logo

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం

వేర్వేరు రహదారి ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. మేడిపల్లి పోలీసుల కథనం ప్రకారం.. బోడుప్పల్‌కు చెందిన బి.రవికుమార్‌, కౌసల్య భార్యాభర్తలు. కౌసల్య మేడిపల్లి డీమార్ట్‌లో సెక్యూరిటీ విధులు నిర్వహిస్తోంది. సోమవారం ఉదయం

Published : 05 Jul 2022 01:21 IST

మేడిపల్లి (బోడుప్పల్‌), మేడ్చల్‌, న్యూస్‌టుడే: వేర్వేరు రహదారి ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. మేడిపల్లి పోలీసుల కథనం ప్రకారం.. బోడుప్పల్‌కు చెందిన బి.రవికుమార్‌, కౌసల్య భార్యాభర్తలు. కౌసల్య మేడిపల్లి డీమార్ట్‌లో సెక్యూరిటీ విధులు నిర్వహిస్తోంది. సోమవారం ఉదయం ఆమె విధులకు వెళ్తుండగా మేడిపల్లి డీమార్ట్‌ వద్ద రోడ్డు దాటుతుండగా టాటా ఏస్‌ వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన కౌసల్యను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సోమవారం మధ్యాహ్నం మేడిపల్లికి చెందిన ఎడ్ల నర్సిరెడ్డి(58) తన స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంపై పూసల గోదాం రహదారిలో ప్రయాణిస్తుండగా.. ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో నర్సిరెడ్డి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

భువనగిరి జిల్లా రాజంపేట మండలం సింగన్నగూడేనికి చెందిన కన్నెగుల్ల శ్రీనివాస్‌, భార్య కన్నెగుల్ల రజని(52)లు మియాపూర్‌లో నివాసం ఉంటున్నారు. సోమవారం స్వగ్రామం సింగన్నగూడెం నుంచి మియాపూర్‌కు ద్విచక్ర వాహనంపై వస్తుండగా.. మేడ్చల్‌ చెక్‌పోస్ట్‌ కూడలి వద్ద రోడ్డు దాటేందుకు వేచి ఉండగా వెనక నుంచి లారీ ఢీకొట్టింది. రజని అక్కడికక్కడే మృతి చెందింది. శ్రీనివాస్‌కు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మేడ్చల్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని