Hyd News: మోయలేనంత రుసుం..చెల్లించకపోతే జులుం
మనం పడే కష్టాలు మన పిల్లలు పడొద్దు.. ఒళ్లు హూనం చేసుకొనైనా కష్టపడి పిల్లలను ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదివిద్దాం.. ఫీజులు మోయలేనంత భారమైనా అప్పోసప్పో చేసి చెల్లిద్దామని తల్లిదండ్రులు భావిస్తున్నారు.
ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్న ‘కార్పొరేట్’ కళాశాలలు
తీవ్ర ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు
ఈనాడు, హైదరాబాద్
గాంధీ ఆసుపత్రి వద్ద రోదిస్తున్న క్షతగాత్రుడు సందీప్ కుటుంబసభ్యులు
మనం పడే కష్టాలు మన పిల్లలు పడొద్దు.. ఒళ్లు హూనం చేసుకొనైనా కష్టపడి పిల్లలను ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదివిద్దాం.. ఫీజులు మోయలేనంత భారమైనా అప్పోసప్పో చేసి చెల్లిద్దామని తల్లిదండ్రులు భావిస్తున్నారు. లక్షలాది రూపాయల ఫీజులు దాదాపుగా చెల్లిస్తున్నారు. ఎప్పుడో పరిస్థితులు తారుమారైన సమయంలో కొద్దోగొప్పో కట్టకపోతే సర్టిఫికెట్లు నిలిపేయడం చేస్తున్నాయి రాష్ట్రంలో కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలు. పెద్దసంఖ్యలో విద్యాశాఖకు ఫిర్యాదులు అందుతున్నప్పటికీ.. కనీస స్పందన కొరవడుతోందన్న విమర్శలు ఉన్నాయి. ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ సహా వివిధ కోర్సుల కళాశాలల ఫీజుల విషయంలో దోపిడీకి గురవుతున్నారు. తాజాగా రామంతాపూర్ నారాయణ కళాశాలలో చోటుచేసుకున్న ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది.
కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా పలువురు తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి తల్లకిందులైంది. ఫీజులు చెల్లించలేని పరిస్థితికి చేరారు. అటు తల్లిదండ్రులు దయనీయ స్థితి.. ఇటు కళాశాలల యాజమాన్యాల దోపిడీ మధ్య విద్యార్థులు బలవుతున్నారు. కొన్ని కార్పొరేట్, ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలు రెండేళ్లకు రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇంటర్తోపాటు ఎంసెట్, ఐఐటీ-జేఈఈలకు తర్ఫీదు ఇస్తూ అదనపు ఫీజులు దండుకుంటున్నాయి. ఫీజులపై నియంత్రణ లేక తల్లిదండ్రులు అప్పులు తెచ్చి మరీ కడుతున్నారు. ఇంజినీరింగ్, డిగ్రీ, ఫార్మసీ, ఎంబీఏ కళాశాలల్లోనూ ఫీజుల దోపిడీ అధికంగా ఉంది. డొనేషన్ల పేరిట రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం బీటెక్ మేనేజ్మెంట్ సీటును రూ.5-10 లక్షల మధ్య అమ్ముకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. విద్యార్థుల చదువు పూర్తయ్యాక బదిలీ సర్టిఫికెట్(టీసీ), ఒరిజినల్ మార్కుల మెమో, డిగ్రీ పట్టాలు, ప్రొవిజినల్స్ వంటివి తీసుకునేందుకు కళాశాలలనే ఆశ్రయించాల్సి వస్తోంది. ఇంజినీరింగ్ కళాశాలల్లో పరీక్షలు రాసేందుకు వీల్లేకుండా హాల్టికెట్లు నిలిపేస్తున్నారు. ఇలా ఏవో ఒక పత్రాలను అడ్డం పెట్టుకుని సతాయిస్తున్నారు.
ఫీజులపై నియంత్రణేదీ?
కళాశాలల స్థాయిలో ఫీజులపై నియంత్రణ కొరవడుతోంది. వాస్తవానికి పాఠశాలల స్థాయిలో మరుసటి ఏడాదికి పది శాతానికి మించి ఫీజులు పెంచకూడదని కేబినెట్ సబ్కమిటీ గత మార్చిలో భేటీ అయి పలు సూచనలు చేసింది. ఇవి నేటికీ అమల్లోకి తీసుకురాలేదు. కళాశాల స్థాయిలో ఫీజులపై ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో ఇంటర్, డిగ్రీ స్థాయిలో ప్రైవేటు కళాశాలల్లో ఇష్టారాజ్యంగా నిర్ణయించి వసూలు చేస్తున్నారు.
రీయింబర్స్మెంట్ రాక..
కళాశాలలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు బకాయిలు సకాలంలో విడుదల కావడం లేదు. పేద విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ను నమ్ముకుని విద్యనభ్యసిస్తున్నారు. ఫీజులు సకాలంలో విడుదల కావడం లేదు. రాష్ట్రంలో రూ.3,900 కోట్ల బకాయిలు పెండింగులో ఉన్నాయి. ఈ ఫీజు బకాయిలు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని కళాశాల యాజమాన్యాలు చెబుతున్నాయి. రూ.లక్షలు చెల్లించలేక ఉన్నత విద్యకు వెళ్లే దారి లేక ఇబ్బందులు పడుతున్నారు.
ఖండించిన విద్యార్థి సంఘాలు
ఈనాడు, హైదరాబాద్, అంబర్పేట, న్యూస్టుడే: రామంతాపూర్ నారాయణ కళాశాలలో ఫీజు బకాయి విషయంలో శుక్రవారం జరిగిన ఘటనను పలు విద్యార్థి సంఘాలు ఖండించాయి. కార్పొరేట్ కళాశాలల్లో ఫీజులు నియంత్రించే వరకు ఉద్యమిస్తామని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్రెడ్డి, కేంద్ర కమిటీ సభ్యుడు పి.శ్రీహరి వేర్వేరు ప్రకటనలో విమర్శించారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్లు పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.పరశురాం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎల్.మూర్తి తెలిపారు. అంబర్పేటలో ధర్నా చేస్తున్న విద్యార్థి నాయకులను అరెస్టు చేయడాన్ని డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేశ్ ఖండించారు. ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు దీపక్కుమార్ డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
[ 26-04-2024]
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
[ 26-04-2024]
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ముఠా అరెస్టు
[ 26-04-2024]
సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ముఠాను దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. -
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
[ 26-04-2024]
భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులను హెచ్ఎండీఏ పరిధిలో ఇక నుంచి ఏకగవాక్ష పద్ధతిలో జారీ చేయనున్నారు. గతంలో అందుబాటులోకి తెచ్చిన తెలంగాణ స్టేట్ లేఅవుట్ అండ్ బిల్డింగ్ పర్మిషన్ ఆమోదం, స్వీయ ధ్రువీకరణ వ్యవస్థ(టీఎస్బీపాస్) ద్వారానే అనుమతులు మంజూరు చేస్తారు. -
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
[ 26-04-2024]
ఎన్నికలంటే ఎప్పుడైనా సందడే.. ఓటర్లను కూడగట్టడం ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న పని. ప్రస్తుత ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కు ఎంతో ప్రతిష్ఠాత్మకమని భావిస్తున్నారు. -
కూకట్పల్లిలో హత్యాచారం కేసు.. 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
[ 26-04-2024]
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
నేతలు రోడ్డెక్కె.. ప్రచారం వేడెక్కె
[ 26-04-2024]
రాజధానిలో లోక్సభ ఎన్నికల్లో ప్రచారం వేడెక్కింది. మొన్నటివరకు అభ్యర్థులు ఖరారు కాకపోవడం.. ఎండలు మండిపోతుండటంతో జనంలోకి వెళ్లడానికి నేతలు వెనకాముందాడారు. ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో పార్టీల్లో కదలిక వచ్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
కేరింతలతో హోరెత్తె..
[ 26-04-2024]
సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్కు క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు. పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. -
నగరాన.. సీఎం సుడిగాలి పర్యటన
[ 26-04-2024]
సీఎం రేవంత్రెడ్డి గురువారం నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. ఇటీవల మధుయాస్కి తల్లి మృతి చెందడంతో ఉదయం హయత్నగర్లోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. -
స్మార్ట్గా ఓటర్లకు చేరువ
[ 26-04-2024]
ఎన్నికలంటే పార్టీలు, అభ్యర్థుల పాటలతో బస్తీలు మార్మోగేవి. కార్యకర్తలు, అభిమానులు పార్టీ జెండాలు, కండువాలతో పెద్దఎత్తున ఇంటింటి ప్రచారం నిర్వహించేవారు. -
దోమా దోమ.. ఇం‘ధనం ఏదమ్మా’?
[ 26-04-2024]
జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం దోపిడీకి చిరునామాగా మారింది. ఫాగింగ్ పేరుతో కొందరు జోనల్ స్థాయి అధికారులు డీజిల్ను అమ్మేసుకుంటున్నారు. -
ముగిసిన మొదటి పర్వం
[ 26-04-2024]
రాజధానిలోని నాలుగు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. -
రూ.వంద కోట్లు దాటినా.. ఇచ్చింది సున్నా
[ 26-04-2024]
శివార్లలో మురుగు నిర్వహణకు సంబంధించి నిధుల విడుదలలో బల్దియా జాప్యంతో జలమండలి మల్లగుల్లాలు పడుతోంది. 13 నెలలుగా ఒక్క పైసా కూడా బల్దియా నుంచి జలమండలి ఖాతాకు జమ కావడంలేదని అధికారులు వాపోతున్నారు. -
జేఈఈ మెయిన్స్లో సత్తా
[ 26-04-2024]
ఇంజినీర్ కావడానికి ఐఐటీల్లోనే చదవాలన్న సంకల్పంతో రెండేళ్లు వారు అహర్నిశలు కష్టపడ్డారు. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో సత్తా చాటారు. వంద శాతం పర్సంటైల్ సాధించి ప్రతిభ కనబరిచారు. -
శేషగిరికి కన్నీటి వీడ్కోలు
[ 26-04-2024]
విధుల్లో ఉన్న సమయంలో ఏకే-47 తుపాకీ ప్రమాదవశాత్తు పేలడంతో మృతిచెందిన సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరి(47)కు నగరవాసులు కన్నీటి వీడ్కోలు పలికారు. -
తలసరి ఆదాయమేకాదు.. కరెంట్ వినయోగంలోనూ టాప్
[ 26-04-2024]
ఐటీ సంస్థలు.. ఏరో సెజ్లు.. డాటా కేంద్రాలు, అంతర్జాతీయ విమానాశ్రయం.. పరిశ్రమలు.. ఈ-మొబిలిటీ వ్యాలీ.. ఆకాశహార్మ్యాలు... కన్వెన్షన్ సెంటర్లు.. వినోద కేంద్రాలు.. విద్యాసంస్థలు.. వ్యవసాయ ఉత్పత్తులకు నిలయంగా ఉన్న రంగారెడ్డి జోన్ పరిధిలో అత్యధిక కరెంట్ డిమాండ్ ఉంటోంది. -
ఐపీఎల్ టికెట్ల గోల్మాల్పై చర్యలకు డిమాండ్
[ 26-04-2024]
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్ల గోల్మాల్, బ్లాక్ దందాపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి డిమాండ్ చేశారు. -
మంగళ్ ‘హాట్ ఠాణా’
[ 26-04-2024]
శాంతిభద్రతలపరంగా మంగళ్హాట్ ఠాణా అతి సున్నితమైంది. పోలీస్ స్టేషన్లో కొందరు అధికారులు, సిబ్బంది అవినీతి, అక్రమాలతో అప్రతిష్ఠ మూటగట్టుకుంటోంది. -
నినాదాల హోరు.. కాంగ్రెస్ శ్రేణుల జోరు
[ 26-04-2024]
రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్లో గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించిన రోడ్డుషో సందడిగా సాగింది. ఉప్పర్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. -
అధ్యాపకుల కొరత.. అసౌకర్యాల వెత
[ 26-04-2024]
జిల్లాలో ఈసారి ఇంటర్ ద్వితీయ ఫలితాలు ఒక మెట్టు కిందకే ఉండటం అటు అధ్యాపకులను, ఇటు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో ప్రథమ సంవత్సరంలో మాత్రం మెరుగైన ఫలితం రావడం అందరికీ సంతోషదాయకంగా ఉంది. -
దేవాదాయ భూముల రక్షణకు సమష్టి కృషి
[ 26-04-2024]
దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు పాలనాధికారి లింగ్యానాయక్ అన్నారు. -
న్యాయమూర్తులకు ఘనంగా వీడ్కోలు
[ 26-04-2024]
ఉద్యోగ జీవితంలో బదిలీలు అనివార్య ప్రక్రియ అని రంగారెడ్డి జిల్లా కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిధర్రెడ్డి అన్నారు. -
ముగిసిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు
[ 26-04-2024]
వారం రోజులుగా అట్టహాసంగా కొనసాగిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలు గురువారం చక్రస్నానం, ధ్వజావరోహణంతో ముగిశాయి. -
‘అభివృద్ధి మరిచి తిట్లతో పాలిస్తున్నారు’
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి తిట్ల పురాణంతో పాలన సాగిస్తుందని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. -
రేవంత్రెడ్డి సభలో స్పృహ తప్పిన కార్యకర్త
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం అత్తాపూర్లో నిర్వహించిన రోడ్డుషోలో ప్రసంగిస్తుండగా ఆయన ముందున్న కార్యకర్తల్లో ఒకరు స్పృహ తప్పి పడిపోయారు. -
రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి: రోనాల్డ్ రాస్
[ 26-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది, అధికారుల రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్రాస్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM