కాలానుగుణ వ్యాధులు.. కార్యాచరణతో కట్టడి
వానాకాలం వచ్చిందంటే రకరకాల వ్యాధులు విజృంభిస్తాయి. ముసురుతో వివిధ రకాల జ్వరాలు వ్యాపించి ప్రజలు ఆసుపత్రుల పాలవుతుంటారు. అపరిశుభ్రత, దోమల వ్యాప్తి, తాగునీరు, ఆహారం కలుషితం వల్ల గ్రామీణ, పట్టణ వాసులు అనారోగ్యానికి
ప్రత్యేక బృందాల ఏర్పాటు
న్యూస్టుడే, వికారాబాద్ కలెక్టరేట్
వానాకాలం వచ్చిందంటే రకరకాల వ్యాధులు విజృంభిస్తాయి. ముసురుతో వివిధ రకాల జ్వరాలు వ్యాపించి ప్రజలు ఆసుపత్రుల పాలవుతుంటారు. అపరిశుభ్రత, దోమల వ్యాప్తి, తాగునీరు, ఆహారం కలుషితం వల్ల గ్రామీణ, పట్టణ వాసులు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువ. దీంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ప్రజలకు అవగాహన కల్పించటంతో పాటు.. అత్యవసరంలో సత్వరమే స్పందించేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, వ్యాధులకు అడుకట్ట వేసేందుకు కార్యాచరణ చేపట్టింది. ఈ నేపథ్యంలో ‘న్యూస్టుడే’ అందిస్తున్న కథనం..
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇటీవల నాలుగు స్థాయిలో ర్యాపిడ్ యాక్షన్ బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లా, డివిజన్, మండల, పీహెచ్సీ స్థాయిలో కమిటీలుంటాయి. జిల్లా స్థాయిలో కలెక్టర్, జిల్లా వైద్యాధికారి, మలేరియా నివారణ అధికారి, హెల్త్ సూపర్వైజర్, ల్యాబ్ టెక్నిషియన్, కమిషనర్లు, పిచికారీ పర్యవేక్షకుడిని నియమించారు. డివిజన్ స్థాయిలో జిల్లా అదనపు వైద్యాధికారి, ముగ్గురు సహాయకులు బృందంలో ఉంటారు. మండల స్థాయిలో మండల స్థాయి అధికారులు ఉంటారు. పీహెచ్సీ స్థాయిలో వైద్యాధికారి, కమ్యూనిటీ హెల్త్ అధికారి, ల్యాబ్ టెక్నిషియన్ ఆశా కార్యకర్త, సర్పంచి, పంచాయతీ కార్యదర్శి హెల్త్ సూపర్వైజర్ సేవలను అందించనున్నారు.
నాలుగు నెలల పాటు వైద్యం
ఈనెల నుంచి నాలుగు నెలల పాటు ప్రత్యేక బృందాల పర్యవేక్షణ ఉంటుంది. వీరంతా పల్లెలు, పట్టణాల్లో ఎక్కడైనా మలేరియా, డెంగీ, టైపాయిడ్, విషజ్వరాల బారిన ప్రజలు పడినట్లు తెలియగానే వెంటనే వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటారు. ఇంటింటికీ వెళ్లి సర్వే చేసి రక్త పరీక్షలు చేసి, అవసరమైతే చికిత్స అందిస్తారు. గత జనవరి నుంచి జూన్ వరకు ప్రాథమిక ఆరోగ్య స్థాయిలో డెంగీకి గురైన వారిని గుర్తించి కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు.
మందుల కొరత లేదు
జిల్లాలోని అన్ని ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. వివిధ రకాల జ్వరాల నివారణకు ఔషధాలతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు సరిపడా సిద్ధంగా ఉండేలా కమిటీలు పర్యవేక్షిస్తున్నాయి. ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా జిల్లా వైద్యాధికారి, అదనపు కలెక్టర్, పాలనాధికారిణికి నివేదిస్తారు. గ్రామాల్లో ముందు జాగ్రత్త చర్యగా అయిదేళ్లలోపు ఉన్న చిన్నారులు కుటుంబాలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఆశా కార్యకర్తలు పంపిణీ చేస్తున్నారు.
గతంలో నమోదైన ప్రాంతాల్లో
మూడేళ్లలో వానాకాలంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్యానికి గురయిన ప్రాంతాలపై దృష్టి పెడుతున్నారు. వికారాబాద్ పట్టణం, ధారూర్, మోమిన్పేట, బషీరాబాద్, యాలాల, దౌల్తాబాద్, అంగడి రాయిచూర్ ఉన్నాయి. ఆయా గ్రామాల పరిధిలో వైద్యాధికారులు, ఆశా కార్యకర్తలు ఏఎన్ఏంలు పర్యటిస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నారు.
అవగాహన కల్పిస్తున్న వైద్యసిబ్బంది
నీటిని నిలువ ఉంచొద్దు
డాక్టర్ తుకారాంభట్, జిల్లా వైద్యాధికారి, వికారాబాద్
కాలానుగుణ వ్యాధులను వ్యాప్తి చేసే దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలు రాగానే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలి. ప్రతి శుక్రవారం పొడిదినం పాటించాలని ఆదేశాలు జారీ చేశాం. జిల్లాలోని అన్ని ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉన్నాయి. నీటిని నిలువ ఉంచొద్దని ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పిస్తున్నారు.
రక్త నమూనా సేకరణ పెంచాం
డాక్టర్ సాయిబాబా, జిల్లా మలేరియా నివారణ అధికారి
జిల్లా వ్యాప్తంగా వైద్య బృందం ఇంటింటికీ వెళుతున్నారు. ఒక్కొ రోజు 100 నుంచి 150 ఇళ్ల వద్దకు ఈ బృందం వెళ్లి అనుమానం ఉన్నట్లయితే రక్త నమూనాలను సేకరిస్తున్నారు. జనవరి నుంచి జూన్ వరకు 700 రక్త నమూనాలను సేకరించి వాటిని టీహాబ్కు, జిల్లా ఆసుపత్రికి పంపించాం. గతేడాది కేవలం 126 రక్త నమూనాలనే సేకరించాం. ఈ సారి సేకరణ పెంచాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
[ 26-04-2024]
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని అలెన్ హెర్బల్ కంపెనీలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
[ 26-04-2024]
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
[ 26-04-2024]
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ముఠా అరెస్టు
[ 26-04-2024]
సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ముఠాను దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. -
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
[ 26-04-2024]
భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులను హెచ్ఎండీఏ పరిధిలో ఇక నుంచి ఏకగవాక్ష పద్ధతిలో జారీ చేయనున్నారు. గతంలో అందుబాటులోకి తెచ్చిన తెలంగాణ స్టేట్ లేఅవుట్ అండ్ బిల్డింగ్ పర్మిషన్ ఆమోదం, స్వీయ ధ్రువీకరణ వ్యవస్థ(టీఎస్బీపాస్) ద్వారానే అనుమతులు మంజూరు చేస్తారు. -
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
[ 26-04-2024]
ఎన్నికలంటే ఎప్పుడైనా సందడే.. ఓటర్లను కూడగట్టడం ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న పని. ప్రస్తుత ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కు ఎంతో ప్రతిష్ఠాత్మకమని భావిస్తున్నారు. -
కూకట్పల్లిలో హత్యాచారం కేసు.. 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
[ 26-04-2024]
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
నేతలు రోడ్డెక్కె.. ప్రచారం వేడెక్కె
[ 26-04-2024]
రాజధానిలో లోక్సభ ఎన్నికల్లో ప్రచారం వేడెక్కింది. మొన్నటివరకు అభ్యర్థులు ఖరారు కాకపోవడం.. ఎండలు మండిపోతుండటంతో జనంలోకి వెళ్లడానికి నేతలు వెనకాముందాడారు. ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో పార్టీల్లో కదలిక వచ్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
కేరింతలతో హోరెత్తె..
[ 26-04-2024]
సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్కు క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు. పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. -
నగరాన.. సీఎం సుడిగాలి పర్యటన
[ 26-04-2024]
సీఎం రేవంత్రెడ్డి గురువారం నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. ఇటీవల మధుయాస్కి తల్లి మృతి చెందడంతో ఉదయం హయత్నగర్లోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. -
స్మార్ట్గా ఓటర్లకు చేరువ
[ 26-04-2024]
ఎన్నికలంటే పార్టీలు, అభ్యర్థుల పాటలతో బస్తీలు మార్మోగేవి. కార్యకర్తలు, అభిమానులు పార్టీ జెండాలు, కండువాలతో పెద్దఎత్తున ఇంటింటి ప్రచారం నిర్వహించేవారు. -
దోమా దోమ.. ఇం‘ధనం ఏదమ్మా’?
[ 26-04-2024]
జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం దోపిడీకి చిరునామాగా మారింది. ఫాగింగ్ పేరుతో కొందరు జోనల్ స్థాయి అధికారులు డీజిల్ను అమ్మేసుకుంటున్నారు. -
ముగిసిన మొదటి పర్వం
[ 26-04-2024]
రాజధానిలోని నాలుగు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. -
రూ.వంద కోట్లు దాటినా.. ఇచ్చింది సున్నా
[ 26-04-2024]
శివార్లలో మురుగు నిర్వహణకు సంబంధించి నిధుల విడుదలలో బల్దియా జాప్యంతో జలమండలి మల్లగుల్లాలు పడుతోంది. 13 నెలలుగా ఒక్క పైసా కూడా బల్దియా నుంచి జలమండలి ఖాతాకు జమ కావడంలేదని అధికారులు వాపోతున్నారు. -
జేఈఈ మెయిన్స్లో సత్తా
[ 26-04-2024]
ఇంజినీర్ కావడానికి ఐఐటీల్లోనే చదవాలన్న సంకల్పంతో రెండేళ్లు వారు అహర్నిశలు కష్టపడ్డారు. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో సత్తా చాటారు. వంద శాతం పర్సంటైల్ సాధించి ప్రతిభ కనబరిచారు. -
శేషగిరికి కన్నీటి వీడ్కోలు
[ 26-04-2024]
విధుల్లో ఉన్న సమయంలో ఏకే-47 తుపాకీ ప్రమాదవశాత్తు పేలడంతో మృతిచెందిన సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరి(47)కు నగరవాసులు కన్నీటి వీడ్కోలు పలికారు. -
తలసరి ఆదాయమేకాదు.. కరెంట్ వినయోగంలోనూ టాప్
[ 26-04-2024]
ఐటీ సంస్థలు.. ఏరో సెజ్లు.. డాటా కేంద్రాలు, అంతర్జాతీయ విమానాశ్రయం.. పరిశ్రమలు.. ఈ-మొబిలిటీ వ్యాలీ.. ఆకాశహార్మ్యాలు... కన్వెన్షన్ సెంటర్లు.. వినోద కేంద్రాలు.. విద్యాసంస్థలు.. వ్యవసాయ ఉత్పత్తులకు నిలయంగా ఉన్న రంగారెడ్డి జోన్ పరిధిలో అత్యధిక కరెంట్ డిమాండ్ ఉంటోంది. -
ఐపీఎల్ టికెట్ల గోల్మాల్పై చర్యలకు డిమాండ్
[ 26-04-2024]
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్ల గోల్మాల్, బ్లాక్ దందాపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి డిమాండ్ చేశారు. -
మంగళ్ ‘హాట్ ఠాణా’
[ 26-04-2024]
శాంతిభద్రతలపరంగా మంగళ్హాట్ ఠాణా అతి సున్నితమైంది. పోలీస్ స్టేషన్లో కొందరు అధికారులు, సిబ్బంది అవినీతి, అక్రమాలతో అప్రతిష్ఠ మూటగట్టుకుంటోంది. -
నినాదాల హోరు.. కాంగ్రెస్ శ్రేణుల జోరు
[ 26-04-2024]
రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్లో గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించిన రోడ్డుషో సందడిగా సాగింది. ఉప్పర్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. -
అధ్యాపకుల కొరత.. అసౌకర్యాల వెత
[ 26-04-2024]
జిల్లాలో ఈసారి ఇంటర్ ద్వితీయ ఫలితాలు ఒక మెట్టు కిందకే ఉండటం అటు అధ్యాపకులను, ఇటు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో ప్రథమ సంవత్సరంలో మాత్రం మెరుగైన ఫలితం రావడం అందరికీ సంతోషదాయకంగా ఉంది. -
దేవాదాయ భూముల రక్షణకు సమష్టి కృషి
[ 26-04-2024]
దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు పాలనాధికారి లింగ్యానాయక్ అన్నారు. -
న్యాయమూర్తులకు ఘనంగా వీడ్కోలు
[ 26-04-2024]
ఉద్యోగ జీవితంలో బదిలీలు అనివార్య ప్రక్రియ అని రంగారెడ్డి జిల్లా కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిధర్రెడ్డి అన్నారు. -
ముగిసిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు
[ 26-04-2024]
వారం రోజులుగా అట్టహాసంగా కొనసాగిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలు గురువారం చక్రస్నానం, ధ్వజావరోహణంతో ముగిశాయి. -
‘అభివృద్ధి మరిచి తిట్లతో పాలిస్తున్నారు’
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి తిట్ల పురాణంతో పాలన సాగిస్తుందని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. -
రేవంత్రెడ్డి సభలో స్పృహ తప్పిన కార్యకర్త
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం అత్తాపూర్లో నిర్వహించిన రోడ్డుషోలో ప్రసంగిస్తుండగా ఆయన ముందున్న కార్యకర్తల్లో ఒకరు స్పృహ తప్పి పడిపోయారు. -
రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి: రోనాల్డ్ రాస్
[ 26-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది, అధికారుల రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్రాస్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!