రోబోటిక్ సర్జరీని బీమా పథకాల్లో చేర్చాలి
ప్రైవేటు, ప్రభుత్వ ఆరోగ్య బీమా సంస్థలు నేడు విస్తృతమవుతున్న రోబోటిక్ సర్జరీని తమ బీమా పథకాల్లో చేర్చాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. శనివారం నానక్రాంగూడ షెరటన్ హోటల్లో అసోసియేషన్ ఆఫ్ గైనకాలజికల్ రోబోటిక్ సర్జన్స్ (ఏజీఆర్ఎస్) ఆధ్వర్యంలో రెండు రోజులపాటు
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
మొదటి రోబోటిక్ గైన్ ఇండియా సదస్సు ప్రారంభం
రాయదుర్గం, న్యూస్టుడే: ప్రైవేటు, ప్రభుత్వ ఆరోగ్య బీమా సంస్థలు నేడు విస్తృతమవుతున్న రోబోటిక్ సర్జరీని తమ బీమా పథకాల్లో చేర్చాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. శనివారం నానక్రాంగూడ షెరటన్ హోటల్లో అసోసియేషన్ ఆఫ్ గైనకాలజికల్ రోబోటిక్ సర్జన్స్ (ఏజీఆర్ఎస్) ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న తొలి ‘రోబోటిక్ గైన్ఇండియా 2022’ సదస్సును ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. గవర్నర్ మాట్లాడుతూ.. ‘‘భారత్లో ఆధునిక సాంకేతికతలను పరిచయం చేసినపుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఏ చిన్న సమస్య వచ్చినా తర్వాత రోగికి వినియోగించడం కష్టం. వృత్తిరీత్యా చేసే పరిశోధనలను జర్నళ్లలో ప్రచురితం చేయాలి. తద్వారా వాటిని ఇతరులు ఉపయోగించుకుని మరింత మెరుగైన సేవలందిస్తారు. రోబోటిక్స్ సర్జరీ వంటి సేవలు ఆర్థికంగా భారం కాకుండా మరింత చేరువయ్యేలా చూడాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి చెందుతున్న వైద్య విధానాలను బీమా సంస్థలు తమ పథకాల్లో అమలు చేయాలి’’ అని సూచించారు. ఏజీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షురాలు డా.రుమా సిన్హా మాట్లాడుతూ.. రోబోటిక్ సర్జరీతో మెరుగైన సానుకూలతలు ఉంటాయని, తక్కువ రక్తం నష్టం, శరీరంపై తక్కువ కోతలు, ఆసుపత్రిలో రోగులు గడపాల్సిన సమయం కూడా తక్కువగా ఉంటుందని చెప్పారు. ప్రముఖ వైద్య నిపుణుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మహేంద్ర భండారీ పాల్గొన్నారు.
లక్ష్యం బలంగా ఉంటేనే విజయం
బేగంపేట: ఏ రంగంలోనైనా లక్ష్యం బలంగా ఉంటేనే విజయం సాధ్యమవుతుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) ఆధ్వర్యంలో కంపెనీ సెక్రటరీల 46వ సదరన్ ఇండియా ప్రాంతీయ సదస్సు బేగంపేటలోని ఓ హోటల్లో శనివారం జరిగింది. గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై సదస్సును ప్రారంభించారు. దేశంలో గత 70 ఏళ్లలో 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థికాభివృద్ధి సాధ్యపడితే తాజాగా 2025 వరకు 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా ప్రధాని మోదీ ముందుకు పోతున్నారన్నారు. కుటుంబ సభ్యులకంటే వ్యక్తిగత కార్యదర్శులతోనే ఎక్కువగా గడుపుతుంటామని చెప్తూ సహాయకులైన సెక్రటరీలు మంచివారైతే అంతా మంచే జరుగుతుందన్నారు. సెక్రటరీలు మంచివారిగా కనిపించకపోతే వారిలోని మంచినే ఎంచుకోవాలని సూచించారు. కంపెనీల విషయంలో ఇదే వర్తిస్తుందని, మంచి సెక్రటరీలుంటే సంస్థల ఎదుగుదలకు దోహదం చేస్తుందన్నారు. ముఖ్యంగా కార్పొరేట్ అధినేతలకు మంచి సెక్రటరీల అవసరం ఎంతో ఉంటుందని అభిప్రాయపడ్డారు. అంతకుముందు ఐసీఎస్ఐ సావనీర్ను గవర్నర్ ఆవిష్కరించారు. ఐసీఎస్ఐ జాతీయాధ్యక్షుడు దేవేంద్ర వి.దేశ్పాండే మాట్లాడుతూ.. సంస్థల మనుగడలో ఎదురయ్యే ప్రతీ సమస్యకు కోర్టులను ఆశ్రయించకుండా చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు వీలుగా జాతీయస్థాయిలో ఆర్బిట్రేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ కేంద్రంగా ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటు జరుగుతుందని, త్వరలో దేశవ్యాప్తంగా 20వరకు ఆర్బిట్రేషన్ సెంటర్లను ఏర్పాటుచేసే యోచన ఉన్నట్లు వెల్లడించారు. హరేకృష్ణ మూవ్మెంట్ అధ్యక్షుడు సత్యగౌర చంద్రదాస్ స్వామీజి ప్రసంగించారు. సదస్సులో ఐసీఎస్ఐ సెంట్రల్ కౌన్సిల్ సభ్యులు ఆహ్లాదరావు, ఎస్ఐఆర్సీ ఛైర్మన్ శేఖర్బాబు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
[ 26-04-2024]
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ముఠా అరెస్టు
[ 26-04-2024]
సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ముఠాను దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. -
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
[ 26-04-2024]
భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులను హెచ్ఎండీఏ పరిధిలో ఇక నుంచి ఏకగవాక్ష పద్ధతిలో జారీ చేయనున్నారు. గతంలో అందుబాటులోకి తెచ్చిన తెలంగాణ స్టేట్ లేఅవుట్ అండ్ బిల్డింగ్ పర్మిషన్ ఆమోదం, స్వీయ ధ్రువీకరణ వ్యవస్థ(టీఎస్బీపాస్) ద్వారానే అనుమతులు మంజూరు చేస్తారు. -
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
[ 26-04-2024]
ఎన్నికలంటే ఎప్పుడైనా సందడే.. ఓటర్లను కూడగట్టడం ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న పని. ప్రస్తుత ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కు ఎంతో ప్రతిష్ఠాత్మకమని భావిస్తున్నారు. -
కూకట్పల్లిలో హత్యాచారం కేసు.. 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
[ 26-04-2024]
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
నేతలు రోడ్డెక్కె.. ప్రచారం వేడెక్కె
[ 26-04-2024]
రాజధానిలో లోక్సభ ఎన్నికల్లో ప్రచారం వేడెక్కింది. మొన్నటివరకు అభ్యర్థులు ఖరారు కాకపోవడం.. ఎండలు మండిపోతుండటంతో జనంలోకి వెళ్లడానికి నేతలు వెనకాముందాడారు. ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో పార్టీల్లో కదలిక వచ్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
కేరింతలతో హోరెత్తె..
[ 26-04-2024]
సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్కు క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు. పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. -
నగరాన.. సీఎం సుడిగాలి పర్యటన
[ 26-04-2024]
సీఎం రేవంత్రెడ్డి గురువారం నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. ఇటీవల మధుయాస్కి తల్లి మృతి చెందడంతో ఉదయం హయత్నగర్లోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. -
స్మార్ట్గా ఓటర్లకు చేరువ
[ 26-04-2024]
ఎన్నికలంటే పార్టీలు, అభ్యర్థుల పాటలతో బస్తీలు మార్మోగేవి. కార్యకర్తలు, అభిమానులు పార్టీ జెండాలు, కండువాలతో పెద్దఎత్తున ఇంటింటి ప్రచారం నిర్వహించేవారు. -
దోమా దోమ.. ఇం‘ధనం ఏదమ్మా’?
[ 26-04-2024]
జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం దోపిడీకి చిరునామాగా మారింది. ఫాగింగ్ పేరుతో కొందరు జోనల్ స్థాయి అధికారులు డీజిల్ను అమ్మేసుకుంటున్నారు. -
ముగిసిన మొదటి పర్వం
[ 26-04-2024]
రాజధానిలోని నాలుగు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. -
రూ.వంద కోట్లు దాటినా.. ఇచ్చింది సున్నా
[ 26-04-2024]
శివార్లలో మురుగు నిర్వహణకు సంబంధించి నిధుల విడుదలలో బల్దియా జాప్యంతో జలమండలి మల్లగుల్లాలు పడుతోంది. 13 నెలలుగా ఒక్క పైసా కూడా బల్దియా నుంచి జలమండలి ఖాతాకు జమ కావడంలేదని అధికారులు వాపోతున్నారు. -
జేఈఈ మెయిన్స్లో సత్తా
[ 26-04-2024]
ఇంజినీర్ కావడానికి ఐఐటీల్లోనే చదవాలన్న సంకల్పంతో రెండేళ్లు వారు అహర్నిశలు కష్టపడ్డారు. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో సత్తా చాటారు. వంద శాతం పర్సంటైల్ సాధించి ప్రతిభ కనబరిచారు. -
శేషగిరికి కన్నీటి వీడ్కోలు
[ 26-04-2024]
విధుల్లో ఉన్న సమయంలో ఏకే-47 తుపాకీ ప్రమాదవశాత్తు పేలడంతో మృతిచెందిన సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరి(47)కు నగరవాసులు కన్నీటి వీడ్కోలు పలికారు. -
తలసరి ఆదాయమేకాదు.. కరెంట్ వినయోగంలోనూ టాప్
[ 26-04-2024]
ఐటీ సంస్థలు.. ఏరో సెజ్లు.. డాటా కేంద్రాలు, అంతర్జాతీయ విమానాశ్రయం.. పరిశ్రమలు.. ఈ-మొబిలిటీ వ్యాలీ.. ఆకాశహార్మ్యాలు... కన్వెన్షన్ సెంటర్లు.. వినోద కేంద్రాలు.. విద్యాసంస్థలు.. వ్యవసాయ ఉత్పత్తులకు నిలయంగా ఉన్న రంగారెడ్డి జోన్ పరిధిలో అత్యధిక కరెంట్ డిమాండ్ ఉంటోంది. -
ఐపీఎల్ టికెట్ల గోల్మాల్పై చర్యలకు డిమాండ్
[ 26-04-2024]
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్ల గోల్మాల్, బ్లాక్ దందాపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి డిమాండ్ చేశారు. -
మంగళ్ ‘హాట్ ఠాణా’
[ 26-04-2024]
శాంతిభద్రతలపరంగా మంగళ్హాట్ ఠాణా అతి సున్నితమైంది. పోలీస్ స్టేషన్లో కొందరు అధికారులు, సిబ్బంది అవినీతి, అక్రమాలతో అప్రతిష్ఠ మూటగట్టుకుంటోంది. -
నినాదాల హోరు.. కాంగ్రెస్ శ్రేణుల జోరు
[ 26-04-2024]
రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్లో గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించిన రోడ్డుషో సందడిగా సాగింది. ఉప్పర్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. -
అధ్యాపకుల కొరత.. అసౌకర్యాల వెత
[ 26-04-2024]
జిల్లాలో ఈసారి ఇంటర్ ద్వితీయ ఫలితాలు ఒక మెట్టు కిందకే ఉండటం అటు అధ్యాపకులను, ఇటు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో ప్రథమ సంవత్సరంలో మాత్రం మెరుగైన ఫలితం రావడం అందరికీ సంతోషదాయకంగా ఉంది. -
దేవాదాయ భూముల రక్షణకు సమష్టి కృషి
[ 26-04-2024]
దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు పాలనాధికారి లింగ్యానాయక్ అన్నారు. -
న్యాయమూర్తులకు ఘనంగా వీడ్కోలు
[ 26-04-2024]
ఉద్యోగ జీవితంలో బదిలీలు అనివార్య ప్రక్రియ అని రంగారెడ్డి జిల్లా కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిధర్రెడ్డి అన్నారు. -
ముగిసిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు
[ 26-04-2024]
వారం రోజులుగా అట్టహాసంగా కొనసాగిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలు గురువారం చక్రస్నానం, ధ్వజావరోహణంతో ముగిశాయి. -
‘అభివృద్ధి మరిచి తిట్లతో పాలిస్తున్నారు’
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి తిట్ల పురాణంతో పాలన సాగిస్తుందని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. -
రేవంత్రెడ్డి సభలో స్పృహ తప్పిన కార్యకర్త
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం అత్తాపూర్లో నిర్వహించిన రోడ్డుషోలో ప్రసంగిస్తుండగా ఆయన ముందున్న కార్యకర్తల్లో ఒకరు స్పృహ తప్పి పడిపోయారు. -
రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి: రోనాల్డ్ రాస్
[ 26-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది, అధికారుల రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్రాస్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్