వైకాపా ప్రభుత్వ నిర్ణయ లోపం.. విద్యార్థులకు శాపం
‘మీ పిల్లలు బడిలో భోజనం చేయకపోతే మీకు వస్తున్న ప్రభుత్వ పథకాలు నిలిచేపోయే అవకాశం ఉంది’అని తల్లిదండ్రుల సమావేశాల్లో ఉపాధ్యాయులు చెబుతున్నా.. నాణ్యత లేకపోవడంతో చాలా మంది విద్యార్థులు
మధ్యాహ్న భోజనంపై అనాసక్తి
‘న్యూస్టుడే’ పరిశీలనలో బయటపడిన లోపాలు
తెనాలి టౌన్, పొన్నూరు, చేబ్రోలు, న్యూస్టుడే
తెనాలి: భోజనం చేయకుండా ఇళ్లకు వెళుతున్న విద్యార్థులు
‘మీ పిల్లలు బడిలో భోజనం చేయకపోతే మీకు వస్తున్న ప్రభుత్వ పథకాలు నిలిచేపోయే అవకాశం ఉంది’అని తల్లిదండ్రుల సమావేశాల్లో ఉపాధ్యాయులు చెబుతున్నా.. నాణ్యత లేకపోవడంతో చాలా మంది విద్యార్థులు భోజనం చేకుండా వెళ్లిపోతున్నారు. దాదాపుగా అన్ని పాఠశాలల్లోనూ ఇదే తీరు నెలకొంది.
గతంలో ఒక్కపూటి పాఠశాలల సమయంలో ఉదయం 10:30 గంటలకు మధ్యాహ్న భోజనం అందించేవారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తరవాత మధ్యాహ్నం పాఠశాల పూర్తైన తరవాత విద్యార్థులకు భోజనం పెట్టి పంపించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని తినకుండానే ఇంటికి వెళ్లి పోతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం ‘న్యూస్టుడే’ పలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలు తీరుపై నిర్వహించిన పరిశీలనలో పలు విషయాలు వెలుగుచూశాయి.
పేరు: తెనాలి మారీసుపేట
నల్లమోతు పురపాలక ఉన్నత పాఠశాల
మొత్తం విద్యార్థులు: 865
హాజరు: 703
భోజనం చేసింది: 606
- తెనాలి మారీసుపేటలోని నల్లమోతు చెంచురామానాయుడు పురపాలక ఉన్నత పాఠశాలను మధ్యాహ్నం ముగిసి విద్యార్థులు బయటకు వచ్చే సమయంలో గేట్లకు తాళాలు వేశారు. అందరూ భోజనం చేసి వెళ్లాలని ఉపాధ్యాయులు కోరారు. ఒంటి పూట బడులు మొదలైన తరవాత ఎక్కువ మంది పిల్లలు ఇళ్లకు వెళ్లిపోవాలన్న తొందరలో భోజనం చేయటంలేదని, అందువల్ల భోజనం చేసి వెళ్లాలని గేట్లకు తాళాలు వేసినట్లు వివరించారు. అయినా కొందరు విద్యార్థులు భోజనం చేయకుండా ఇంటికి వెళ్లిపోయారు. మెనూ ప్రకారం పులిహోర, చట్ని పిల్లలకు వడ్డించారు. వారంలో రెండు రోజులు పులిహోర పెడుతున్నారని, తినబుద్ధి కావటం లేదని, అన్నం, పప్పు బావుంటున్నాయని కొందరు విద్యార్థులు చెప్పారు.
వేజండ్ల: ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనం తింటున్న చిన్నారులు
పేరు: చేబ్రోలు మండలం వేజండ్ల
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
మొత్తం విద్యార్థులు: 408
హాజరు: 378
భోజనం చేసింది: 100
- చేబ్రోలు మండలం వేజండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం కింద సాంబార్ బాత్ లేదా పులిహోర, టమాటా చట్నీ, ఉడికించిన గుడ్డు, ఉదయాన్నే రాగిజావ తయారు చేసి నిర్వాహకులు అందించాల్సి ఉంది. 378 మంది విద్యార్థులకు వంట చేయాల్సి ఉండగా సుమారు 100 మంది సరిపోయేంత పులిహోర, ఉడికించిన కోడి గుడ్లు అందుబాటులో ఉంచారు. సోమవారం నుంచి చిక్కీల సరఫరా లేదు.
వేజండ్ల: 378 విద్యార్థులకు తెచ్చిన పులిహోర, చట్ని ఇదే
పేరు: నిడుబ్రోలు 5వ వార్డు
పురపాలక సంఘ ఉన్నత పాఠశాల
మొత్తం విద్యార్థులు: 166
హాజరు: 159
భోజనం చేసింది: 119
కోడిగుడ్డు ఏది..?
పొన్నూరు పట్టణ పరిధి నిడుబ్రోలు 5వ వార్డు పురపాలక సంఘ ఉన్నత పాఠశాలలో మెనూ ప్రకారం కోడి గుడ్డు, సాంబారు, అన్నం కలిపి అందించాల్సి ఉంది. 10 రోజులు నుంచి కోడి గుడ్డును అందిచడంలేదు. విద్యార్థులకు అన్నం..సాంబారు విడి విడిగా పెట్టారు. కొందరు పాఠశాల ముగియగానే భోజనం చేయకుండా వెళ్లిపోయారు. ప్రభుత్వం లావు బియ్యం పంపిణీ చేయడంతో ఆ బియ్యంతో వండిన అన్నాన్ని తినడానికి వారు ముందుకు రావడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పండుటాకులే ఎండగడతాయి జగన్!
[ 01-05-2024]
వెల్దుర్తి మండల కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో వజ్రాలపాడు తండా, రామచంద్రాపురం తండా, సేవానాయక్ తండా, కొత్తపుల్లారెడ్డిగూడెం, దావుపల్లి తండాలు ఉన్నాయి. ఇక్కడ సుమారు 700 మంది వరకూ వృద్ధులున్నారు. -
కొలిక్కి రాని కుక్కర్ కూపన్ల కథ.. ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి కోసం గాలింపు
[ 01-05-2024]
నందమూరినగర్లోని లక్కీ క్వాలిటీ ప్రింటర్స్లో పెద్ద మొత్తంలో పట్టుబడిన వైకాపా కుక్కర్ల కూపన్ల కేసు దర్యాప్తు ఇంకా కొలిక్కి రాలేదు. పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి వీటిని ఆర్డర్ ఇచ్చాడని లక్కీ క్వాలిటీ ప్రింటర్స్ యజమాని గురుప్రసాద్ చెబుతున్నారు. -
అరాచక మూకలను ఓడించండి!
[ 01-05-2024]
‘తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ హయాంలో ఇక్కడ గతంలో ఎన్నడూ లేని అరాచకాలు జరిగాయి. సరెండర్ అవకుంటే మీ ఇంట్లో మద్యం, గంజాయి, డ్రగ్స్ పెట్టించి అరెస్ట్ చేస్తామంటూ బెదిరించే పరిస్థితులు నెలకొన్నాయి. ప్లాట్లు వేయాలన్నా, అపార్ట్మెంట్లు కట్టాలన్నా కప్పం కట్టాల్సిన స్థితి నెలకొంది. -
ప్రతిపక్షాలపై కక్ష.. పింఛనర్లకే శిక్ష
[ 01-05-2024]
పింఛను సొమ్ము కోసం ఎవరూ సచివాలయాలకు రావొద్దని ఇళ్లకు వెళ్లి ఉద్యోగులు చెప్పడంపై పింఛనుదారుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వం ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడానికి సరిపడా సిబ్బంది లేరని సాకులు చెబుతోంది. -
కార్మికలోకం కకావికలం
[ 01-05-2024]
అమరావతికి నేను సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాను. మూడు ప్రాంతాల అభివృద్ధికి కనీసం 30వేల ఎకరాలు ఉండాలి. అమరావతిలోనే నేను ఇల్లు నిర్మించుకుంటున్నాను. ఇక్కడే ఉంటాను. తెదేపా కన్నా దీటుగా రాజధాని నిర్మిస్తాను. -
కరకట్టపై కక్ష...!
[ 01-05-2024]
అమరావతి అంటేనే పొడ గిట్టని సీఎం జగన్.. దానిని ధ్వంసం చేసేందుకు శక్తిమేర ప్రయత్నించారు. రాజధానికి వెళ్లేందుకు సరైన అనుసంధాన రహదారి లేకుండా చేశారు. కరకట్ట రోడ్డును విశాలంగా విస్తరిస్తానని శంకుస్థాపన సమయంలో మాట ఇచ్చి.. ఆనక మడమ తిప్పేశారు. -
‘మే’మూ కడతాం ఇసుకాసురులకు పా‘డే’
[ 01-05-2024]
పెదకూరపాడు నియోజకవర్గం అమరావతికి చెందిన రామాంజనేయులు భవన నిర్మాణ కార్మికుడు. 2019 వరకూ సొంతూరులోనే పనులు చేసుకుంటూ ముగ్గురు పిల్లలతో హాయిగా కాలంగా వెళ్లదీశాడు. జగన్ అధికారంలోకి వచ్చాక ఇసుక కొరత సృష్టించడంతో భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. -
తీరాన ప్రజాగళానికి సన్నద్ధం
[ 01-05-2024]
-
ఏకోపాధ్యాయ పాఠశాలలు.. దిగజారిన విద్యా ప్రమాణాలు
[ 01-05-2024]
రాష్ట్రంలో విద్యాప్రమాణాలు దిగజారకుండా చూస్తాం.. ఏకోపాధ్యాయ పాఠశాలలు లేకుండా చేస్తామని పాదయాత్రలో జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీల అమలును విస్మరించారు. ఉపాధ్యాయ నియామకాల కోసం ఒక్క డీఎస్సీ కూడా వేయకుండానే అయిదేళ్ల పాలన పూర్తి చేశారు. -
‘జగన్ను ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’
[ 01-05-2024]
రాష్ట్రంలో ఫాసిస్ట్ పాలన కొనసాగిస్తున్న జగన్ను ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మాల మహా సభ వ్యవస్థాపక అధ్యక్షుడు మెల్లెల వెంకట్రావు కోరారు. రిపబ్లికన్ పార్టీ మంగళగిరి అభ్యర్థి, న్యాయవాది గుర్రం రామారావుతో కలసి అమరావతి ప్రెస్క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
సమస్యలు వింటూ.. భరోసా ఇస్తూ..
[ 01-05-2024]
తెదేపా జాతీయ కార్యదర్శి, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ తరఫున ఆయన సతీమణి బ్రాహ్మణి మంగళవారం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. -
‘వైకాపా పాలనలో ఛార్జీల బాదుడు’
[ 01-05-2024]
వైకాపా పాలనలో ప్రజలపై నిత్యావసర సరకులు, విద్యుత్తు ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని కూటమి నాయకులు కోటేశ్వరరావు, కంతేటి బ్రహ్మయ్య ఆరోపించారు. -
శిడిమాను ఉత్సవం..భక్త సంబరం
[ 01-05-2024]
గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాటూరులో జగన్మాత పోలేరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది. దూరప్రాంతాల నుంచి వేలాది మంది తరలి రావడంతో గ్రామం కిక్కిరిసింది. -
కూటమి గెలుపు అభివృద్ధికి మలుపు
[ 01-05-2024]
రాష్ట్రాభివృద్ధి తెదేపాతోనే సాధ్యమని తాడికొండ నియోజకవర్గ కూటమి అభ్యర్థి తెనాలి శ్రావణ్కుమార్ పేర్కొన్నారు. మండలం కేంద్రంలోని రసూల్ పేట, కొత్తపేట, బీసీ కాలనీలో మంగళవారం తెదేపా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
సప్లిమెంటరీ ఫీజుల చెల్లింపునకు మే 4 వరకు గడువు
[ 01-05-2024]
ఏపీ సార్వత్రిక విద్యాపీఠం నిర్వహించే పదోతరగతి, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలకు రుసుం చెల్లించేందుకు గడువు మే 4 వరకు ఉందని డీఈవో ఎం.వెంకటేశ్వర్లు అన్నారు. -
వైకాపాకు గుంటూరు డిప్యూటీ మేయర్ సజీల రాజీనామా
[ 01-05-2024]
వైకాపాకు రాజీనామా చేసినట్లు గుంటూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ షేక్ సజీల మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అతడికి పెద్దగా అవకాశాలు ఇవ్వలేకపోయాం..: హార్దిక్ పాండ్య
-
మ్యానిఫెస్టోలో కార్మిక సంక్షేమానికి పెద్దపీట: తెదేపా అధినేత చంద్రబాబు
-
అమెరికాలో గాజా అలజడి.. కస్టడీలోకి కొలంబియా వర్సిటీ నిరసనకారులు
-
పలు స్కూళ్లకు ఒకేసారి బాంబు బెదిరింపులు.. దిల్లీలో కలకలం
-
ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత సీట్లంటూ తాయిలం
-
తగ్గిన వంటగ్యాస్ వాణిజ్య సిలిండర్ ధర