నదీ గర్భాన్ని తోడేస్తూ.. నిలువునా దోచేస్తూ
అనుమతులకు మించి అడ్డగోలుగా కృష్ణానదిలో ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయి. సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్ నివాసం ఉండే తాడేపల్లి మండలం గుండిమెడ నుంచి రేయింబవళ్లు ఇసుకను భారీ యంత్రాల ద్వారా తవ్వకాలు చేస్తూ భారీ వాహనాలతో తరలించుకుపోతున్నారు.
అధికార పార్టీ అండతో రెచ్చిపోతున్న ఇసుకాసురులు
చోద్యం చూస్తున్న అధికారులు
ఉద్దండరాయునిపాలెంలో ఇసుక నిల్వలు
తాడేపల్లి, న్యూస్టుడే: అనుమతులకు మించి అడ్డగోలుగా కృష్ణానదిలో ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయి. సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్ నివాసం ఉండే తాడేపల్లి మండలం గుండిమెడ నుంచి రేయింబవళ్లు ఇసుకను భారీ యంత్రాల ద్వారా తవ్వకాలు చేస్తూ భారీ వాహనాలతో తరలించుకుపోతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు అడ్డుకునే సాహసం చేయడం లేదు. అధికార పార్టీకి వారంతా దాసోహమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పర్యావరణానికి విఘాతం కలుగుతున్నా, భూగర్భ జలాలపై ప్రభావం పడుతున్న పట్టించుకోకుండా నదిలో భారీ గుంతలు తవ్వి మట్టి తరలిస్తున్నారు. పెద్ద గోతులు తవ్వడం వల్ల ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతోంది. మంగళగిరి, తాడేపల్లి నగర పరిధిలో ఉన్న ఇసుక క్వారీలో గత నెల 31తో అనుమతుల గడువు ముగిసింది. స్థానిక ఎమ్మెల్యే ఇసుక క్వారీలో తవ్వకాలపై ఒక్కసారి కూడా ఆరా తీసిన పాపానపోలేదు. దీంతో అక్రమార్కులకు స్థానిక ఎమ్మెల్యేలతోపాటు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అండదండలు ఉన్నాయనే ఆరోపణలు జోరందుకున్నాయి. మైనింగ్, విజిలెన్స్, పోలీసు, రెవెన్యూ అధికారులు క్వారీ వైపు వెళ్లేందుకే భయపడుతున్నారు. గతంలో గుండిమెడతో పాటు చిర్రావూరు, ప్రాంతూరు గ్రామాలకు చెందిన కార్మికులు పనిచేసి ఉపాధి పొందేవారు. కానీ ఆ పరిస్థితి నేడు కనిపించడం లేదు. దీంతో గత ఐదేళ్లుగా 500 మందిపైగా కార్మికులకు పనిలేకుండా పోయింది.
ఎంపీ అనుచరుల దందా.. : తుళ్లూరు, న్యూస్టుడే: రాజధాని గ్రామం ఉద్దండరాయునిపాలెం అక్రమార్కుల ఇసుక దందాలకు అడ్డాగా మారింది. ఇసుక రీచ్ల్లో నదీ గర్భానికి ప్రమాదం వాటిల్లేలా ఇష్టాను సారం తవ్వకాలు జరుపుతున్నారు. ఉద్దండరాయునిపాలెంలో రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రాంతానికి సమీపంలో ఇసుకను గుట్టలుగా నిల్వచేసి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల అనధికార చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అక్రమార్కులు ఇసుక రవాణాదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు స్థానికంగా చర్చ జోరుగా సాగుతోంది. పల్నాడు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం రీచ్ నుంచి నిత్యం తుళ్లూరు, పెదపరిమి మీదుగా అధిక లోడుతో లారీల్లో ఇసుక రవాణా సాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు
[ 29-04-2024]
ఏపీ, తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసింది. -
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
[ 29-04-2024]
ఐదేళ్ల జగన్ పాలనలో అంతా దోపిడీయేనని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. -
భర్త మద్దతుగా మాట్లాడలేదని వివాహిత ఆత్మహత్య
[ 29-04-2024]
కుటుంబంలో చోటుచేసుకున్న చిన్న గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు తాడికొండ మండలం బండారుపల్లి గ్రామానికి చెందిన చుండ్రు జయశ్రీ, ప్రత్తిపాడు మండలం గొట్టిపాడు గ్రామానికి చెందిన శివరామకృష్ణకు 10 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
ప్రశ్నిస్తే పగ.. స్వేచ్ఛకు సెగ
[ 29-04-2024]
ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడడానికీ వీల్లేదు. వారి అభిప్రాయాలను బహిరంగంగా పంచుకోవడాన్ని సహించరు. అయిదేళ్ల జగన్ పాలన అక్షరాలా ఇలాగే సాగింది. -
జగన్మోసకారి!
[ 29-04-2024]
బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ -
సమరానికి సైకిల్ యాత్రతో సంసిద్ధం
[ 29-04-2024]
ఎన్నికల సమరానికి సైకిల్ యాత్రతో సంసిద్ధమని గుంటూరు పశ్చిమ తెదేపా అభ్యర్థి గళ్లా మాధవి తెలిపారు. ‘ -
పదవిని అడ్డు పెట్టుకుని అక్రమ సంపాదన
[ 29-04-2024]
‘ఎమ్మెల్యే పదవి అడ్డుపెట్టుకుని ప్రకృతి సంపదను నాశనం చేసి ఏకంగా 700 ఎకరాల్లో గ్రావెల్ తవ్వి కిలారి రోశయ్య అక్రమ సంపాదన వెనకేసుకున్నారు. -
నేటితో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ
[ 29-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం సోమవారంతో ముగియనుంది. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు రిజిస్టర్ పార్టీలు, -
అర్ధరాత్రి దళిత మహిళల దుకాణాల కూల్చివేత
[ 29-04-2024]
పేద దళిత మహిళల దుకాణాలను శనివారం అర్ధరాత్రి కూలగొట్టించిన వైకాపా కార్పొరేటర్ అచ్చాల వెంకటరెడ్డిని అరెస్టు చేయాలని దళిత, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. -
‘అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి డిపాజిటర్లకు న్యాయం చేస్తాం’
[ 29-04-2024]
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి డిపాజిటర్లకు న్యాయం చేస్తామని యువనేత, మంగళగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. -
రూపు మారిన ఆస్తి దస్త్రం
[ 29-04-2024]
ఆస్తుల రిజిస్ట్రేషన్కు జగన్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొన్నినెలల క్రితం ‘కార్డు 2.0 ప్రైమ్ విధానం తీసుకొచ్చి ఆందోళనకు గురిచేసింది. -
జగనన్నా.. ఉపాధి ఏదన్నా..?
[ 29-04-2024]
యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన అంశాల్లో సీఎం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చెప్పిన మాటలకు, క్షేత్ర స్థాయిలో పని తీరుకు ఏ మాత్రం పొంతన లేదన్న విషయం పారిశ్రామిక శిక్షణ సంస (ఐటీఐ)ల పరిస్థితి చూస్తే అర్థమవుతోంది. -
డీఎస్సీ వేయలే.. ఒక్క టీచర్ ఉద్యోగమూ ఇవ్వలే!
[ 29-04-2024]
రాష్ట్రంలో 25 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మేం అధికారంలోకి రాగానే వాటన్నింటిని భర్తీ చేస్తాం. -
నా ఎస్సీలంటూనే.. నిలువునా మోసం
[ 29-04-2024]
ఎక్కడ మాట్లాడినా.. నా ఎస్సీలు.. నా ఎస్టీలు.. అంటూ ఎక్కడ లేని ప్రేమను మాటల్లో ఒలకబోసే జగన్.. వాస్తవంలోకి వచ్చేసరికి వారికి రిక్తహస్తాలే చూపారు. -
వారానికోసారే నీరు.. ఇదీ పాలన తీరు..
[ 29-04-2024]
గుంటూరు నగరపాలికలో విలీన గ్రామాలైన గోరంట్ల, రెడ్డిపాలెం, ప్రగతినగర్, మదర్థెరెసా నగర్లలో గుక్కెడు నీటి కోసం జనాలు నానా తంటాలు పడుతున్నారు. -
రూపు మారిన ఆస్తి దస్త్రం
[ 29-04-2024]
ఆస్తుల రిజిస్ట్రేషన్కు జగన్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొన్నినెలల క్రితం ‘కార్డు 2.0 ప్రైమ్ విధానం తీసుకొచ్చి ఆందోళనకు గురిచేసింది. -
గుంటూరు మీదుగా రైళ్లు
[ 29-04-2024]
విజయవాడ- ఖాజీపేట మార్గంలో ఇంజినీరింగ్ పనులు జరుగుతున్నందున పలు రైళ్లు గుంటూరు మీదుగా నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా ?
-
సీఎం రేవంత్ రెడ్డికి దిల్లీ పోలీసుల సమన్లు
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 900+, నిఫ్టీ 220+
-
దేవుడు న్యాయం పక్షానే ఉంటాడు: బ్రదర్ అనిల్
-
వీధి వ్యాపారిని కలిసిన మోదీ.. ఈ మోహిని గౌడ గురించి తెలుసా?
-
కెన్యాలో డ్యామ్ కూలి 40 మంది మృతి