అల్లరిమూకల అరాచకం..!
గుంటూరు జిల్లా పెదనందిపాడు స్టేషన్ పరిధిలో ఉప్పలపాడుకు చెందిన కొందరు యువకులతో కూడిన ఆకతాయిల గ్యాంగ్ ఒకటి స్థానికంగా దౌర్జన్యాలకు పాల్పడుతోంది. ఆ గ్రామం మీదుగా రాత్రిపూట ప్రయాణించే వాహనాలకు అడ్డుతగిలి వాహనదారుల్ని దుర్భాషలాడి కొట్టడం, గాయపరచటం వంటివి చేస్తున్నారు.
ఉప్పలపాడు మీదుగా రాత్రివేళ ప్రయాణించాలంటే వణుకే
తాజాగా ఓ కుటుంబాన్ని అడ్డగించి, దౌర్జన్యం
నిందితులపై కఠిన సెక్షన్లు పెట్టని పెదనందిపాడు పోలీసులు
ఈనాడు, అమరావతి, పెదనందిపాడు, న్యూస్టుడే: గుంటూరు జిల్లా పెదనందిపాడు స్టేషన్ పరిధిలో ఉప్పలపాడుకు చెందిన కొందరు యువకులతో కూడిన ఆకతాయిల గ్యాంగ్ ఒకటి స్థానికంగా దౌర్జన్యాలకు పాల్పడుతోంది. ఆ గ్రామం మీదుగా రాత్రిపూట ప్రయాణించే వాహనాలకు అడ్డుతగిలి వాహనదారుల్ని దుర్భాషలాడి కొట్టడం, గాయపరచటం వంటివి చేస్తున్నారు. వీరి ఆగడాలు రోజురోజుకు శృతిమించుతున్నాయి. ఆ గ్రామం మీదుగా రాత్రి వేళల్లో ప్రయాణించాలంటేనే వాహనదారులు భయపడిపోతున్నారు. అయినా ఆ గ్యాంగ్ ఆగడాలు, అరాచకాలకు పోలీసులు మాత్రం కళ్లెం వేయడం లేదు. ఇదే అదనుగా రెచ్చిపోతున్నారు. తాజాగా ఆ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఓ ఘటనతో వారి అరాచకాలు బహిర్గతమయ్యాయి. మండలంలోని నాగులపాడు గ్రామానికి చెందిన విశ్రాంత సైనికోద్యోగి, మాజీ ఉపసర్పంచి, తెదేపా ప్రత్తిపాడు నియోజకవర్గ బీసీ సెల్ కన్వీనర్ కల్వకూరి వెంకట్రావు తన కుటుంబీకులతో కలిసి మూడు రోజుల క్రితం (ఆదివారం) బాపట్ల నుంచి కారులో బయలుదేరి నాగులపాడు వస్తుండగా ఉప్పలపాడుకు వెలుపల రాత్రి పూట సుమారు 9.30 గంటల సమయంలో మద్యం మత్తులో ఉన్న యువకుడొకరు తన ద్విచక్రవాహనాన్ని రోడ్డుకు అడ్డంగా పార్కుచేసి కారు వెళ్లకుండా అడ్డు తగిలారు. దీంతో వెంకట్రావు కారులో నుంచి దిగి బైక్ తీస్తే తాను వెళతానని చెబితే వినిపించుకోలేదు. వెంకట్రావే ఆ బైకును పక్కకు తీస్తుండగా ఎలా వెళతావో చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అదేం పట్టించుకోకుండా వెంకట్రావు తన కారులో వెళ్లిపోతుండగా మరోసారి ఉప్పలపాడు వద్ద అడ్డగించి అతనిపైన, కుటుంబీకులపై దాడి చేసి నానా బీభత్సం సృష్టించి వారిని భయభ్రాంతులకు గురిచేశారు. వారు ప్రయాణిస్తున్న కారును ధ్వంసం చేశారు.
నిందితులకు వైకాపా నేపథ్యం?
బాధితుడు వెంకట్రావు ఫిర్యాదు మేరకు పెదనందిపాడు పోలీసులు ఆరుగురు నిందితులను మంగళవారం అరెస్టు చేసి అంతటితో సరిపుచ్చారు. వారు ఏకంగా ఓ కుటుంబాన్ని అడ్డగించి వారిని కొట్టిగాయపరిచి, వారి వద్ద ఉన్న బంగారు అభరణాలను లాగేసుకుని పట్టుకుపోతే వారిపై కఠిన సెక్షన్లు నమోదు చేయకుండా, రౌడీషీట్లు తెరవకుండా సాధారణ కేసులతో సరిపుచ్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిందితులకు వైకాపా నేపథ్యం ఉందని, అందుకే పోలీసులు వారు ఎన్ని దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడినా చూసీచూడనట్లు మిన్నకుండిపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. వీరి ఆగడాలతో ఆ మార్గంలో రాత్రిపూట వాహనాలపై ప్రయాణించాలంటేనే బెంబేలెత్తుతున్నామని ఆ ప్రాంత వాసులు పలువురు చెబుతున్నారు. నిత్యం మద్యం తాగి అర్ధరాత్రి వరకు రహదారులపై హల్చల్ చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. బాధితుడు వెంకటరావు, కుటుంబ సభ్యులపై దాడి చేసి గాయపరిచిన ఆకతాయిలను అరెస్టు చేసినట్లు ఎస్సై రాజకుమార్ తెలిపారు. ఉప్పలపాడుకు చెందిన అఖిల్, మనోజ్, రోహిత్, చందు, లూదర్పాల్, విల్సన్ను నిందితులుగా గుర్తించామన్నారు. వారిపై రౌడీషీట్ ఓపెన్ చేస్తామంటున్నారు.
గుక్కెడు నీళ్లివ్వడానికి సాహసించలేదు..
ఆ గ్రామంలో మహిళా పోలీసు ఉన్నారు. అయినా వీరి ఆగడాలు ఇప్పటి వరకు ఆ మహిళా పోలీసుకు గానీ, పోలీసుల దృష్టికి గానీ రాలేదా అంటే నమ్మశక్యం కావడం లేదు. బాధితుడు వెంకట్రావు కారును గ్రామ నడిరోడ్డుపై నిలిపి గంట పాటు నానా బీభత్సం చేసి కొట్టిగాయపరిచినా గ్రామస్థులు ఎవరూ నోరుమెదపలేదు. తనను రక్షించాలని వేడుకున్నా ఎవరూ స్పందించలేదు. దెబ్బలకు తాళలేక స్థానికులను గుక్కెడు నీళ్లు అడిగినా ఇవ్వడినికి ఎవరూ సాహసించలేదని బాధితుడు వెంకట్రావు పేర్కొన్నారు. తనపై దాడి విషయాన్ని కానిస్టేబుల్కు ఫోన్ ద్వారా తెలియజేయగా ఆయన వచ్చి తమను కాపాడారని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒకే కారణంతో రెండుసార్లు సస్పెండ్ చేశారు.. క్యాట్లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ
[ 29-04-2024]
కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్లో ఏబీ వెంకటేశ్వరరావు కేసుపై విచారణ జరిగింది. -
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు
[ 29-04-2024]
ఏపీ, తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసింది. -
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
[ 29-04-2024]
ఐదేళ్ల జగన్ పాలనలో అంతా దోపిడీయేనని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. -
భర్త మద్దతుగా మాట్లాడలేదని వివాహిత ఆత్మహత్య
[ 29-04-2024]
కుటుంబంలో చోటుచేసుకున్న చిన్న గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు తాడికొండ మండలం బండారుపల్లి గ్రామానికి చెందిన చుండ్రు జయశ్రీ, ప్రత్తిపాడు మండలం గొట్టిపాడు గ్రామానికి చెందిన శివరామకృష్ణకు 10 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
ప్రశ్నిస్తే పగ.. స్వేచ్ఛకు సెగ
[ 29-04-2024]
ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడడానికీ వీల్లేదు. వారి అభిప్రాయాలను బహిరంగంగా పంచుకోవడాన్ని సహించరు. అయిదేళ్ల జగన్ పాలన అక్షరాలా ఇలాగే సాగింది. -
జగన్మోసకారి!
[ 29-04-2024]
బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ -
సమరానికి సైకిల్ యాత్రతో సంసిద్ధం
[ 29-04-2024]
ఎన్నికల సమరానికి సైకిల్ యాత్రతో సంసిద్ధమని గుంటూరు పశ్చిమ తెదేపా అభ్యర్థి గళ్లా మాధవి తెలిపారు. ‘ -
పదవిని అడ్డు పెట్టుకుని అక్రమ సంపాదన
[ 29-04-2024]
‘ఎమ్మెల్యే పదవి అడ్డుపెట్టుకుని ప్రకృతి సంపదను నాశనం చేసి ఏకంగా 700 ఎకరాల్లో గ్రావెల్ తవ్వి కిలారి రోశయ్య అక్రమ సంపాదన వెనకేసుకున్నారు. -
నేటితో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ
[ 29-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం సోమవారంతో ముగియనుంది. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు రిజిస్టర్ పార్టీలు, -
అర్ధరాత్రి దళిత మహిళల దుకాణాల కూల్చివేత
[ 29-04-2024]
పేద దళిత మహిళల దుకాణాలను శనివారం అర్ధరాత్రి కూలగొట్టించిన వైకాపా కార్పొరేటర్ అచ్చాల వెంకటరెడ్డిని అరెస్టు చేయాలని దళిత, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. -
‘అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి డిపాజిటర్లకు న్యాయం చేస్తాం’
[ 29-04-2024]
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి డిపాజిటర్లకు న్యాయం చేస్తామని యువనేత, మంగళగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. -
రూపు మారిన ఆస్తి దస్త్రం
[ 29-04-2024]
ఆస్తుల రిజిస్ట్రేషన్కు జగన్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొన్నినెలల క్రితం ‘కార్డు 2.0 ప్రైమ్ విధానం తీసుకొచ్చి ఆందోళనకు గురిచేసింది. -
జగనన్నా.. ఉపాధి ఏదన్నా..?
[ 29-04-2024]
యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన అంశాల్లో సీఎం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చెప్పిన మాటలకు, క్షేత్ర స్థాయిలో పని తీరుకు ఏ మాత్రం పొంతన లేదన్న విషయం పారిశ్రామిక శిక్షణ సంస (ఐటీఐ)ల పరిస్థితి చూస్తే అర్థమవుతోంది. -
డీఎస్సీ వేయలే.. ఒక్క టీచర్ ఉద్యోగమూ ఇవ్వలే!
[ 29-04-2024]
రాష్ట్రంలో 25 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మేం అధికారంలోకి రాగానే వాటన్నింటిని భర్తీ చేస్తాం. -
నా ఎస్సీలంటూనే.. నిలువునా మోసం
[ 29-04-2024]
ఎక్కడ మాట్లాడినా.. నా ఎస్సీలు.. నా ఎస్టీలు.. అంటూ ఎక్కడ లేని ప్రేమను మాటల్లో ఒలకబోసే జగన్.. వాస్తవంలోకి వచ్చేసరికి వారికి రిక్తహస్తాలే చూపారు. -
వారానికోసారే నీరు.. ఇదీ పాలన తీరు..
[ 29-04-2024]
గుంటూరు నగరపాలికలో విలీన గ్రామాలైన గోరంట్ల, రెడ్డిపాలెం, ప్రగతినగర్, మదర్థెరెసా నగర్లలో గుక్కెడు నీటి కోసం జనాలు నానా తంటాలు పడుతున్నారు. -
రూపు మారిన ఆస్తి దస్త్రం
[ 29-04-2024]
ఆస్తుల రిజిస్ట్రేషన్కు జగన్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొన్నినెలల క్రితం ‘కార్డు 2.0 ప్రైమ్ విధానం తీసుకొచ్చి ఆందోళనకు గురిచేసింది. -
గుంటూరు మీదుగా రైళ్లు
[ 29-04-2024]
విజయవాడ- ఖాజీపేట మార్గంలో ఇంజినీరింగ్ పనులు జరుగుతున్నందున పలు రైళ్లు గుంటూరు మీదుగా నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండలోని ఓ ఏటీఎంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా రూ.8 లక్షల నగదు దగ్ధం అయ్యింది.
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
యూపీఐ వచ్చినా క్యాషే కింగ్.. పెరిగిన ఏటీఎం విత్డ్రాలు!
-
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు
-
వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా ?
-
అమిత్షా వీడియో మార్ఫింగ్ కేసు.. పలువురు కాంగ్రెస్ నాయకులకు నోటీసులు