్ నిర్వహించనున్నారు. -
నూతన భూహక్కు చట్టంపై జగన్ సర్కారునే ప్రశ్నించాలి
[ 06-05-2024]
ఏపీ నూతన భూహక్కు చట్టం అమలుపై జగన్మోహన్రెడ్డి సర్కారును ప్రశ్నించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి ఫురందేశ్వరి అన్నారు. రాజమహేంద్రవరంలో ఆదివారం ఆమె మాట్లాడుతూ నీతిఆయోగ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కేవలం సూచించిందన్నారు. -
పవన్ కల్యాణ్ను అసెంబ్లీకి పంపిద్దాం
[ 06-05-2024]
జనసేన అధినేత పవన్కల్యాణ్పై తన తండ్రి ముద్రగడ పద్మనాభం విమర్శలు చేయడాన్ని ఖండించిన ఆయన కుమార్తె బార్లపూడి క్రాంతి తాజాగా మరో వీడియో సందేశం విడుదల చేశారు. -
పోస్టల్ బ్యాలెట్లపై కాకినాడలో గందరగోళం
[ 06-05-2024]
కాకినాడలోని పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ వినియోగ కేంద్రం వద్ద ఆదివారం గందరగోళం నెలకొంది. పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసినా జాబితాలో పేర్లు లేకపోవడంతో ఎన్నికల విధుల్లో ఉన్న చాలామంది ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. -
ఓటేశాక.. వృద్ధులను వదిలేశారు..
[ 06-05-2024]
ఎన్నికల ముందు ప్రతిపక్షనేత హోదాలో పాదయాత్ర చేసిన జగన్ ఎన్నో హామీలు గుప్పించారు. అన్ని వర్గాలను మాటలతో మెప్పించి.. అనంతరం నిండా ముంచారు. -
మొదటి రోజు ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
[ 06-05-2024]
సార్వత్రిక ఎన్నికలు-2024 ప్రక్రియలో భాగంగా ఎన్నికల విధులకు హాజరయ్యే ఉద్యోగులకు నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ మొదటి రోజు ఆదివారం చిన్నపాటి సంఘటన మినహా ప్రశాంతంగా జరిగింది. -
అగ్నిసాక్షిగా.. పరిహారానికి ఎగనామం..!
[ 06-05-2024]
అనుకోకుండా అగ్ని ప్రమాదాలతో రోడ్డునపడుతున్న కుటుంబాలకు వైకాపా ప్రభుత్వం మొండిచేయే చూపుతోంది. బహిరంగ సమావేశాల్లో ప్రజాప్రతినిధులు పేదలపై కపట ప్రేమ ఒలకబోస్తున్నారు. -
జీవితాలు మార్చేవారికీ జీతాల్లేవ్..!
[ 06-05-2024]
వైకాపా పాలనలో ప్రభుత్వ ఉద్యోగులేకాదు.. ఒప్పంద, పొరుగు సేవల్లో విధులు నిర్వహిస్తున్న చిరుద్యోగులు కూడా వేతనాలు సకాలంలో అందక, కుటుంబ పోషణ జరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
జగన్ జమానాలో.. అంపశయ్యపై ఆరోగ్యశ్రీ
[ 06-05-2024]
క్షేత్రస్థాయిలో ఆరోగ్యశ్రీ పథకం పరిస్థితి దయనీయంగా ఉంది. నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం లేదు. రూ.కోట్లల్లో బకాయిలు నెలల తరబడి ఇవ్వకపోవడంతో నిర్వాహకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. -
విపత్కర పాలనను సాగనంపడానికే కూటమి: పురందేశ్వరి
[ 06-05-2024]
రాష్ట్రంలోని విపత్కర పాలనను విచ్ఛిన్నం చేయడానికి కూటమి ఆవిర్భవించిందని కూటమి రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. -
జగన్ తెచ్చిన నల్లచట్టంపై తిరుగుబాటు చేయాలి: ముప్పాళ్ల
[ 06-05-2024]
రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజలు తిరుగుబాటు చేయాలని ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు, ఐఏఎల్ రాష్ట్ర అధ్యక్షులు ముప్పాళ్ల సుబ్బారావు పిలుపునిచ్చారు. -
మీడియా ప్రతినిధులకూ పోస్టల్ బ్యాలట్ అవకాశం
[ 06-05-2024]
జిల్లాలో పనిచేస్తున్న మీడియా ప్రతినిధులు తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలట్ ద్వారా వినియోగించుకునే వెసులుబాటును రాష్ట్ర ఎన్నికల సంఘం కల్పించినట్లు జిల్లా ఎన్నికల అధికారి కె.మాధవీలత ఆదివారం
తాజా వార్తలు (Latest News)
-
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
-
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!
-
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
-
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్