కాలుష్యం ముప్పు.. కలగదా కనువిప్పు
జిల్లాలో ఆర్థిక రాజధానిగా తాండూరు పట్టణం వెలుగొందుతోంది. సిమెంటు, నాపరాయి పరిశ్రమలతో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇదే సమయంలో ఎటు చూసినా గుంతల రహదారులు.
జిల్లాలో ఆర్థిక రాజధానిగా తాండూరు పట్టణం వెలుగొందుతోంది. సిమెంటు, నాపరాయి పరిశ్రమలతో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇదే సమయంలో ఎటు చూసినా గుంతల రహదారులు. దుమ్ము, ధూళితో విపరీతమైన గాలి కాలుష్యం. పట్టణంపై మంచు పొర కప్పినట్లు ధూళి కమ్ముకుంటోంది. దీంతో ప్రజలకు ఆరోగ్య సమస్యలు తప్పడంలేదు. రానున్నది వేసవి కావడంతో ఈ సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం పొంచి ఉంది. కనీసం ఇప్పుడైనా అధికారులు వాయు కాలుష్య నియంత్రణకు చర్యలు చేపట్టి ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది.
దేశ రాజధానినే మించి పోయింది
కాలుష్య తీవ్రతలో తాండూరు పట్టణం దేశ రాజధాని దిల్లీని మించిపోయింది. కాలుష్య నియంత్రణ మండలి లెక్కల ప్రకారం ఒక క్యూబిక్ మీటరు గాలిలో 10 పీఎం పరిమాణం గల ధూళి కణాలు 100 మైక్రో గ్రాముల (10 పీఎం) కంటే తక్కువగా ఉండాలి. అయితే ఇక్కడ మాత్రం 650 మైక్రో గ్రాములుగా (2016) నమోదు కాగా, ప్రస్తుతం 250 మైక్రో గ్రాముల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎండాకాలంలో 700 మైక్రో గ్రాములు దాటుతుందని అంచనా. 2.5 పీఎం పరిమాణం గల ధూళి కణాలు 40 మైక్రో గ్రాములు మాత్రమే ఉండాలి. స్థానికంగా అవి 125 మైక్రో గ్రాములు నమోదవుతుండటం పర్యావరణ ప్రేమికులను ఆందోళనకు గురిచేస్తోంది.
బషీర్మియా తండా- రాజీవ్ గృహకల్ప మధ్య బైపాస్ రహదారి నిర్మించాల్సిన ప్రదేశం
తీవ్రత ఎక్కడెక్కడ..
గోపన్పల్లి సమీపంలో క్యూబిక్ మీటరు గాలికి సుమారు 600 మైక్రో గ్రాముల 10పీఎం దూళి కణాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఇందర్చేడ్, శివాజీచౌక్, గౌతాపూర్, కరణ్కోట్, తాండూరు-లక్ష్మీనారాయణపూర్ కూడలి, తదతర ప్రాంతాల్లో వాయుకాలుష్యం అధికంగా నమోదవుతోంది.
అర్ధంతరంగా నిలిచిన బైపాస్ పనులు
తాండూరులో కాలుష్య నివారణకు ప్రధాన ప్రత్యామ్నాయమైన బైపాస్ రహదారికి 2017లో రూ.73 కోట్లు కేటాయించారు. పనులు ప్రారంభించిన గుత్తేదారు మధ్యలోనే విడిచిపెట్టేశారు. మరో వైపు భూ సేకరణకు సంబంధించి పరిహారం రాలేదని బషీర్మియా తండాకు చెందిన రైతులు ఆందోళన చేస్తున్నారు. దీంతో రాజీవ్ గృహకల్పం నుంచి తండా వైపు ఒక్క అడుగూ ముందుకు పడలేదు.
బైపాస్ దారే ప్రత్యామ్నాయం: వెంకన్న, ఈఈ పీసీబీ
కాలుష్య నివారణకు బైపాస్ రహదారి ముఖ్యం. ఇది ప్రారంభమైతే వాహనాల రద్దీ తగ్గి గాలిలో కాలుష్యం తగ్గ్గుతుంది. గతంలో గణాంకాల ఆధారంగా సీసీఐకి నోటీసులు ఇచ్చాం. కాలుష్య నియంత్రణకు పల్స్ జెట్ బ్యాగ్ హౌస్ ఏర్పాటు చేశారు. అటువైపు నుంచి ఇబ్బంది లేదు. పట్టణంలో అంతర్గత రహదారులు మెరుగుపడితే సమస్య తీరుతుంది.
ఇవీ ప్రధాన కారణాలు
* రహదారులను సరిగా నిర్వహించకపోవడం.
* ఇసుక, మట్టి, గుంతల దారులపై భారీ లోడ్లతో వాహనాలు ఇష్టారీతిన తిరగడం.
* సిమెంటు కర్మాగారాలు, అధికారులు పర్యావరణ పరిరక్షణకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడంలేదు..
* దుమ్ము లేవకుండా రోడ్లపై నీటిని చల్లడంలేదు.
* నాపరాయి వ్యర్థాలను రహదారికి ఇరువైపులా, రహదారి గుంతల్లో పారబోయడం, భారీ వాహనాలు వచ్చినపుడు బూడిదగా మారి గాలిలో కలిసిపోవడం.
రాజకీయ అజెండాగానే వాడుకుంటున్నారు
- శ్రీనివాస్రెడ్డి, తాండూరు నివాసి
తాండూరు పట్టణం, పరిసర ప్రాంతాల్లో కాలుష్య సమస్యను రాజకీయ అజెండాగానే వాడుకుంటున్నారు తప్ప ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోవడంలేదు. దశాబ్దాలుగా సమస్య ఉందని తెలిసినా పరిష్కరించే మార్గాలు అన్వేషించడం లేదు. బైపాస్ రోడ్డు నిర్మిస్తామన్నారు. సగం పనులు చేసి వదిలేశారు. నాలుగేళ్లు కావస్తోంది. దానిపైనా దృష్టిపెట్టడంలేదు.
2014 నుంచి పోరాడుతున్నాను..
- రాజగోపాల్, సామాజికవేత్త, తాండూరు
పట్టణంలో కాలుష్య నివారణకు నావంతుగా 7 ఏళ్లుగా పోరాడుతున్నాను. కోర్టులో కేసు వేయడం, ఫిర్యాదులు చేయడంతో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కదిలివచ్చారు. కాలుష్యాన్ని కొలిచే పరికరాలను తెచ్చి పెట్టారు. దిల్లీ కంటే ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయని తేలింది. ప్రజలు రోగాల బారినపడుతున్నారు. దీనిపై పురపాలక సంఘం, ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కోరుతూ కేసు వేశాను. పట్టణ ప్రజలు అంతా తమ కుటుంబాల ఆరోగ్య రక్షణకు ముందుకు రావాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ముఠా అరెస్టు
[ 26-04-2024]
సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ముఠాను దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. -
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
[ 26-04-2024]
భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులను హెచ్ఎండీఏ పరిధిలో ఇక నుంచి ఏకగవాక్ష పద్ధతిలో జారీ చేయనున్నారు. గతంలో అందుబాటులోకి తెచ్చిన తెలంగాణ స్టేట్ లేఅవుట్ అండ్ బిల్డింగ్ పర్మిషన్ ఆమోదం, స్వీయ ధ్రువీకరణ వ్యవస్థ(టీఎస్బీపాస్) ద్వారానే అనుమతులు మంజూరు చేస్తారు. -
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
[ 26-04-2024]
ఎన్నికలంటే ఎప్పుడైనా సందడే.. ఓటర్లను కూడగట్టడం ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న పని. ప్రస్తుత ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కు ఎంతో ప్రతిష్ఠాత్మకమని భావిస్తున్నారు. -
కూకట్పల్లిలో హత్యాచారం కేసు.. 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
[ 26-04-2024]
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
నేతలు రోడ్డెక్కె.. ప్రచారం వేడెక్కె
[ 26-04-2024]
రాజధానిలో లోక్సభ ఎన్నికల్లో ప్రచారం వేడెక్కింది. మొన్నటివరకు అభ్యర్థులు ఖరారు కాకపోవడం.. ఎండలు మండిపోతుండటంతో జనంలోకి వెళ్లడానికి నేతలు వెనకాముందాడారు. ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో పార్టీల్లో కదలిక వచ్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
కేరింతలతో హోరెత్తె..
[ 26-04-2024]
సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్కు క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు. పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. -
నగరాన.. సీఎం సుడిగాలి పర్యటన
[ 26-04-2024]
సీఎం రేవంత్రెడ్డి గురువారం నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. ఇటీవల మధుయాస్కి తల్లి మృతి చెందడంతో ఉదయం హయత్నగర్లోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. -
స్మార్ట్గా ఓటర్లకు చేరువ
[ 26-04-2024]
ఎన్నికలంటే పార్టీలు, అభ్యర్థుల పాటలతో బస్తీలు మార్మోగేవి. కార్యకర్తలు, అభిమానులు పార్టీ జెండాలు, కండువాలతో పెద్దఎత్తున ఇంటింటి ప్రచారం నిర్వహించేవారు. -
దోమా దోమ.. ఇం‘ధనం ఏదమ్మా’?
[ 26-04-2024]
జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం దోపిడీకి చిరునామాగా మారింది. ఫాగింగ్ పేరుతో కొందరు జోనల్ స్థాయి అధికారులు డీజిల్ను అమ్మేసుకుంటున్నారు. -
ముగిసిన మొదటి పర్వం
[ 26-04-2024]
రాజధానిలోని నాలుగు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. -
రూ.వంద కోట్లు దాటినా.. ఇచ్చింది సున్నా
[ 26-04-2024]
శివార్లలో మురుగు నిర్వహణకు సంబంధించి నిధుల విడుదలలో బల్దియా జాప్యంతో జలమండలి మల్లగుల్లాలు పడుతోంది. 13 నెలలుగా ఒక్క పైసా కూడా బల్దియా నుంచి జలమండలి ఖాతాకు జమ కావడంలేదని అధికారులు వాపోతున్నారు. -
జేఈఈ మెయిన్స్లో సత్తా
[ 26-04-2024]
ఇంజినీర్ కావడానికి ఐఐటీల్లోనే చదవాలన్న సంకల్పంతో రెండేళ్లు వారు అహర్నిశలు కష్టపడ్డారు. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో సత్తా చాటారు. వంద శాతం పర్సంటైల్ సాధించి ప్రతిభ కనబరిచారు. -
శేషగిరికి కన్నీటి వీడ్కోలు
[ 26-04-2024]
విధుల్లో ఉన్న సమయంలో ఏకే-47 తుపాకీ ప్రమాదవశాత్తు పేలడంతో మృతిచెందిన సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరి(47)కు నగరవాసులు కన్నీటి వీడ్కోలు పలికారు. -
తలసరి ఆదాయమేకాదు.. కరెంట్ వినయోగంలోనూ టాప్
[ 26-04-2024]
ఐటీ సంస్థలు.. ఏరో సెజ్లు.. డాటా కేంద్రాలు, అంతర్జాతీయ విమానాశ్రయం.. పరిశ్రమలు.. ఈ-మొబిలిటీ వ్యాలీ.. ఆకాశహార్మ్యాలు... కన్వెన్షన్ సెంటర్లు.. వినోద కేంద్రాలు.. విద్యాసంస్థలు.. వ్యవసాయ ఉత్పత్తులకు నిలయంగా ఉన్న రంగారెడ్డి జోన్ పరిధిలో అత్యధిక కరెంట్ డిమాండ్ ఉంటోంది. -
ఐపీఎల్ టికెట్ల గోల్మాల్పై చర్యలకు డిమాండ్
[ 26-04-2024]
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్ల గోల్మాల్, బ్లాక్ దందాపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి డిమాండ్ చేశారు. -
మంగళ్ ‘హాట్ ఠాణా’
[ 26-04-2024]
శాంతిభద్రతలపరంగా మంగళ్హాట్ ఠాణా అతి సున్నితమైంది. పోలీస్ స్టేషన్లో కొందరు అధికారులు, సిబ్బంది అవినీతి, అక్రమాలతో అప్రతిష్ఠ మూటగట్టుకుంటోంది. -
నినాదాల హోరు.. కాంగ్రెస్ శ్రేణుల జోరు
[ 26-04-2024]
రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్లో గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించిన రోడ్డుషో సందడిగా సాగింది. ఉప్పర్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. -
అధ్యాపకుల కొరత.. అసౌకర్యాల వెత
[ 26-04-2024]
జిల్లాలో ఈసారి ఇంటర్ ద్వితీయ ఫలితాలు ఒక మెట్టు కిందకే ఉండటం అటు అధ్యాపకులను, ఇటు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో ప్రథమ సంవత్సరంలో మాత్రం మెరుగైన ఫలితం రావడం అందరికీ సంతోషదాయకంగా ఉంది. -
దేవాదాయ భూముల రక్షణకు సమష్టి కృషి
[ 26-04-2024]
దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు పాలనాధికారి లింగ్యానాయక్ అన్నారు. -
న్యాయమూర్తులకు ఘనంగా వీడ్కోలు
[ 26-04-2024]
ఉద్యోగ జీవితంలో బదిలీలు అనివార్య ప్రక్రియ అని రంగారెడ్డి జిల్లా కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిధర్రెడ్డి అన్నారు. -
ముగిసిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు
[ 26-04-2024]
వారం రోజులుగా అట్టహాసంగా కొనసాగిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలు గురువారం చక్రస్నానం, ధ్వజావరోహణంతో ముగిశాయి. -
‘అభివృద్ధి మరిచి తిట్లతో పాలిస్తున్నారు’
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి తిట్ల పురాణంతో పాలన సాగిస్తుందని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. -
రేవంత్రెడ్డి సభలో స్పృహ తప్పిన కార్యకర్త
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం అత్తాపూర్లో నిర్వహించిన రోడ్డుషోలో ప్రసంగిస్తుండగా ఆయన ముందున్న కార్యకర్తల్లో ఒకరు స్పృహ తప్పి పడిపోయారు. -
రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి: రోనాల్డ్ రాస్
[ 26-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది, అధికారుల రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్రాస్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్