logo

పేదల సమస్యలపై పోరాడిన పుచ్చలపల్లి

పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలు, లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు అన్నారు. సుందరయ్య వర్ధంతి సందర్భంగా గురువారం సీపీఎం జిల్లా

Published : 20 May 2022 04:15 IST

సుందరయ్య చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న నాయకులు

లాడ్జిసెంటర్‌, న్యూస్‌టుడే : పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలు, లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు అన్నారు. సుందరయ్య వర్ధంతి సందర్భంగా గురువారం సీపీఎం జిల్లా కార్యాలయంలో సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ సుందరయ్య భూస్వామ్య కుటుంబంలో జన్మించి, పేదల సమస్యలపై పోరాటాలు చేశారన్నారు. పార్లమెంటు సభ్యుడిగా, శాసనసభ్యుడిగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారన్నారు. కమ్యూనిస్టు ఉద్యమంలో వచ్చిన అతివాద, మితవాద, విచ్ఛిన్నకర పోకడలకు వ్యతిరేకంగా పోరాడి సీపీఎం అభివృద్ధికి కృషి చేశారన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ రంగం జిల్లా కార్యదర్శి ఎమ్‌.కళాధర్‌, సీపీఎం నాయకులు బి.శ్రీనివాసరావు, చిస్టీ, వై.కృష్ణకాంత్‌, కల్యాణి, శంకర్‌, షకీలబేగం, ఆదినారాయణ తదితరలు పాల్గొన్నారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని