అ‘తీగ’తిలేని ‘మార్గం’
ప్రజలకు మేలు చేసే కార్యక్రమం ఏదైనా తెదేపా ప్రభుత్వం ప్రారంభించినది అయితే పూర్తి చేయం. అవసరమైతే పనికిరాకుండా చేస్తాం ఇది జగన్ సర్కారు ఐదేళ్లుగా అవలంభిస్తున్న తీరు.
కోటప్పకొండపైకి ఏర్పాటు కాని రోప్ వే
ఆలయ అభివృద్ధిని పట్టించుకోని వైకాపా సర్కారు
ప్రజలకు మేలు చేసే కార్యక్రమం ఏదైనా తెదేపా ప్రభుత్వం ప్రారంభించినది అయితే పూర్తి చేయం. అవసరమైతే పనికిరాకుండా చేస్తాం ఇది జగన్ సర్కారు ఐదేళ్లుగా అవలంభిస్తున్న తీరు. కోటప్పకొండలోని రోప్వే (తీగ మార్గం) నిర్మాణాన్ని పక్కన పెట్టారు.
న్యూస్టుడే, నరసరావుపేట అర్బన్
దేశంలోనే శ్రీమేధాదక్షిణామూర్తి స్వరూపంలో మహాదేవుడు కొలువైన ఏకైక శైవక్షేత్రం కోటప్పకొండ. వందల ఏళ్ల చరిత్ర ఉన్న కోటప్పకొండను మాజీసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఎన్నో ప్రయాసలకోర్చి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారు. రూ.లక్షల్లో ఉన్న స్వామి ఆదాయాన్ని రూ.కోట్లకు పెంచారు. పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు మరిన్ని హంగులు అవసరమన్న భావనతో తీగమార్గం ప్రతిపాదన తెచ్చారు. అందుకు అనుమతులు, నిధులు సాధించారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పనులు ప్రారంభించారు. 2019 ఎన్నికల్లో జగన్ సర్కారు అధికారంలోకి రావడంతో రోప్వేకు సంబంధించిన పనులు ఆగిపోయాయి.
దిమ్మెలకే పరిమితం..
రూ.4 కోట్లతో చేపట్టిన రోప్వే పనులు దిమ్మెల నిర్మాణానికి పరిమితమైంది. లేజర్షో కోసం నిర్మించిన కట్టడాలు నిరుపయోగంగా మారాయి. పర్యాటక శాఖ నిర్మించిన ఫలహారశాల భవన తలుపులను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. నడక మార్గం, లేజర్షో భవనాలు మధ్యలో పిచ్చిచెట్లు పెరిగి చిట్టడవిని తలపిస్తున్నాయి.
రోప్వే ఏర్పాటుకు వేసిన దిమ్మె
పర్యాటకంగా మంచి అవకాశం
రాష్ట్ర విభజన తర్వాత జిల్లాలో పర్యాటకులను ఆకర్షించే అవకాశం ఉన్న ప్రాంతాల్లో కోటప్పకొండ ఒకటని గుర్తించి తెదేపా పాలనలో అభివృద్ధికి బాటలు వేశారు. ఇప్పటికే ఘాట్రోడ్డు ఉన్న కోటప్పకొండకు రోప్వే ఉంటే మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు అవకాశం ఉంటుందని అప్పటి పాలకులు ముందుచూపుతో ఆలోచన చేశారు. దీనికి తోడు లేజర్ షో, బోటుషికారుకు ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రి, కార్తికమాసంలో అధికసంఖ్యలో భక్తులు వస్తుంటారు. నిత్యం భక్తులు వచ్చేలా అదనపు హంగులు సమకూర్చితే దేవస్థానానికి ఆదాయం భారీగా సమకూరుతుందని, ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నది నాటి పాలకుల ఆలోచన. కోటప్పకొండ వద్ద 2016లో రూ.4 కోట్లతో పనులు చేపట్టే బాధ్యతలు కోల్కతాకు చెందిన ఓ సంస్థకు అప్పగించారు. ఆ సంస్థ తీగ మార్గం పనులు ప్రారంభించింది. కొండ దిగువన రోప్వే కోసం అవసరమైన నిర్మాణ పనులు మొదలుపెట్టింది. తీగమార్గాన్ని 2020లోగా అందుబాటులోకి తీసుకురావాలన్నది లక్ష్యం. రోప్వేకు పునాదులు వేసిన తర్వాత ప్రభుత్వం మారడంతో వైకాపా దానికి పక్కన పెట్టింది.
వైకాపా ప్రజాప్రతినిధుల మాటలు నీటి మూటలు
రోప్వే అంశంలో వైకాపా పాలన వచ్చిన కొత్తలో తీగమార్గాన్ని పొడిగించి మరింతగా అభివృద్ధి చేస్తామని ప్రజాప్రతినిధులు గొప్పలు చెప్పారు. పర్యాటక సంస్థ అధికారులను పిలిచి దండలు వేసి సత్కారాలు చేసి ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆలయం వరకు కాదు. పాత కోటయ్య స్వామి ఆలయం వరకు నిర్మాణం చేస్తామని అందుకు రూ.8 కోట్లు అవసరమని తేల్చారు. తీగమార్గం విషయంలో పురోగతి లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు.. 46,389 పోలింగ్ కేంద్రాలు
[ 02-05-2024]
రాష్ట్రంలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్మీనా తెలిపారు. -
పోలింగ్ సమయం పెంచండి.. ఈసీకి తెదేపా విజ్ఞప్తి
[ 02-05-2024]
ఏపీలో ఎండల తీవ్రత దృష్ట్యా పోలింగ్ సమయంలో మార్పులు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెదేపా కోరింది. -
రోడ్డు ప్రమాదంలో రాయపాటి అరుణకు గాయాలు
[ 02-05-2024]
జిల్లాలోని జె.పంగులూరు మండలం రేణింగవరం వద్ద కారు డివైడర్ను ఢీకొంది. -
గర్జించిన గుంటూరు.. చంద్రబాబుకు అభిమాన నీరాజనం
[ 02-05-2024]
‘గుంటూరు మిరప ఘాటు ఎలా ఉంటుందో సత్తా చూపారు. ర్యాలీ అదుర్స్’ అని రోడ్షోలో భారీగా స్వాగతం పలికిన, సభకు హాజరైన జనాన్ని చూసి తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఇలా స్పందించారు. -
పాలకుల పాపాలు.. సమిధలయ్యె ప్రాణాలు
[ 02-05-2024]
రక్షితనీరు.. ప్రజల ప్రాథమిక అవసరం.. కానీ జగన్ పాలనలో దీన్ని పూర్తిగా విస్మరించారు. తాగు నీటి సరఫరా, నిర్వహణపై అధికారులతో ఎప్పుడూ సమీక్షించింది లేదు. -
రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది
[ 02-05-2024]
న్యాయం చేయాలని అయిదు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేపడితే వైకాపా రాక్షస ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోపూరి శ్రీ లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కలల గృహం.. కల్లోలం
[ 02-05-2024]
అర్హులైన ప్రతి పేదకు ఇంటి స్థలంతో పాటు గృహాన్ని నిర్మించి ఇచ్చే బాధ్యత మాది. మీరు సొంతంగా ఇల్లు నిర్మించుకుంటామంటే పూర్తి స్థాయిలో బిల్లులు చెల్లిస్తాం. -
అమరావతిపై జగన్ వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనం
[ 02-05-2024]
‘అమరావతి అంటే ఏంటి..అది ఎక్కడ ఉంది’ అని ఓ జాతీయ మీడియా ఇంటర్వ్యూలు సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై రాజధాని మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నేతలు.. ‘మేత’లు
[ 02-05-2024]
జేపీ కంపెనీ ఇసుక తవ్వకాల నుంచి తప్పుకున్న తర్వాత ఇసుక వ్యాపారాన్ని పెదకూరపాడు నియోజకవర్గంలో ప్రజాప్రతినిధి చేజిక్కించుకున్నారు. -
కోడ్ ఉల్లంఘనపై 60 కేసులు
[ 02-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై 60 కేసులు నమోదు చేశారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు ఎం.వేణుగోపాల్రెడ్డి తెలిపారు. -
చంద్రబాబును గెలిపించండి
[ 02-05-2024]
రాజధానిని నిర్మించే నాయకుడు చంద్రబాబును గెలిపించాలని అమరావతి రాజధాని రైతులు మంగళగిరి కొత్తపేటలో బుధవారం సాయంత్రం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. -
యువకుల ప్రాణాలు కాపాడిన బీచ్ పోలీసులు
[ 02-05-2024]
సూర్యలంక తీరంలో విహారానికి వచ్చి సముద్ర స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోతున్న మంగళగిరికి చెందిన ఇద్దరు యువకుల ప్రాణాలను బీచ్ పోలీసులు బుధవారం కాపాడారు. -
వైకాపా నుంచి తెదేపాలోకి భారీ వలసలు
[ 02-05-2024]
తెనాలిలో వైకాపా నుంచి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు కూటమిలోకి వరుసగా వస్తున్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం పట్టణంలోని 23వ వార్డు కౌన్సిలర్ తోక శిరీష, వాసు దంపతులు, -
ప్రాణాలు పోతున్నా పట్టదా..!
[ 02-05-2024]
వైౖకాపా పాలకుల వైఫల్యం వల్ల ప్రజలు కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురవుతున్నారు. అధికార పార్టీ నాయకులు, అధికారులు, గుత్తేదారులు కుమ్మక్కై ‘నాకింత.. -
స్వచ్ఛమైన నీరు ఎక్కడ.. కిలారి
[ 02-05-2024]
పుర ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య అనేక సందర్భాల్లో వేదికలపై నుంచి చెప్పారు. -
అవకాశవాదులను తెదేపాలో చేర్చుకోం
[ 02-05-2024]
-
జీఎంసీకి రూ.5 లక్షల జరిమానా
[ 02-05-2024]
గుంటూరు వైద్య కళాశాల(జీఎంసీ)లో ప్రస్తుతం ఉన్న 250 ఎంబీబీఎస్ సీట్లకు అనుగుణంగా తగినంత మంది బోధనానిపుణులు, ఇతర సదుపాయాలు లేనందున రూ.5 లక్షలు జరిమానా చెల్లించాలని జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) అధికారులు ఆదేశించారు. -
పోస్టల్ బ్యాలట్ల దరఖాస్తులు తీసుకోవడానికి నిరాకరణ
[ 02-05-2024]
బాపట్ల జిల్లాలోని వివిధ గ్రామాల్లో ఓటు హక్కు కలిగిన ఒప్పంద ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్ తీసుకోవడానికి గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని తహసీల్దార్లు నిరాకరించడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీ రనౌట్.. నెట్టింట జితేశ్ శర్మపై ట్రోలింగ్
-
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం: నెట్వర్క్ ఆసుపత్రుల లేఖ
-
బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి.. 2 నెలల వ్యవధిలో రెండోది
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM