logo

యువకుడి అనుమానాస్పద మృతి

స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిన యువకుడు కూడవెల్లి వాగులో శవమై తేలిన సంఘటన దుబ్బాక మండలంలోని ఆకారం గ్రామ శివారులో మంగళవారం చోటు చేసుకుంది. దుబ్బాక ఎస్‌ఐ మన్నె స్వామి తెలిపిన వివరాలు.. మండలంలోని కమ్మర్‌పల్లి గ్రామానికి

Published : 26 Jan 2022 01:41 IST

దుబ్బాక, న్యూస్‌టుడే: స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిన యువకుడు కూడవెల్లి వాగులో శవమై తేలిన సంఘటన దుబ్బాక మండలంలోని ఆకారం గ్రామ శివారులో మంగళవారం చోటు చేసుకుంది. దుబ్బాక ఎస్‌ఐ మన్నె స్వామి తెలిపిన వివరాలు.. మండలంలోని కమ్మర్‌పల్లి గ్రామానికి చెందిన అజ్జ బాల్‌నారాయణ ఏకైక కుమారుడు అజ్జ సంతోష్‌కుమార్‌(28) డిగ్రీ పూర్తి చేస్తి, కొంత కాలం నిర్మల్‌లో పనిచేసి, ప్రస్తుతం ఇంటి వద్దే ఖాళీగా ఉంటున్నాడు. అదే గ్రామానికి అతని స్నేహితులు పర్స శ్రీను, బరిగే ప్రశాంత్‌లతో సోమవారం మధ్యాహ్నం బీబీపేట మండలం మల్కాపూర్‌ గ్రామంలో కల్లు తాగడానికి వెళ్లారు. తాగిన మత్తులో దుకాణం సిబ్బందితో గొడవ పడ్డారు. వారి నుంచి ఫోన్లను దుకాణ సిబ్బంది తీసుకున్నారు. సాయంత్రం అయినప్పటికీ కుమారుడు ఇంటికి తిరిగి రాకపోవడంతో సంతోష్‌ తండ్రి ఫోన్‌ చేయగా గొడవ పడిన విషయం తెలిసింది. ఫోన్లను వాపసు ఇవ్వడంతో అవి తీసుకొని వారు వెళ్లిపోయారు. రాత్రి మరోసారి తండ్రి ఫోన్‌ చేయగా స్విచ్చాఫ్‌ వచ్చింది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 9 గంటలకు ఆకారం గ్రామ సమీపంలోని కూడవెల్లి వాగులో మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతుని చరవాణిని తుజాల్‌పూర్‌ వద్ద కనుగొన్నారు. ఇద్దరు స్నేహితులపై అనుమానం ఉందని తండ్రి ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని